సాయి రాజేష్.. ‘బేబి’ సినిమాతో మార్మోగిన పేరిది. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ సినిమాలు చూసి ఈ దర్శకుడి గురించి ఏదో అనుకున్నారు కానీ.. ‘బేబి’తో తన మీద ఉన్న అభిప్రాయాన్నే మార్చేశాడతను. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని యూత్కు నచ్చేలా క్రేజీగా తీసి.. బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నాడు. తన సినిమాల పబ్లిసిటీ అంతా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా చేస్తుంటాడు సాయి రాజేష్.
ట్విట్టర్ను అతను చక్కగా వాడుకుంటాడనే పేరుంది. అలాంటిది ఈ మధ్య ట్విట్టర్లో ఉన్నట్లుండి ఇన్యాక్టివ్ అయిపోయాడు. ఇందుక్కారణమేంటో ఒక ఇంటర్వ్యూలో సాయి రాజేష్ వెల్లడించాడు. తన నుంచి సాయం అందుకున్న ఒక వ్యక్తే.. తనను బూతులు తిట్టడంతో ట్విట్టర్కు కొంచెం దూరంగా ఉంటుందని భావించి తాను స్లో అయినట్లు అతను వివరించాడు.
ఈ అనుభవం గురించి సాయి రాజేష్ వివరిస్తూ.. ‘‘సోషల్ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తి. దాన్ని ఎంత వరకు వాడాలో అంత వరకే వాడాలి. ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఇబ్బందే. నేను ఒక హీరో సినిమా విషయంలో పెట్టిన పోస్టును చూసి కొందరు నన్ను విమర్శించారు. బూతులు తిట్టారు. ముఖ్యంగా ఒక వ్యక్తి నన్ను తీవ్రంగా తిట్టాడు. ఎందుకలా టార్గెట్ చేసి అసభ్యంగా కామెంట్లు పెడుతున్నాడో తెలుసుకుందామని పర్సనల్ మెసేజ్ పెట్టాను. ఆ క్రమంలో నాకో షాక్ తగిలింది.
తనతో నా పర్సనల్ చాట్ వివరాలు చూస్తే.. కొవిడ్ సమయంలో అనారోగ్యంగా ఉందని, ఆర్థిక సాయం చేయాలని అతను పోస్ట్ పెడితే.. నేను అతడికి నా వంతుగా సాయం చేశా. అప్పుడు తన మైండ్ సెట్ ఏంటో తెలుసుకుందామని.. ‘అప్పుడు నేను సాయం చేశా కదా. ఎందుకు తిడుతున్నావ్’ అని అడిగితే.. ‘దానికీ దీనికీ లింక్ చేస్తున్నావేంటి.. ఇక్కడ అభిమానిని అభిమానిగా చూడాలి. నువ్వు ఆ హీరో ఫ్యాన్. నేను ఈ హీరో ఫ్యాన్. వ్యక్తిగతంగా నీపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది’ అని బదులిచ్చాడు. ఈ షాక్ తగిలినప్పటి నుంచి నేను ట్విట్టర్లో యాక్టివ్గా లేను’’ అని సాయి రాజేష్ తెలిపాడు.
This post was last modified on September 22, 2023 11:45 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…