రాబోయేది ఎన్నికల కాలం. వాటిని లక్ష్యంగా చేసుకుని పూర్తి స్థాయి రాజకీయ సినిమాలే తయారవుతున్నాయి ఓ పక్క. అలా కాకుండా రెగ్యులర్ సినిమాల్లోనూ పొలిటికల్ పంచులు పెట్టడం.. ఒక నాయకుడిని తలపించేలా పాత్రలను సృష్టించడం కూడా జరుగుతుంటుంది. నందమూరి బాలకృష్ణ చివరి చిత్రం ‘వీరసింహారెడ్డి’లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెట్టిన కొన్ని డైలాగులు ఎంత చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాకు హైప్ రావడానికి ఆ డైలాగులు కూడా ఒక కారణమే.
బాలయ్యకు సన్నిహితుడైన దర్శకుడు బోయపాటి శ్రీను సైతం తన సినిమాల్లో పరోక్షంగా జగన్ సర్కారును టార్గెట్ చేస్తుంటాడు. ‘సరైనోడు’ సినిమాలో ఆది పినిశెట్టి చేసిన విలన్ పాత్ర.. జగన్ను లక్ష్యంగా చేసుకున్నదే అనే అనుమానాలు బలంగా వినిపించాయి అప్పట్లో. లెజెండ్, అఖండ సినిమాల్లోనూ బోయపాటి రాయించిన కొన్ని డైలాగులు జగన్ అండ్ కోకు పరోక్షంగా తగిలాయి.
ఇప్పుడు బోయపాటి నుంచి ‘స్కంద’ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగులకు కొదవేమీ లేదని సమాచారం. బోయపాటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. అలాగే హీరో రామ్ బంధుగణంలోనూ కొంతమంది టీడీపీలో ఉన్నారు. రామ్ మావయ్య అయిన రమేష్ హాస్పిటల్ అధినేత రామ్ను గతంలో జగన్ సర్కారు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వాన్ని బోయపాటి టార్గెట్ చేస్తూ ఈ సినిమాలో కొన్ని పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు పెట్టాడని సమాచారం. ఇందులో ఒక పాత్ర కూడా ఒక నాయకుడిని గుర్తు తెచ్చేలా ఉంటుందట. ఈ పాత్ర.. సినిమాలోని కొన్ని డైలాగులు కచ్చితంగా రాజకీయంగా ఒక చర్చకు తెర తీస్తాయని అంటున్నారు. సినిమా రిలీజ్ ముందు వరకు వాటిని సీక్రెట్గానే పెడతారని.. రిలీజ్ అయ్యాక వేడి మొదలవుతుందని అంటున్నారు. చూడాలి ఈ గురువారం ‘స్కంద’ పేల్చే బాంబులేంటో?
This post was last modified on September 25, 2023 9:42 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…