‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ‘మనీ’ సినిమాలోని ఓ పాటలోని పంక్తినే టైటిల్గా పెట్టుకుని సినిమా చేశాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ పేరు చూస్తేనే సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది అర్థమైపోయింది. పెళ్లి వద్దు సింగిల్ లైఫే ముద్దు అంటూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి.
‘నో పెళ్లి’ అనే పాట కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు తేజు ఓ ఆసక్తికర అప్ డేట్తో ట్విట్టర్ ఫాలోవర్లను పలకరించాడు. అది సినిమా ప్రమోషన్ కోసం చేసిందా.. అతడి నిజ జీవితానికి సంబంధించిందా అన్న విషయమే అర్థం కావట్లేదు.
తేజు ఆదివారం ఉదయం ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. ‘సింగిల్ ఆర్మీ’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో తేజుతో పాటు ప్రభాస్, రానా, నితిన్, నిఖిల్, వరుణ్ తదితరులు ఉండగా.. అందులో పెళ్లి ఖాయమవ్వగానే నిఖిల్, నితిన్, రానా.. ఒకరి తర్వాత ఒకరు గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు చూపించి.. చివరగా ‘ఇట్స్ మై షో టైమ్ సారీ ప్రభాస్ అన్నా’ అని తేజు కూడా ఎగ్జిట్ అయినట్లు ఈ వీడియోను ముగించారు. బ్యాగ్రౌండ్లో పెళ్లి మ్యూజిక్ వినిపించారు. పూర్తి వివరాలకు సోమవారం ఉదయం వరకు ఎదురు చూడమని చెప్పాడు తేజు.
ఈ వీడియో చూడగానే తేజు కూడా పెళ్లి కొడుకు అయిపోతున్నాడా.. అతడి పెళ్లి ఖాయమైందా అన్న సందేహాలు కలిగాయి అభిమానులకు. ఐతే సినిమాలో హీరో లైఫ్ యు టర్న్ తీసుకుని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చే పాటను రేపు లాంచ్ చేయబోతున్నారని.. అందుకే ఈ హంగామా అంతా అని అంటున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సైతం దీని గురించి ట్విట్టర్లో అప్ డేట్ ఇచ్చిన నేపథ్యంలో ఇది కచ్చితంగా ‘పబ్లిసిటీ స్టంట్’యే అన్నది స్పష్టమవుతోంది. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
This post was last modified on August 24, 2020 10:23 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…