ఈ వీకెండ్ స్కంద, చంద్రముఖి 1, పెదకాపు 1లతో రసవత్తరంగా ఉంటుందని అనుకుంటే తాజాగా ఈ లిస్టులో మరొకటి వచ్చి చేరింది. జయం రవి హీరోగా తమిళంలో రూపొందిన ఇరైవన్ ని తెలుగులో ఆఘమేఘాల మీద డబ్బింగ్ చేసి గాడ్ పేరుతో విడుదల చేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్ కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో నయనతార హీరోయిన్. విలక్షణ నటుడు రాహుల్ బోస్ సైకో కిల్లర్ గా నటించిన ఈ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఇవాళ సాయంత్రం రానుంది. విజువల్స్ డిస్టర్బ్ చేసేలా వయోలెంట్ గా ఉంటాయి.
చివరి నిమిషం హడావిడి కాబట్టి ఎంతమేరకు థియేటర్లు దక్కుతాయో చూడాలి. జయం రవి మాత్రం ఈ గాడ్ ని ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలతో కలిసి చూడొద్దని అంటున్నాడు. ఒక వర్గం ఆడియెన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకుని తీశామని, సున్నితమైన మనసులున్న వారు ఈ వయొలెన్స్ ని తట్టుకోలేరని ముందే హింట్ ఇస్తున్నాడు. మనుషులను దారుణంగా చంపి వాళ్ళ శరీర భాగాలను వేరు చేసే ఒక సైకోని పట్టుకునే ఆఫీసర్ గా రవి ఇందులో నటించాడు. నయనతార అతని కొలీగ్ గా కనిపించనుంది. రెగ్యులర్ స్టైల్ లో కాకుండా డిఫరెంట్ టోన్ తో దీని స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్.
అయినా ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల పుణ్యమాని సైకో కథలు చాలా మాములు విషయమైపోయాయి. వీటి ప్రభావం జనాల మీద ఉంటోందని విశ్లేషకులు అంటున్నా దర్శకులు ఇలాంటి కథల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి గాడ్ లో అంత భయపడే కంటెంట్ ఏముందో చూడాలి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు ఈ జానర్ లో మంచి సక్సెస్ అందుకున్నాక తిరిగి ఆ స్థాయిలో మరో బ్లాక్ బస్టర్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఎవరికీ పడలేదు. గాడ్ ఏమైనా విభిన్నంగా ఉంటుందేమో చూడాలి. జయం రవికి ఇక్కడ మార్కెట్ లేదు కాబట్టి గాడ్ ని నయనతార సినిమాగానే ప్రోమోట్ చేస్తున్నారు నిర్మాతలు.
This post was last modified on September 25, 2023 1:23 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…