జవాన్ సినిమా చూసి ఏముంది ఇందులో అని పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. పాత కథలను అటు ఇటు తిప్పి మసాలా సినిమాలు రెడీ చేయడంలో సిద్ధహస్తుడైన తమిళ దర్శకుడు అట్లీ.. ‘జవాన్’ విషయంలోనూ అదే చేశాడు. ఇందులోని కథ.. పాత్రలు.. సన్నివేశాలు.. చాలా వరకు వేరే చిత్రాలను గుర్తు చేశాయి. కానీ కొత్తదనం రవ్వంత కూడా లేకపోయినా.. బోర్ కొట్టించకుండా నడిచిపోవడం.. ఫ్యాన్ మూమెంట్స్, కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పాసైపోయింది.
ఐతే ఎంతైనా కంటెంట్ వీక్ కావడంతో ‘జవాన్’ తొలి వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలబడుతుందో అని సందేహించారు. తొలి మూణ్నాలుగు రోజుల్లో ఉన్న ఊపు తర్వాత ఉండదనుకున్నారు. కానీ ఈ సినిమాకు రెండు వారాల తర్వాత వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. మూడో వీకెండ్లో కూడా ‘జవాన్’ అదరగొట్టింది.
వరల్డ్ వైడ్ ‘జవాన్’ వసూళ్లు రూ.950 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోబోతోంది. ‘జవాన్’ అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. మూడు వారాలుగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు. హిందీలో తొలి వారం ఈ చిత్రంతో పాటు ఏ సినిమా రిలీజ్ కాలేదు. తర్వాతి రెండు వారాల్లో కూడా చిన్న సినిమాలే వచ్చాయి.
బాక్సాఫీస్ దగ్గర దీన్ని ఛాలెంజ్ చేసే సినిమాలే లేకపోయాయి హిందీలో. ఇక తెలుగులో ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ కొంత పోటీ ఇచ్చినా.. అది కాక వేరే సినిమాలు గత రెండు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. తమిళంలో కూడా ‘జవాన్’కు పెద్దగా పోటీ లేకపోయింది. అలా అన్ని చోట్లా ‘జవాన్’ బాక్సాఫీస్ రన్ ఇబ్బంది లేకుండా సాగిపోయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. వేరే ఆప్షన్ లేక దీన్నే చూస్తుండటం కలిసొచ్చింది. అలా ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును అందుకోబోతోంది.
This post was last modified on September 24, 2023 3:46 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…