ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు శతదినోత్సవం చాలా మాములు విషయం కాని ఇప్పుడలా కాదు. ఒక నెల రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే అదే గొప్ప. ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే ఇంతకు మించి ఆడిన దాఖలాలు కనిపించవు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు సైతం యాభై రోజుల తర్వాత అమాంతం నెమ్మదించినవే. పైగా ఓటిటిల తాకిడిలో మహా అయితే నాలుగు వారాలకు మించి గ్యాప్ దొరకడం లేదు. జైలర్ లాంటి బంపర్ హిట్టే అమెజాన్ ప్రైమ్ లో నెలరోజులకు వచ్చేసింది. కానీ సంక్రాంతి సినిమాలు ఇంకా కొన్ని చోట్ల నాన్ స్టాప్ గా ఆడుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
చిరంజీవి వాల్తేరు వీరయ్య అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్ లో ఇటీవలే 250 రోజులు పూర్తి చేసుకుంది. దీనికి పోటీగా బాలకృష్ణ వీరసింహారెడ్డి ఆలూరులోని శ్రీ లక్ష్మినరసింహ టాకీసులో నిర్విరామంగా ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. అలా అని వీటికి జనం ఇంకా వస్తున్నారాని ఆశ్చర్యపోకండి. ఈ సినిమాల రన్ ని అభిమానులు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ముందు ఎవరు తీస్తారో చూద్దామని బలవంతంగా రోజు నాలుగు షోల చొప్పున ఆడిస్తూనే ఉన్నారు. పట్టుమని పది మంది కూడా రాలేని పరిస్థితిలో ఎందుకీ పంతమంటే దానికి సమాధానం సదరు ఎగ్జిబిటర్ల వద్ద కూడా లేదు.
చోద్యం కాకపోతే ఈ రోజుల్లో కూడా ప్రతిష్ఠకు పోయి ఇలా ఆడించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైపెచ్చు భవిష్యత్ తరాల వారు ఇవి నిజంగానే అన్నేసి రోజులు హౌస్ ఫుల్స్ ఆడాయని అనుకునే ప్రమాదం ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ ఘనవిజయం సాధించినవే కానీ మరీ ఇంత సుదీర్ఘమైన రన్ కి ఛాన్స్ ఉన్నవి కాదు. ఈ లెక్కన మెల్లగా ఇవి ఏడాది ఆడేలా ఉన్నాయి. గతంలో పోకిరి, మగధీర, లెజెండ్ లు ఫైవ్ హండ్రెడ్ డేస్ దాటేసి బెంచ్ మార్క్ సెట్ చేశాయి. మరి చిరు బాలయ్యలు కూడా వాటి సరసన తమ సినిమాలని నిలబెడతారో ఏమిటో చూడాలి.
This post was last modified on September 25, 2023 1:28 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…