సైకో కిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. వినడానికి ఒకే కథల్లా అనిపించినా వాటిని దర్శకులు హ్యాండిల్ చేసే తీరు కాలంతో సంబంధం లేకుండా హిట్లు తెచ్చి పెడుతుంటాయి. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సైకో నుంచి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు దాకా ఇలా ఎన్నో వచ్చాయి. ఫ్లాప్ అయినవి లేకపోలేదు. ముఖ్యంగా వెబ్ సిరీస్ కల్చర్ వచ్చాక వీటి తాకిడి మరింతగా పెరిగింది. ఈ కోవలో వస్తున్న మరో మూవీ గాడ్. పొన్నియిన్ సెల్వన్ నుంచి తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకున్న జయం రవి హీరోగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నయనతార హీరోయిన్ కావడం కొంత హైప్ తెస్తోంది.
ఇందాక ట్రైలర్ రిలీజ్ చేశారు. స్మైలీ బ్రహ్మ(రాహుల్ బోస్)గా పేరు పొందిన హంతకుడు కేవలం టీనేజ్ వయసు దాటని అమ్మాయిలను అతి దారుణంగా హత్య చేస్తూ ఉంటాడు. పోలీసులు పట్టుకుంటారు కానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి మారణకాండ కొనసాగిస్తాడు. ఈ కేసు కోసమే నియమించబడిన పోలీస్ ఆఫీసర్ అర్జున్(జయం రవి)కి జాలిదాయ ఉండవు. అలాంటి వాడిని సైతం భయపడేలా చేస్తాడు బ్రహ్మ. అర్జున్ కో ప్రియురాలు(నయనతార)ఉంటుంది. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య పులిమేక వేటలో ఎవరు గెలిచారో తేలాలంటే తెరపై చూడాల్సిందే.
విజువల్స్ చాలా డెప్త్ గా ఉన్నాయి. బ్లర్ చేసినప్పటికీ వయొలెంట్ కంటెంట్ ఎక్కువగా దట్టించారు. చిన్నపిల్లలా సంగతి తర్వాత పెద్దలు సైతం భయపడేలా ఉన్నాయి. అయినా కిల్లర్లంటే కేవలం యువతులనే హత్యలు చేసే వాళ్ళుగా పదే పదే ఎందుకు చూపిస్తారో అర్థం కాదు. గతంలో జయం రవితోనే జాంబీ మూవీ మిరుతన్(యమపాశం) తీసిన ఐ అహ్మద్ దీనికి దర్శకుడు. సస్పెన్స్ ఫ్యాక్టర్ పుష్కలంగా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ బోస్ విశ్వరూపం చూపించినట్టున్నాడు. కమింగ్ సూన్ అన్నారు కానీ విడుదల తేదీ లేదు. తమిళ వెర్షన్ సెప్టెంబర్ 28 రానుంది.
This post was last modified on September 25, 2023 9:38 pm
ఈ మధ్య మన దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ ని లక్ష్యంగా మార్చుకుంటున్నారు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరసగా చేసుకుంటూ…
ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నటిదాకా టెన్షన్ పడిన విషయం ఒకటుంది. కల్కి 2898 ఏడి నిర్మాత అశ్వినిదత్ బహిరంగంగా టిడిపి కూటమికి…
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలూ కొన్నిసార్లు సెన్సేషన్ అవుతుంటాయి. ఆ కోవలోకి వస్తున్నాడు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్. తమిళంలో…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి…
ఇప్పుడంటే సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయి మంచి పాత్రలు పట్టేస్తున్నారు కానీ సీనియర్ హీరోయిన్ టబు తెలుగు ప్రేక్షకులకు నిన్నే పెళ్లాడతా…
జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద, కొల్హన్ లోని దట్టమైన అడవులు మావోయిస్టుల కంచుకోటలు. మావోల ఆదేశాల మేరకు గత 20 ఏళ్లుగా…