కూల్ సురేష్.. తమిళనాడులో ఈ పేరు బాగా పాపులర్. యూట్యూబర్గా ప్రస్థానం మొదలుపెట్టి.. అక్కడ మంచి పాపులారిటీ సంపాదించాక నటుడిగా మారాడీ వ్యక్తి. ఈ మధ్య తమిళ చిత్రాల్లో కామెడీ రోల్స్ బాగానే వస్తున్నాయి ఈ నటుడికి. ఐతే ప్రస్తుతం చిన్న సినిమాలు అంత ఈజీగా జనాల దృష్టిలో పడట్లేదన్న సంగతి తెలిసిందే. ఏదో ఒక కాంట్రవర్శీ క్రియేట్ అయితే తప్ప వాటి గురించి జనాలు పట్టించుకోవట్లేదు.
ఈ నేపథ్యంలోనే తాను నటించిన ఓ చిన్న సినిమా వేడుకలో కూల్ సురేష్ చేసిన అతి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతను స్టేజ్ మీద ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ.. మధ్యలో యాంకర్ గురించి ప్రస్తావించి.. వాళ్లను కూడా మనం గౌరవించుకోవాలి అంటూ పక్కనున్న పూలదండ తీసి ఆమెకు వేసేశాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ యాంకర్ తీవ్ర అసహనానికి గురైంది. వెంటనే మాల తీసి కింద పడేసింది.
యాంకర్ కదా అని నవ్వుతూ ఈ విషయాన్ని కవర్ చేయకుండా ఆమె కూల్ సురేష్ వైపు చూస్తూ తిట్టడం మొదలుపెట్టింది. అంతే కాక ఆ తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కూల్ సురేష్ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. తర్వాత యాంకర్ వైపు తిరిగి కోపం వచ్చిందా అని నవ్వుతూ ప్రశ్నించాడు. యాంకర్ ముఖంలో రంగులు మారిపోవడం చూసిన కూల్ సురేష్ తర్వాత టాపిక్ మార్చాడు.
ఐతే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ తర్వాత మైక్ అందుకుని యాంకర్కు సారీ చెప్పాడు. అంతే కాక కూల్ సురేష్ను కూడా సారీ చెప్పమనడంతో అతను కూడా క్షమించమని అడిగాడు. అంతే కాక తాను ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశానని అన్నాడు. ఐతే కూల్ సురేష్ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం చేసినా కూడా ఇంత అవసరం లేదని.. ఇలాంటి నటులను పరిశ్రమ ప్రోత్సహించకూడదని ట్వీట్లు వేస్తున్నారు.
This post was last modified on September 20, 2023 6:15 pm
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…