కూల్ సురేష్.. తమిళనాడులో ఈ పేరు బాగా పాపులర్. యూట్యూబర్గా ప్రస్థానం మొదలుపెట్టి.. అక్కడ మంచి పాపులారిటీ సంపాదించాక నటుడిగా మారాడీ వ్యక్తి. ఈ మధ్య తమిళ చిత్రాల్లో కామెడీ రోల్స్ బాగానే వస్తున్నాయి ఈ నటుడికి. ఐతే ప్రస్తుతం చిన్న సినిమాలు అంత ఈజీగా జనాల దృష్టిలో పడట్లేదన్న సంగతి తెలిసిందే. ఏదో ఒక కాంట్రవర్శీ క్రియేట్ అయితే తప్ప వాటి గురించి జనాలు పట్టించుకోవట్లేదు.
ఈ నేపథ్యంలోనే తాను నటించిన ఓ చిన్న సినిమా వేడుకలో కూల్ సురేష్ చేసిన అతి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతను స్టేజ్ మీద ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ.. మధ్యలో యాంకర్ గురించి ప్రస్తావించి.. వాళ్లను కూడా మనం గౌరవించుకోవాలి అంటూ పక్కనున్న పూలదండ తీసి ఆమెకు వేసేశాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ యాంకర్ తీవ్ర అసహనానికి గురైంది. వెంటనే మాల తీసి కింద పడేసింది.
యాంకర్ కదా అని నవ్వుతూ ఈ విషయాన్ని కవర్ చేయకుండా ఆమె కూల్ సురేష్ వైపు చూస్తూ తిట్టడం మొదలుపెట్టింది. అంతే కాక ఆ తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కూల్ సురేష్ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. తర్వాత యాంకర్ వైపు తిరిగి కోపం వచ్చిందా అని నవ్వుతూ ప్రశ్నించాడు. యాంకర్ ముఖంలో రంగులు మారిపోవడం చూసిన కూల్ సురేష్ తర్వాత టాపిక్ మార్చాడు.
ఐతే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ తర్వాత మైక్ అందుకుని యాంకర్కు సారీ చెప్పాడు. అంతే కాక కూల్ సురేష్ను కూడా సారీ చెప్పమనడంతో అతను కూడా క్షమించమని అడిగాడు. అంతే కాక తాను ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశానని అన్నాడు. ఐతే కూల్ సురేష్ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం చేసినా కూడా ఇంత అవసరం లేదని.. ఇలాంటి నటులను పరిశ్రమ ప్రోత్సహించకూడదని ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on September 20, 2023 6:15 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…