జవాన్ సినిమా చూసి ఏముంది ఇందులో అని పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. పాత కథలను అటు ఇటు తిప్పి మసాలా సినిమాలు రెడీ చేయడంలో సిద్ధహస్తుడైన తమిళ దర్శకుడు అట్లీ.. ‘జవాన్’ విషయంలోనూ అదే చేశాడు. ఇందులోని కథ.. పాత్రలు.. సన్నివేశాలు.. చాలా వరకు వేరే చిత్రాలను గుర్తు చేశాయి. కానీ కొత్తదనం రవ్వంత కూడా లేకపోయినా.. బోర్ కొట్టించకుండా నడిచిపోవడం.. ఫ్యాన్ మూమెంట్స్, కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పాసైపోయింది.
ఐతే ఎంతైనా కంటెంట్ వీక్ కావడంతో ‘జవాన్’ తొలి వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలబడుతుందో అని సందేహించారు. తొలి మూణ్నాలుగు రోజుల్లో ఉన్న ఊపు తర్వాత ఉండదనుకున్నారు. కానీ ఈ సినిమాకు రెండు వారాల తర్వాత వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. మూడో వీకెండ్లో కూడా ‘జవాన్’ అదరగొట్టింది.
వరల్డ్ వైడ్ ‘జవాన్’ వసూళ్లు రూ.950 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోబోతోంది. ‘జవాన్’ అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. మూడు వారాలుగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు. హిందీలో తొలి వారం ఈ చిత్రంతో పాటు ఏ సినిమా రిలీజ్ కాలేదు. తర్వాతి రెండు వారాల్లో కూడా చిన్న సినిమాలే వచ్చాయి.
బాక్సాఫీస్ దగ్గర దీన్ని ఛాలెంజ్ చేసే సినిమాలే లేకపోయాయి హిందీలో. ఇక తెలుగులో ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ కొంత పోటీ ఇచ్చినా.. అది కాక వేరే సినిమాలు గత రెండు వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. తమిళంలో కూడా ‘జవాన్’కు పెద్దగా పోటీ లేకపోయింది. అలా అన్ని చోట్లా ‘జవాన్’ బాక్సాఫీస్ రన్ ఇబ్బంది లేకుండా సాగిపోయింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. వేరే ఆప్షన్ లేక దీన్నే చూస్తుండటం కలిసొచ్చింది. అలా ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును అందుకోబోతోంది.
This post was last modified on September 24, 2023 3:46 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…