సమంత కెరీర్ ఈ మధ్య ఏమంత ఆశాజనకంగా లేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘శాకుంతలం’ దారుణమైన ఫలితాన్నందుకోగా.. ఇటీవలే వచ్చిన రొమాంటిక్ మూవీ ‘ఖుషి’ సైతం నిరాశ పరిచింది. ఈ రెండు చిత్రాలకూ సమంత మైనస్ అయ్యిందనే చర్చ కూడా జరిగింది. సమంత అనారోగ్యం కూడా ఆమె లుక్స్, కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవడం.. చికిత్స కోసం సినిమాల నుంచి గ్యాప్ కూడా తీసుకోవడంతో సమంత కెరీర్ ఇక పుంజుకోవడం కష్టమే అని భావిస్తున్నారు. ఇలాంటి టైంలోనే యుఎస్ నుంచి తన అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా జరిగిన ఈ చిట్ చాట్లో కొత్త ప్రాజెక్టుల గురించి అడిగితే.. ‘ఖుషి’ తర్వాత ఇంకా ఏమీ ఒప్పుకోలేదని ఆమె చెప్పింది. ఐతే ఇకపై తాను రూటు మార్చి భిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
‘‘కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవు. ఇక నుంచి కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. నాకు సూటయ్యే కథలు, పాత్రలతోనే ప్రయాణం చేయాలనుకుంటున్నా. నా కంఫర్ట్ జోన్ను దాటి కథలు చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని సామ్ చెప్పింది. మీ చర్మం చాలా కాంతివంతంగా మారిందే అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. నిజానికి మయోసైటిస్ చికిత్స తర్వాత తన చర్మం పాడైనట్లు సామ్ తెలిపింది.
‘‘మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ ఇచ్చారు. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డా. విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చింది. చిన్మయి మళ్లీ నన్ను గ్లాసీగా మారుస్తానని చెప్పింది’’ అని సామ్ తెలిపింది. ‘సిటాడెల్’ సిరీస్లో తన పాత్ర హాట్గా, ఫన్నీగా ఉంటుందని.. ఆ పాత్ర తనకెంతో సవాలు విసిరిందని.. తన నుంచి ఆ సిరీస్లో బోలెడంత యాక్షన్ చూడొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా సామ్ చెప్పింది.
This post was last modified on September 20, 2023 2:34 pm
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…