ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. అలా అని ఆయన తనను ఇండస్ట్రీలో నిలబెట్టిన డిస్ట్రిబ్యూషన్ను ఏ రోజూ వదులుకోలేదు. ఓవైపు సొంత ప్రొడక్షన్లో తెరకెక్కే సినిమాల వ్యవహారాలు చూసుకుంటూనే.. ఇంకోవైపు డిస్ట్రిబ్యూషన్లోనూ తీరిక లేకుండా ఉన్నారు. టాలీవుడ్లో మంచి క్రేజున్న ఓ పెద్ద సినిమా రిలీజవుతోందంటే.. అందులో దిల్ రాజు హ్యాండ్ ఉండాల్సిందే.
అలా ఆయన గుడ్డిగా ఏమీ రైట్స్ కొనరు. మరీ రిస్క్ అనుకున్న సినిమాల జోలికి వెళ్లరు. కొన్ని సినిమాల మీద అంచనాలను మించి పెట్టుబడి పెడతారు. కానీ రిజల్ట్ చూశాక దిల్ రాజు జడ్జిమెంటే వేరు అని ఇండస్ట్రీ జనాలు ఆయన్ని కొనియాడతారు. ఇప్పుడు రాజు ఓ హిందీ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొత్త చిత్రం ‘యానిమల్’ తెలుగు హక్కులను రాజే తీసుకున్నట్లు సమాచారం.
‘యానిమల్’ బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ.. వేరే హిందీ చిత్రాలు వేటికీ లేనంత క్రేజ్ తెలుగులో దీనికి ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. కానీ అతను ఇక్కడ సినిమా తీయకుండా బాలీవుడ్కు వెళ్లిపోయాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తీశాడు. ఆపై అతడి కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ‘యానిమల్’యే.
రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం మంచి డిమాండే ఏర్పడింది కానీ.. రాజు మంచి రేటు పెట్టి కొనేశారు. దిల్ రాజు రిలీజ్ అంటే నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీనే. సినిమాను బాగా ప్రమోట్ చేస్తాడు. అలాగే రిలీజ్ పెద్ద రేంజిలో ఉంటుంది. వేరే ఏ రకమైన ఇబ్బందులూ లేకుండా చూసుకుంటాడు. సినిమా రీచ్ పెరుగుతుంది.
This post was last modified on September 23, 2023 12:44 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…