ఎంత కాదనుకున్నా గణేశుడి పండక్కు సినిమా పాటలకు విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా డిజె కల్చర్ వచ్చాక ఇది మరింతగా విస్తృతమయ్యిందే తప్ప తగ్గలేదు. మండపాల దగ్గర రాత్రిళ్ళు పెట్టుకునే గీతాలు, నిమజ్జనం రోజు ఊరేగింపులో చెవులు బద్దలు కొట్టే పాటలు అన్నీ టాలీవుడ్ కు సంబంధించినవే ఉంటాయి. అలా ఎవర్ గ్రీన్ గా కొన్ని నిలిచిపోయాయి. వాటిలో మొదటిది వెంకటేష్ కూలి నెంబర్ వన్ లోని అండ్రాలయ్యా ఉండ్రాలయ్యా. ఇళయరాజా కంపోజింగ్ లో సిరివెన్నెల రాసిన ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ కి జనరేషన్ తో సంబంధం లేకుండా కనెక్ట్ అవుతారు.
తర్వాత జై చిరంజీవిలో మణిశర్మ స్వరపరిచిన జైజై గణేశా జై కొడతా గణేశా అంటూ చంద్రబోస్ చేసిన పదాల అల్లిక దాన్ని కూడా హాట్ ఫెవరెట్ గా మార్చింది. కోడిరామకృష్ణ దేవుళ్ళులో జయజయ వినాయక వీటిని మించి ఉంటుంది. వందేమాతరమ్ శ్రీనివాస్ రూపకల్పన అది. ఆ తర్వాత నాగార్జున దేవదాస్, రామ్ జస్ట్ గణేష్ లలో ఈ టైపు పాటలు వచ్చాయి కానీ పైన చెప్పిన వాటి స్థాయిలో గుర్తుండిపోలేదు. తాజాగా భగవంత్ కేసరిలో తమన్ కు అలాంటి ఛాన్స్ వచ్చింది. పండగను దృష్టిలో పెట్టుకునే చాలా ముందుగానే దీని లిరికల్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
బ్యాడ్ లక్ ఏంటంటే వెరైటీ బీట్స్ తో తమన్ ఏదో కొత్తగా ట్రై చేశాడు కానీ గణేష్ యాంతం శ్రోతలకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. పదిహేడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి కానీ ఎక్కడ చూసినా హోరెత్తిపోవాల్సిన పాట పెద్దగా వినిపించడం లేదు. బాలయ్య, శ్రీలీలలు సూపర్ మాస్ డాన్స్ తో ఎంత హుషారెత్తించినా సగటు మాస్ జనాలు సులభంగా పాడుకునేలా తమన్ మేజిక్ చేయలేకపోయాడు. ఒకవేళ ట్యూన్ క్యాచీగా పడి ఉంటే ఇంకో మంచి పాట దశాబ్దాల తరబడి గుర్తుండిపోయేది. ఒకరకంగా చెప్పాలంటే తమన్ మంచి ఛాన్స్ మిస్ చేశాడు. తెరమీద చూశాక ఏమైనా అభిప్రాయం మారుతుందేమో చూడాలి.
This post was last modified on September 25, 2023 1:15 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…