సైకో కిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. వినడానికి ఒకే కథల్లా అనిపించినా వాటిని దర్శకులు హ్యాండిల్ చేసే తీరు కాలంతో సంబంధం లేకుండా హిట్లు తెచ్చి పెడుతుంటాయి. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సైకో నుంచి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు దాకా ఇలా ఎన్నో వచ్చాయి. ఫ్లాప్ అయినవి లేకపోలేదు. ముఖ్యంగా వెబ్ సిరీస్ కల్చర్ వచ్చాక వీటి తాకిడి మరింతగా పెరిగింది. ఈ కోవలో వస్తున్న మరో మూవీ గాడ్. పొన్నియిన్ సెల్వన్ నుంచి తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్న జయం రవి హీరోగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నయనతార హీరోయిన్ కావడం కొంత హైప్ తెస్తోంది.
ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు. స్మైలీ బ్రహ్మ(రాహుల్ బోస్)గా పేరు పొందిన హంతకుడు కేవలం టీనేజ్ వయసు దాటని అమ్మాయిలను అతి దారుణంగా హత్య చేస్తూ ఉంటాడు. పోలీసులు పట్టుకుంటారు కానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి మారణకాండ కొనసాగిస్తాడు. ఈ కేసు కోసమే నియమించబడిన పోలీస్ ఆఫీసర్ అర్జున్(జయం రవి)కి జాలిదాయ ఉండవు. అలాంటి వాడిని సైతం భయపడేలా చేస్తాడు బ్రహ్మ. అర్జున్ కో ప్రియురాలు(నయనతార)ఉంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య పులిమేక వేటలో ఎవరు గెలిచారో తేలాలంటే తెరపై చూడాల్సిందే.
విజువల్స్ చాలా డెప్త్ గా ఉన్నాయి. బ్లర్ చేసినప్పటికీ వయొలెంట్ కంటెంట్ ఎక్కువగా దట్టించారు. చిన్నపిల్లలా సంగతి తర్వాత పెద్దలు సైతం భయపడేలా ఉన్నాయి. అయినా కిల్లర్లంటే కేవలం యువతులనే హత్యలు చేసే వాళ్ళుగా పదే పదే ఎందుకు చూపిస్తారో అర్థం కాదు. గతంలో జయం రవితోనే జాంబీ మూవీ మిరుతన్(యమపాశం) తీసిన ఐ అహ్మద్ దీనికి దర్శకుడు. సస్పెన్స్ ఫ్యాక్టర్ పుష్కలంగా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ బోస్ విశ్వరూపం చూపించినట్టున్నాడు. కమింగ్ సూన్ అన్నారు కానీ విడుదల తేదీ లేదు. తమిళ వెర్షన్ సెప్టెంబర్ 28 రానుంది.
This post was last modified on September 25, 2023 9:38 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…