ప్రవీణ్ సత్తారు.. ఈ పేరు పెద్దగా పాపులర్ కానంత వరకు మంచి మంచి సినిమాలే తీశాడు. ‘ఎల్బీడబ్ల్యూ’ అనే ఇండిపెండెంట్ మూవీ అతడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘చందమామ కథలు’ మూవీ సైతం ఆకట్టుకుంది. రొటీన్ లవ్ స్టోరీ, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు కూడా విభిన్నమైన ప్రయత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇక ‘గరుడవేగ’తో అతను దర్శకుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు.
ఔట్ డేట్ అయిపోయిన సీనియర్ హీరో రాజశేఖర్ను పెట్టి ఆయనకు మంచి సక్సెస్ అందించడమే కాక.. ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని పంచాడు. ఆ సినిమా చూశాక ప్రవీణ్ సత్తారులో అసలు సత్తా ఏంటో అందరికీ తెలిసింది. దీంతో పెద్ద పెద్ద అవకాశాలు రావడం మొదలైంది. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మీద కొంత కాలం పని చేసి బయటికి వచ్చేశాక అక్కినేని నాగార్జునతో అతను ‘ది ఘోస్ట్’ లాంటి పెద్ద సినిమా చేశాడు.
నాగ్-ప్రవీణ్ కాంబినేషన్ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ‘గరుడవేగ’ మ్యాజిక్ను అతను రిపీట్ చేయలేకపోయాడు. దీని తర్వాత ‘గాండీవధారి అర్జున’ అంటూ మరో పెద్ద బడ్జెట్ సినిమా తీశాడు. కానీ ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ‘గరుడవేగ’ను అంత పకడ్బందీగా తీసిన ప్రవీణ్.. ఈ రెండు చిత్రాలను డీల్ చేసిన విధానం చూసి ప్రేక్షకులు షాకయ్యారు. ‘గాండీవధారి’ షాక్ నుంచి తేరుకునేలోపు.. ప్రవీణ్ నిర్మాతగా ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. వేణు తొట్టెంపూడి ఇందులో లీడ్ రోల్ చేశాడు.
ఈ వెబ్ సిరీస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. రొటీన్ హార్రర్ అంశాలతో ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. వేణు పెర్ఫామెన్స్, చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మినహాయిస్తే ఈ సిరీస్లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ప్రవీణ్ నిర్మాత అంటే మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందని అనుకుంటే.. తన మార్కు అంటూ ఏమీ కనిపించట్లేదని.. తన మీద అంచనాలు పెట్టుకున్నప్పటి నుంచి అతను స్థాయికి తగ్గ కంటెంట్ ఇవ్వట్లదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ దశ నుంచి ప్రవీణ్ ఎలా పుంజుకుంటాడో చూడాలి.
This post was last modified on September 22, 2023 11:19 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…