ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు శతదినోత్సవం చాలా మాములు విషయం కాని ఇప్పుడలా కాదు. ఒక నెల రోజులు స్ట్రాంగ్ గా నిలబడితే అదే గొప్ప. ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే ఇంతకు మించి ఆడిన దాఖలాలు కనిపించవు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు సైతం యాభై రోజుల తర్వాత అమాంతం నెమ్మదించినవే. పైగా ఓటిటిల తాకిడిలో మహా అయితే నాలుగు వారాలకు మించి గ్యాప్ దొరకడం లేదు. జైలర్ లాంటి బంపర్ హిట్టే అమెజాన్ ప్రైమ్ లో నెలరోజులకు వచ్చేసింది. కానీ సంక్రాంతి సినిమాలు ఇంకా కొన్ని చోట్ల నాన్ స్టాప్ గా ఆడుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
చిరంజీవి వాల్తేరు వీరయ్య అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్ లో ఇటీవలే 250 రోజులు పూర్తి చేసుకుంది. దీనికి పోటీగా బాలకృష్ణ వీరసింహారెడ్డి ఆలూరులోని శ్రీ లక్ష్మినరసింహ టాకీసులో నిర్విరామంగా ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. అలా అని వీటికి జనం ఇంకా వస్తున్నారాని ఆశ్చర్యపోకండి. ఈ సినిమాల రన్ ని అభిమానులు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ముందు ఎవరు తీస్తారో చూద్దామని బలవంతంగా రోజు నాలుగు షోల చొప్పున ఆడిస్తూనే ఉన్నారు. పట్టుమని పది మంది కూడా రాలేని పరిస్థితిలో ఎందుకీ పంతమంటే దానికి సమాధానం సదరు ఎగ్జిబిటర్ల వద్ద కూడా లేదు.
చోద్యం కాకపోతే ఈ రోజుల్లో కూడా ప్రతిష్ఠకు పోయి ఇలా ఆడించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైపెచ్చు భవిష్యత్ తరాల వారు ఇవి నిజంగానే అన్నేసి రోజులు హౌస్ ఫుల్స్ ఆడాయని అనుకునే ప్రమాదం ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ ఘనవిజయం సాధించినవే కానీ మరీ ఇంత సుదీర్ఘమైన రన్ కి ఛాన్స్ ఉన్నవి కాదు. ఈ లెక్కన మెల్లగా ఇవి ఏడాది ఆడేలా ఉన్నాయి. గతంలో పోకిరి, మగధీర, లెజెండ్ లు ఫైవ్ హండ్రెడ్ డేస్ దాటేసి బెంచ్ మార్క్ సెట్ చేశాయి. మరి చిరు బాలయ్యలు కూడా వాటి సరసన తమ సినిమాలని నిలబెడతారో ఏమిటో చూడాలి.
This post was last modified on September 25, 2023 1:28 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…