బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మంచు మనోజ్ ఒకవైపు కొత్త సినిమా చేస్తూనే మరోవైపు డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఈటీవీ విన్ ఓటిటి కోసం నిర్వహించే సెలబ్రిటీ షో కోసం కొత్తగా మేకోవర్ చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ టీజర్ ఆల్రెడీ యూట్యూబ్ లో విడుదల చేశారు. ప్రోగ్రాం తాలూకు తీరుతెన్నులు చెప్పలేదు కానీ రెండు కుర్చీలు పెట్టడం ద్వారా ఇది టాక్ షో అనే సంకేతమైతే ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఇది రూపొందనుంది. గతంలో ఇదే ప్లాట్ ఫార్మ్ మీద వెన్నెల కిషోర్ తో చేసిన కార్యక్రమం అంతగా సక్సెస్ కాలేదు.
ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా గట్టి స్టార్ హీరోలనే పట్టుకొస్తున్నారు. అందులో భాగంగా మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో పూర్తయినట్టు తెలిసింది. తనకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో పాటు మనోజ్ తో ఉన్న స్నేహం వల్ల రవితేజ పెద్దగా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. బాలయ్య ఆన్ స్టాపబుల్ షోతో పోలిక రాకుండా చాలా విభిన్నంగా డిజైన్ చేశారని అంటున్నారు. ర్యాంప్ ఆడిద్దాం టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.
ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను తట్టుకోవడం కోసం ఇలాంటి ప్లాన్లు వేస్తోంది. మొదలుపెట్టి సంవత్సరాలు అవుతున్నా ఈటీవీ విన్ కి జనంలో ఇంకా ప్రచారం లభించడం లేదు. ఒక పూర్తి స్థాయి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ గా గుర్తింపు రావడం లేదు. దాన్ని బలపరిచే క్రమంలో భాగంగానే మంచు మనోజ్ తో ఇలాంటి స్కెచ్ రెడీ చేశారు. ఎంత గ్యాప్ వచ్చినా ఇతని మీద ఫ్యాన్స్ లో ఇప్పటికీ మంచి కార్నర్ ఉంది. సరైన హిట్టు పడితే ఖచ్చితంగా ఆదరణ దక్కుతుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. పేరుకి తగ్గట్టు ర్యాంప్ ఆడిస్తే అదే చాలు.
This post was last modified on September 23, 2023 10:29 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…