ఈ వీకెండ్ స్కంద, చంద్రముఖి 1, పెదకాపు 1లతో రసవత్తరంగా ఉంటుందని అనుకుంటే తాజాగా ఈ లిస్టులో మరొకటి వచ్చి చేరింది. జయం రవి హీరోగా తమిళంలో రూపొందిన ఇరైవన్ ని తెలుగులో ఆఘమేఘాల మీద డబ్బింగ్ చేసి గాడ్ పేరుతో విడుదల చేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్ కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో నయనతార హీరోయిన్. విలక్షణ నటుడు రాహుల్ బోస్ సైకో కిల్లర్ గా నటించిన ఈ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఇవాళ సాయంత్రం రానుంది. విజువల్స్ డిస్టర్బ్ చేసేలా వయోలెంట్ గా ఉంటాయి.
చివరి నిమిషం హడావిడి కాబట్టి ఎంతమేరకు థియేటర్లు దక్కుతాయో చూడాలి. జయం రవి మాత్రం ఈ గాడ్ ని ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలతో కలిసి చూడొద్దని అంటున్నాడు. ఒక వర్గం ఆడియెన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకుని తీశామని, సున్నితమైన మనసులున్న వారు ఈ వయొలెన్స్ ని తట్టుకోలేరని ముందే హింట్ ఇస్తున్నాడు. మనుషులను దారుణంగా చంపి వాళ్ళ శరీర భాగాలను వేరు చేసే ఒక సైకోని పట్టుకునే ఆఫీసర్ గా రవి ఇందులో నటించాడు. నయనతార అతని కొలీగ్ గా కనిపించనుంది. రెగ్యులర్ స్టైల్ లో కాకుండా డిఫరెంట్ టోన్ తో దీని స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్.
అయినా ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల పుణ్యమాని సైకో కథలు చాలా మాములు విషయమైపోయాయి. వీటి ప్రభావం జనాల మీద ఉంటోందని విశ్లేషకులు అంటున్నా దర్శకులు ఇలాంటి కథల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి గాడ్ లో అంత భయపడే కంటెంట్ ఏముందో చూడాలి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు ఈ జానర్ లో మంచి సక్సెస్ అందుకున్నాక తిరిగి ఆ స్థాయిలో మరో బ్లాక్ బస్టర్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఎవరికీ పడలేదు. గాడ్ ఏమైనా విభిన్నంగా ఉంటుందేమో చూడాలి. జయం రవికి ఇక్కడ మార్కెట్ లేదు కాబట్టి గాడ్ ని నయనతార సినిమాగానే ప్రోమోట్ చేస్తున్నారు నిర్మాతలు.
This post was last modified on September 25, 2023 1:23 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…