ఎన్నో ఆశలు పెట్టుకుని ఒళ్ళు హూనం చేసుకుని మరీ నటించిన ఏజెంట్ దారుణంగా నిరాశ పరచడంతో అఖిల్ నెలల తరబడి అజ్ఞాతంలోనే ఉన్నాడు. మొన్న ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో కనిపించడం తప్పించి అంతకు ముందు కనీసం మీడియాకు సైతం అందుబాటులోకి రాలేదు. యువి క్రియేషన్స్ కొత్త దర్శకుడు అనిల్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ ఎప్పుడు మొదలవుతుందో అంతు చిక్కడం లేదు. ఈసారి మాస్ టచ్ ఉన్న కమర్షియల్ సబ్జెక్టు చెయ్యమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ అఖిల్ మనసులో ఏముందో బయటికి చెప్పడం లేదు.
ఈ కాంబో పక్కానే కానీ వీలైనంత త్వరగా మొదలుపెట్టడం అవసరం. ఇదిలా ఉండగా అఖిల్ కు తమిళ డైరెక్టర్ లింగుస్వామి ఒక లైన్ చెప్పాడని, దానికి సానుకూల స్పందన వచ్చిందనే వార్త ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. ఎందుకంటే రామ్ కి ది వారియర్ లాంటి సూపర్ డిజాస్టర్ ఇచ్చింది ఈయనే. ఒకప్పుడంటే రన్, పందెం కోడి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కానీ తర్వాత ఫామ్ కోల్పోయారు. కోలీవుడ్ స్టార్ హీరోలే ఆసక్తి చూపించడం లేదు. అయినా రామ్ గుడ్డిగా అవకాశం ఇస్తే దాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పుడు అఖిల్ తో అంటే సహజంగానే టెన్షన్ కలుగుతుంది.
అయితే మునుపటిలా అఖిల్ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదు. నాన్న నాగార్జునతో చర్చిస్తున్నాడు. లింగుస్వామి, మురుగదాస్ లాంటి వాళ్ళను గుడ్డిగా నమ్మలేం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, మొహమాటం కోసం ఒప్పుకున్నా ఫలితం తేడా కొట్టేస్తుంది. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నాగచైతన్యకు మంచి ప్యాన్ ఇండియా సినిమాతో పాటు క్రేజీ కాంబినేషన్ తోడయ్యింది. నాగార్జున నా సామి రంగా అంటూ కాస్త లేట్ అయినా పర్ఫెక్ట్ టీమ్ ని ఎంచుకున్నాడు. ఇక మిగిలింది అఖిలే. డెసిషన్లు కరెక్ట్ గా ఉంటేనే ఫలితాలు గొప్పగా వస్తాయి. ఇదే ఇప్పుడు పాటించాల్సింది.
This post was last modified on September 23, 2023 2:44 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…