ఎక్కడైనా చంద్రముఖి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది జ్యోతిక పెర్ఫార్మన్స్. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ముందు తొణుకు బెణుకు లేకుండా సీన్ మొత్తాన్ని డామినేట్ చేస్తూ ఆవిడ పండించిన అభినయం ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. తాజాగా సీక్వెల్ విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాతో పాటు నెటిజెన్లు సైతం ఆమె నటన గురించి మరోసారి గుర్తుచేసుకుంటూ పోలికలకు రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ మిస్ అవుతున్న అంశం మరొకటి ఉంది. జ్యోతిక కన్నా ముందు అంతే ధీటుగా ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన మరో ఇద్దరి గురించి మర్చిపోకూడదు.
1993లో వచ్చిన మలయాళం మూవీ మణిచిత్రతజు. దర్శకుడు ఫాజిల్ (నాగార్జున కిల్లర్ డైరెక్టర్ – పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ తండ్రి). ఇదో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. చాలా పరిమితంగా ఉండే కేరళ మార్కెట్ లో ఒక దెయ్యం సినిమా ఏడు కోట్లకు పైగా వసూలు చేయడం అప్పట్లో రికార్డు. ఇందులో చంద్రముఖిగా శోభన అద్భుతంగా అభినయించి అవార్డులు సైతం అందుకున్నారు. అయితే వెంటనే ఇతర భాషల్లో తీసే సాహసం ఎవరూ చేయలేదు. 2004లో పి వాసు కన్నడ హీరో విష్ణువర్థన్ హీరోగా ఆప్తమిత్ర పేరుతో రీమేక్ చేస్తే శాండల్ వుడ్ పాత రికార్డులు బద్దలయ్యాయి.
దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత మాత్రం తీసిపోని రీతిలో గొప్పగా పండించారు. ఆ మరుసటి ఏడాదే రజనీకాంత్ తో తమిళంలో తీసి అన్నింటిని మించిన విజయం సొంతం చేసుకున్నారు. సో జ్యోతిక కన్నా ముందు క్రెడిట్ నిస్సందేహంగా సౌందర్య, శోభనలకు దక్కుతుంది. ఎవరికి ఎవరు తీసిపోనంత రేంజ్ లో మెప్పించారు కాబట్టి ఐకానిక్ క్యారెక్టర్స్ గా మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ఫ్రెష్ గా ఈ బ్యాచ్ లో కంగనా రౌనత్ వచ్చి చేరుతోంది కాబట్టి వాళ్ళ స్థాయిలో చేసిందో లేదో చూడాలి. సెప్టెంబర్ 28న చెప్పుకోదగ్గ స్థాయిలో చంద్రముఖి 2 రిలీజ్ జరగనుంది.
This post was last modified on September 23, 2023 10:28 pm
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…