ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. అలా అని ఆయన తనను ఇండస్ట్రీలో నిలబెట్టిన డిస్ట్రిబ్యూషన్ను ఏ రోజూ వదులుకోలేదు. ఓవైపు సొంత ప్రొడక్షన్లో తెరకెక్కే సినిమాల వ్యవహారాలు చూసుకుంటూనే.. ఇంకోవైపు డిస్ట్రిబ్యూషన్లోనూ తీరిక లేకుండా ఉన్నారు. టాలీవుడ్లో మంచి క్రేజున్న ఓ పెద్ద సినిమా రిలీజవుతోందంటే.. అందులో దిల్ రాజు హ్యాండ్ ఉండాల్సిందే.
అలా ఆయన గుడ్డిగా ఏమీ రైట్స్ కొనరు. మరీ రిస్క్ అనుకున్న సినిమాల జోలికి వెళ్లరు. కొన్ని సినిమాల మీద అంచనాలను మించి పెట్టుబడి పెడతారు. కానీ రిజల్ట్ చూశాక దిల్ రాజు జడ్జిమెంటే వేరు అని ఇండస్ట్రీ జనాలు ఆయన్ని కొనియాడతారు. ఇప్పుడు రాజు ఓ హిందీ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొత్త చిత్రం ‘యానిమల్’ తెలుగు హక్కులను రాజే తీసుకున్నట్లు సమాచారం.
‘యానిమల్’ బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ.. వేరే హిందీ చిత్రాలు వేటికీ లేనంత క్రేజ్ తెలుగులో దీనికి ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. కానీ అతను ఇక్కడ సినిమా తీయకుండా బాలీవుడ్కు వెళ్లిపోయాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తీశాడు. ఆపై అతడి కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ‘యానిమల్’యే.
రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం మంచి డిమాండే ఏర్పడింది కానీ.. రాజు మంచి రేటు పెట్టి కొనేశారు. దిల్ రాజు రిలీజ్ అంటే నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీనే. సినిమాను బాగా ప్రమోట్ చేస్తాడు. అలాగే రిలీజ్ పెద్ద రేంజిలో ఉంటుంది. వేరే ఏ రకమైన ఇబ్బందులూ లేకుండా చూసుకుంటాడు. సినిమా రీచ్ పెరుగుతుంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…