Movie News

చిన్నపిల్లలు చూడకూడని నయన్ సినిమా

ఈ వీకెండ్ స్కంద, చంద్రముఖి 1, పెదకాపు 1లతో రసవత్తరంగా ఉంటుందని అనుకుంటే తాజాగా ఈ లిస్టులో మరొకటి వచ్చి చేరింది. జయం రవి హీరోగా తమిళంలో రూపొందిన ఇరైవన్ ని తెలుగులో ఆఘమేఘాల మీద డబ్బింగ్ చేసి గాడ్ పేరుతో విడుదల చేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్ కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో నయనతార హీరోయిన్. విలక్షణ నటుడు రాహుల్ బోస్ సైకో కిల్లర్ గా నటించిన ఈ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఇవాళ సాయంత్రం రానుంది. విజువల్స్ డిస్టర్బ్ చేసేలా వయోలెంట్ గా ఉంటాయి.

చివరి నిమిషం హడావిడి కాబట్టి ఎంతమేరకు థియేటర్లు దక్కుతాయో చూడాలి. జయం రవి మాత్రం ఈ గాడ్ ని ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలతో కలిసి చూడొద్దని అంటున్నాడు. ఒక వర్గం ఆడియెన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకుని తీశామని, సున్నితమైన మనసులున్న వారు ఈ వయొలెన్స్ ని తట్టుకోలేరని ముందే హింట్ ఇస్తున్నాడు. మనుషులను దారుణంగా చంపి వాళ్ళ శరీర భాగాలను వేరు చేసే ఒక సైకోని పట్టుకునే ఆఫీసర్ గా రవి ఇందులో నటించాడు. నయనతార అతని కొలీగ్ గా కనిపించనుంది. రెగ్యులర్ స్టైల్ లో కాకుండా డిఫరెంట్ టోన్ తో దీని స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్.

అయినా ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల పుణ్యమాని సైకో కథలు చాలా మాములు విషయమైపోయాయి. వీటి ప్రభావం జనాల మీద ఉంటోందని విశ్లేషకులు అంటున్నా దర్శకులు ఇలాంటి కథల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి గాడ్ లో అంత భయపడే కంటెంట్ ఏముందో చూడాలి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు ఈ జానర్ లో మంచి సక్సెస్ అందుకున్నాక తిరిగి ఆ స్థాయిలో మరో బ్లాక్ బస్టర్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఎవరికీ పడలేదు. గాడ్ ఏమైనా విభిన్నంగా ఉంటుందేమో చూడాలి. జయం రవికి ఇక్కడ మార్కెట్ లేదు కాబట్టి గాడ్ ని నయనతార సినిమాగానే ప్రోమోట్ చేస్తున్నారు నిర్మాతలు. 

This post was last modified on September 25, 2023 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్టీఆర్ నీల్ మూవీకి ‘దేవ’ పెన్ను బలం?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…

55 minutes ago

మూర్తిగారు చెప్పినవి అక్షరాలా నిజాలు

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…

3 hours ago

ఆ ఇద్దరు సీఎంలకు మరో ఛాన్స్ ఉన్నట్టే!

దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…

3 hours ago

విజయ్ మాత్రమే కాదు.. డ్రైవర్ కొడుకు కూడా

నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…

3 hours ago

విజ‌య్‌కు క‌లిసి వ‌చ్చిందేంటి?

త‌మిళ‌నాట ఎవ‌రి అంచ‌నాకు అంద‌ని విదంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న అధికారంలోకి…

3 hours ago

ఎన్టీఆర్, ఎంజీఆర్.. మధ్యలో విజయ్

దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ముందుంటాయి.…

6 hours ago