సైకో కిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. వినడానికి ఒకే కథల్లా అనిపించినా వాటిని దర్శకులు హ్యాండిల్ చేసే తీరు కాలంతో సంబంధం లేకుండా హిట్లు తెచ్చి పెడుతుంటాయి. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సైకో నుంచి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు దాకా ఇలా ఎన్నో వచ్చాయి. ఫ్లాప్ అయినవి లేకపోలేదు. ముఖ్యంగా వెబ్ సిరీస్ కల్చర్ వచ్చాక వీటి తాకిడి మరింతగా పెరిగింది. ఈ కోవలో వస్తున్న మరో మూవీ గాడ్. పొన్నియిన్ సెల్వన్ నుంచి తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్న జయం రవి హీరోగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నయనతార హీరోయిన్ కావడం కొంత హైప్ తెస్తోంది.
ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు. స్మైలీ బ్రహ్మ(రాహుల్ బోస్)గా పేరు పొందిన హంతకుడు కేవలం టీనేజ్ వయసు దాటని అమ్మాయిలను అతి దారుణంగా హత్య చేస్తూ ఉంటాడు. పోలీసులు పట్టుకుంటారు కానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి మారణకాండ కొనసాగిస్తాడు. ఈ కేసు కోసమే నియమించబడిన పోలీస్ ఆఫీసర్ అర్జున్(జయం రవి)కి జాలిదాయ ఉండవు. అలాంటి వాడిని సైతం భయపడేలా చేస్తాడు బ్రహ్మ. అర్జున్ కో ప్రియురాలు(నయనతార)ఉంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య పులిమేక వేటలో ఎవరు గెలిచారో తేలాలంటే తెరపై చూడాల్సిందే.
విజువల్స్ చాలా డెప్త్ గా ఉన్నాయి. బ్లర్ చేసినప్పటికీ వయొలెంట్ కంటెంట్ ఎక్కువగా దట్టించారు. చిన్నపిల్లలా సంగతి తర్వాత పెద్దలు సైతం భయపడేలా ఉన్నాయి. అయినా కిల్లర్లంటే కేవలం యువతులనే హత్యలు చేసే వాళ్ళుగా పదే పదే ఎందుకు చూపిస్తారో అర్థం కాదు. గతంలో జయం రవితోనే జాంబీ మూవీ మిరుతన్(యమపాశం) తీసిన ఐ అహ్మద్ దీనికి దర్శకుడు. సస్పెన్స్ ఫ్యాక్టర్ పుష్కలంగా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ బోస్ విశ్వరూపం చూపించినట్టున్నాడు. కమింగ్ సూన్ అన్నారు కానీ విడుదల తేదీ లేదు. తమిళ వెర్షన్ సెప్టెంబర్ 28 రానుంది.
This post was last modified on September 25, 2023 9:38 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…