Movie News

చిన్నపిల్లలు చూడకూడని నయన్ సినిమా

ఈ వీకెండ్ స్కంద, చంద్రముఖి 1, పెదకాపు 1లతో రసవత్తరంగా ఉంటుందని అనుకుంటే తాజాగా ఈ లిస్టులో మరొకటి వచ్చి చేరింది. జయం రవి హీరోగా తమిళంలో రూపొందిన ఇరైవన్ ని తెలుగులో ఆఘమేఘాల మీద డబ్బింగ్ చేసి గాడ్ పేరుతో విడుదల చేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్ కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందులో నయనతార హీరోయిన్. విలక్షణ నటుడు రాహుల్ బోస్ సైకో కిల్లర్ గా నటించిన ఈ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఇవాళ సాయంత్రం రానుంది. విజువల్స్ డిస్టర్బ్ చేసేలా వయోలెంట్ గా ఉంటాయి.

చివరి నిమిషం హడావిడి కాబట్టి ఎంతమేరకు థియేటర్లు దక్కుతాయో చూడాలి. జయం రవి మాత్రం ఈ గాడ్ ని ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలతో కలిసి చూడొద్దని అంటున్నాడు. ఒక వర్గం ఆడియెన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకుని తీశామని, సున్నితమైన మనసులున్న వారు ఈ వయొలెన్స్ ని తట్టుకోలేరని ముందే హింట్ ఇస్తున్నాడు. మనుషులను దారుణంగా చంపి వాళ్ళ శరీర భాగాలను వేరు చేసే ఒక సైకోని పట్టుకునే ఆఫీసర్ గా రవి ఇందులో నటించాడు. నయనతార అతని కొలీగ్ గా కనిపించనుంది. రెగ్యులర్ స్టైల్ లో కాకుండా డిఫరెంట్ టోన్ తో దీని స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్.

అయినా ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల పుణ్యమాని సైకో కథలు చాలా మాములు విషయమైపోయాయి. వీటి ప్రభావం జనాల మీద ఉంటోందని విశ్లేషకులు అంటున్నా దర్శకులు ఇలాంటి కథల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి గాడ్ లో అంత భయపడే కంటెంట్ ఏముందో చూడాలి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు ఈ జానర్ లో మంచి సక్సెస్ అందుకున్నాక తిరిగి ఆ స్థాయిలో మరో బ్లాక్ బస్టర్ ఈ బ్యాక్ డ్రాప్ లో ఎవరికీ పడలేదు. గాడ్ ఏమైనా విభిన్నంగా ఉంటుందేమో చూడాలి. జయం రవికి ఇక్కడ మార్కెట్ లేదు కాబట్టి గాడ్ ని నయనతార సినిమాగానే ప్రోమోట్ చేస్తున్నారు నిర్మాతలు. 

This post was last modified on September 25, 2023 1:23 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

6 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

8 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

9 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

9 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

10 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

10 hours ago