కూల్ సురేష్.. తమిళనాడులో ఈ పేరు బాగా పాపులర్. యూట్యూబర్గా ప్రస్థానం మొదలుపెట్టి.. అక్కడ మంచి పాపులారిటీ సంపాదించాక నటుడిగా మారాడీ వ్యక్తి. ఈ మధ్య తమిళ చిత్రాల్లో కామెడీ రోల్స్ బాగానే వస్తున్నాయి ఈ నటుడికి. ఐతే ప్రస్తుతం చిన్న సినిమాలు అంత ఈజీగా జనాల దృష్టిలో పడట్లేదన్న సంగతి తెలిసిందే. ఏదో ఒక కాంట్రవర్శీ క్రియేట్ అయితే తప్ప వాటి గురించి జనాలు పట్టించుకోవట్లేదు.
ఈ నేపథ్యంలోనే తాను నటించిన ఓ చిన్న సినిమా వేడుకలో కూల్ సురేష్ చేసిన అతి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతను స్టేజ్ మీద ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ.. మధ్యలో యాంకర్ గురించి ప్రస్తావించి.. వాళ్లను కూడా మనం గౌరవించుకోవాలి అంటూ పక్కనున్న పూలదండ తీసి ఆమెకు వేసేశాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ యాంకర్ తీవ్ర అసహనానికి గురైంది. వెంటనే మాల తీసి కింద పడేసింది.
యాంకర్ కదా అని నవ్వుతూ ఈ విషయాన్ని కవర్ చేయకుండా ఆమె కూల్ సురేష్ వైపు చూస్తూ తిట్టడం మొదలుపెట్టింది. అంతే కాక ఆ తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కూల్ సురేష్ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. తర్వాత యాంకర్ వైపు తిరిగి కోపం వచ్చిందా అని నవ్వుతూ ప్రశ్నించాడు. యాంకర్ ముఖంలో రంగులు మారిపోవడం చూసిన కూల్ సురేష్ తర్వాత టాపిక్ మార్చాడు.
ఐతే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ తర్వాత మైక్ అందుకుని యాంకర్కు సారీ చెప్పాడు. అంతే కాక కూల్ సురేష్ను కూడా సారీ చెప్పమనడంతో అతను కూడా క్షమించమని అడిగాడు. అంతే కాక తాను ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశానని అన్నాడు. ఐతే కూల్ సురేష్ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం చేసినా కూడా ఇంత అవసరం లేదని.. ఇలాంటి నటులను పరిశ్రమ ప్రోత్సహించకూడదని ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on September 20, 2023 6:15 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…