బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మంచు మనోజ్ ఒకవైపు కొత్త సినిమా చేస్తూనే మరోవైపు డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు. ఈటీవీ విన్ ఓటిటి కోసం నిర్వహించే సెలబ్రిటీ షో కోసం కొత్తగా మేకోవర్ చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ టీజర్ ఆల్రెడీ యూట్యూబ్ లో విడుదల చేశారు. ప్రోగ్రాం తాలూకు తీరుతెన్నులు చెప్పలేదు కానీ రెండు కుర్చీలు పెట్టడం ద్వారా ఇది టాక్ షో అనే సంకేతమైతే ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామ్యంలో ఇది రూపొందనుంది. గతంలో ఇదే ప్లాట్ ఫార్మ్ మీద వెన్నెల కిషోర్ తో చేసిన కార్యక్రమం అంతగా సక్సెస్ కాలేదు.
ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా గట్టి స్టార్ హీరోలనే పట్టుకొస్తున్నారు. అందులో భాగంగా మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో పూర్తయినట్టు తెలిసింది. తనకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో పాటు మనోజ్ తో ఉన్న స్నేహం వల్ల రవితేజ పెద్దగా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. బాలయ్య ఆన్ స్టాపబుల్ షోతో పోలిక రాకుండా చాలా విభిన్నంగా డిజైన్ చేశారని అంటున్నారు. ర్యాంప్ ఆడిద్దాం టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.
ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను తట్టుకోవడం కోసం ఇలాంటి ప్లాన్లు వేస్తోంది. మొదలుపెట్టి సంవత్సరాలు అవుతున్నా ఈటీవీ విన్ కి జనంలో ఇంకా ప్రచారం లభించడం లేదు. ఒక పూర్తి స్థాయి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ గా గుర్తింపు రావడం లేదు. దాన్ని బలపరిచే క్రమంలో భాగంగానే మంచు మనోజ్ తో ఇలాంటి స్కెచ్ రెడీ చేశారు. ఎంత గ్యాప్ వచ్చినా ఇతని మీద ఫ్యాన్స్ లో ఇప్పటికీ మంచి కార్నర్ ఉంది. సరైన హిట్టు పడితే ఖచ్చితంగా ఆదరణ దక్కుతుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. పేరుకి తగ్గట్టు ర్యాంప్ ఆడిస్తే అదే చాలు.
This post was last modified on September 23, 2023 10:29 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…