Movie News

తన తల్లి కథనే చెప్పబోతున్న దర్శకుడు?

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విస్మయానికి గురి చేసిన దర్శకుడు వెంకటేష్ మహా. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందన్న ఊహ కూడా మన వాళ్లకు ఉండేది కాదు. ఇంతటి సహజత్వం, ఇంతటి స్వచ్ఛత సినిమాల్లో అరుదుగా కనిపిస్తుంది.

ఆ సినిమాతో వెంకటేష్ మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఐతే వాటిని తనే తగ్గించేసుకుంటూ రెండో ప్రయత్నంగా ఓ రీమేక్ సినిమా తీశాడు మహా. అదే.. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.

మలయాళ హిట్ ‘మహేషింటే ప్రతికారం’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి స్పందనే తెచ్చుకుంది. దీని తర్వాత మహా ఎలాంటి సినిమా తీస్తాడు.. ఎప్పుడు దాని గురించి అనౌన్స్ చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సుమతి’ పేరుతో వినాయక చవితి రోజు పొద్దుపోయాక అతను ఆ సినిమా గురించి ప్రకటించాడు.

తన తొలి రెండు సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్న పరుచూరి విజయ ప్రవీణతో కలిసే ఈ సినిమాను కూడా స్వయంగా నిర్మించబోతున్నాడు వెంకటేష్ మహా. పల్లెటూరి నుంచి మరో దేశంలోని మహా నగరానికి వచ్చిన పెద్ద వయస్కురాలి కథ ఇది అని ప్రి లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఐతే మహా సన్నిహితుల సమాచారం ప్రకారం ఇది అతడి తల్లి కథే అట.

ఆమె పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చాక ఇక్కడ ఎదురైన అనుభవాలకు కొంత కల్పన జోడించి ఈ కథను తయారు చేశాడట మహా. అతడి తొలి సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’ కథ కూడా ఇలా తయారైందే. కంచరపాలెం అనే ఊరికి వెళ్లి ఆరు నెలలు అక్కడే ఉండి, మనుషుల్ని గమనించి పాత్రలు తయారు చేశాడు.

ఇప్పుడు మరోసారి స్వీయ అనుభవాల నుంచే కథ రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా పోస్టర్ మీద ‘డెడికేటెడ్ టు అవర్ పేరెంట్స్ అంటూ మహా, ప్రవీణ తమ తల్లిదండ్రుల పేర్లు వేశారు. అందులో గడ్డిగోపుల సుమతి దేవి అంటూ మహా తల్లి పేరు ఉండటం గమనార్హం.

This post was last modified on August 23, 2020 3:14 pm

Share
Show comments
Published by
Satya
Tags: MahaSumati

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

46 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago