వివేక్ రంజన్ అగ్నిహోత్రి.. గత ఏడాది ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో మార్మోగిన పేరిది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ఆ సినిమా తీస్తే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమాకు చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయి పెద్ద హిట్ చేశారు. ‘కశ్మీర్ ఫైల్స్’ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మద్దతుదారులు తమ భుజాల మీద మోసిన మాట వాస్తవం. ఆ తర్వాత వివేక్ తీసిన సినిమానే.. వ్యాక్సిన్ వార్. ముందు ఈ టైటిల్ చూసి కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో జరిగిన కుట్రలు.. కంపెనీల మధ్య పోటీ మీద ఉత్కంఠభరిత థ్రిల్లర్ తీస్తారని అనుకున్నారు.
కానీ వివేక్ ఏమో.. వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు చేసిన పోరాటం మీద సినిమా తీశాడు. ట్రైలర్ చూస్తే మరీ ఎగ్జైటింగ్గా ఏమీ కనిపించలేదు. ఈ నెల 28న ఈ చిత్రం వివిధ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఐతే విడుదల ముంగిట ఆశించిన బజ్ కనిపించకపోయేసరికి వివేక్ సింపతీ వర్కవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
తన సినిమాకు దెబ్బ కొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఈ సినిమా ఆడకపోతే తన పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతుందని అతను వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ‘‘వ్యాక్సిన్ వార్ మీద చిత్ర పరిశ్రమ నిషేధం విధించినట్లుంది. అందుకే ఎవ్వరూ ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు. నా సినిమా మీద రివ్యూలు రాకుండా ఉండేందుకు చాలామందికి డబ్బులు ఇస్తున్నారు. నేను బాక్సాఫీస్ నంబర్ల కోసం పరుగులు పెట్టే రకం కాదు. కశ్మీర్ ఫైల్స్ విజయం సాధించాక దానికి సీక్వెల్ తీయాలని కొన్ని సంస్థలు నన్ను సంప్రదించాయి.
రూ.300 కోట్ల దాకా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ నేను వాళ్ల ట్రాప్లో పడలేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడ్డ కష్టాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. అందుకే తక్కువ బడ్జెట్లో ‘వ్యాక్సిన్ వార్’ చేశా. ఈ చిత్రానికి సరైన ఆదరణ దక్కకపోతే నా పరిస్థితి గతంలో లాగా తయారవుతుంది’’ అని వివేక్ అన్నాడు. వివేక్ మాటలు చూస్తుంటే ‘వ్యాక్సిన్ వార్’ మీద అపనమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…