జవాన్ సినిమా చూసి ఏముంది ఇందులో అని పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. పాత కథలను అటు ఇటు తిప్పి మసాలా సినిమాలు రెడీ చేయడంలో సిద్ధహస్తుడైన తమిళ దర్శకుడు అట్లీ.. ‘జవాన్’ విషయంలోనూ అదే చేశాడు. ఇందులోని కథ.. పాత్రలు.. సన్నివేశాలు.. చాలా వరకు వేరే చిత్రాలను గుర్తు చేశాయి. కానీ కొత్తదనం రవ్వంత కూడా లేకపోయినా.. బోర్ కొట్టించకుండా నడిచిపోవడం.. ఫ్యాన్ మూమెంట్స్, కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పాసైపోయింది.
ఐతే ఎంతైనా కంటెంట్ వీక్ కావడంతో ‘జవాన్’ తొలి వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలబడుతుందో అని సందేహించారు. తొలి మూణ్నాలుగు రోజుల్లో ఉన్న ఊపు తర్వాత ఉండదనుకున్నారు. కానీ ఈ సినిమాకు రెండు వారాల తర్వాత వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. మూడో వీకెండ్లో కూడా ‘జవాన్’ అదరగొట్టింది.
వరల్డ్ వైడ్ ‘జవాన్’ వసూళ్లు రూ.950 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోబోతోంది. ‘జవాన్’ అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. మూడు వారాలుగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు. హిందీలో తొలి వారం ఈ చిత్రంతో పాటు ఏ సినిమా రిలీజ్ కాలేదు. తర్వాతి రెండు వారాల్లో కూడా చిన్న సినిమాలే వచ్చాయి.
బాక్సాఫీస్ దగ్గర దీన్ని ఛాలెంజ్ చేసే సినిమాలే లేకపోయాయి హిందీలో. ఇక తెలుగులో ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ కొంత పోటీ ఇచ్చినా.. అది కాక వేరే సినిమాలు గత రెండు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. తమిళంలో కూడా ‘జవాన్’కు పెద్దగా పోటీ లేకపోయింది. అలా అన్ని చోట్లా ‘జవాన్’ బాక్సాఫీస్ రన్ ఇబ్బంది లేకుండా సాగిపోయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. వేరే ఆప్షన్ లేక దీన్నే చూస్తుండటం కలిసొచ్చింది. అలా ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును అందుకోబోతోంది.
This post was last modified on September 24, 2023 3:46 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…