బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మంచు మనోజ్ ఒకవైపు కొత్త సినిమా చేస్తూనే మరోవైపు డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఈటీవీ విన్ ఓటిటి కోసం నిర్వహించే సెలబ్రిటీ షో కోసం కొత్తగా మేకోవర్ చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ టీజర్ ఆల్రెడీ యూట్యూబ్ లో విడుదల చేశారు. ప్రోగ్రాం తాలూకు తీరుతెన్నులు చెప్పలేదు కానీ రెండు కుర్చీలు పెట్టడం ద్వారా ఇది టాక్ షో అనే సంకేతమైతే ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఇది రూపొందనుంది. గతంలో ఇదే ప్లాట్ ఫార్మ్ మీద వెన్నెల కిషోర్ తో చేసిన కార్యక్రమం అంతగా సక్సెస్ కాలేదు.
ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా గట్టి స్టార్ హీరోలనే పట్టుకొస్తున్నారు. అందులో భాగంగా మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో పూర్తయినట్టు తెలిసింది. తనకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో పాటు మనోజ్ తో ఉన్న స్నేహం వల్ల రవితేజ పెద్దగా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. బాలయ్య ఆన్ స్టాపబుల్ షోతో పోలిక రాకుండా చాలా విభిన్నంగా డిజైన్ చేశారని అంటున్నారు. ర్యాంప్ ఆడిద్దాం టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.
ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను తట్టుకోవడం కోసం ఇలాంటి ప్లాన్లు వేస్తోంది. మొదలుపెట్టి సంవత్సరాలు అవుతున్నా ఈటీవీ విన్ కి జనంలో ఇంకా ప్రచారం లభించడం లేదు. ఒక పూర్తి స్థాయి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ గా గుర్తింపు రావడం లేదు. దాన్ని బలపరిచే క్రమంలో భాగంగానే మంచు మనోజ్ తో ఇలాంటి స్కెచ్ రెడీ చేశారు. ఎంత గ్యాప్ వచ్చినా ఇతని మీద ఫ్యాన్స్ లో ఇప్పటికీ మంచి కార్నర్ ఉంది. సరైన హిట్టు పడితే ఖచ్చితంగా ఆదరణ దక్కుతుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. పేరుకి తగ్గట్టు ర్యాంప్ ఆడిస్తే అదే చాలు.
This post was last modified on September 23, 2023 10:29 pm
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…