సమంత కెరీర్ ఈ మధ్య ఏమంత ఆశాజనకంగా లేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘శాకుంతలం’ దారుణమైన ఫలితాన్నందుకోగా.. ఇటీవలే వచ్చిన రొమాంటిక్ మూవీ ‘ఖుషి’ సైతం నిరాశ పరిచింది. ఈ రెండు చిత్రాలకూ సమంత మైనస్ అయ్యిందనే చర్చ కూడా జరిగింది. సమంత అనారోగ్యం కూడా ఆమె లుక్స్, కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవడం.. చికిత్స కోసం సినిమాల నుంచి గ్యాప్ కూడా తీసుకోవడంతో సమంత కెరీర్ ఇక పుంజుకోవడం కష్టమే అని భావిస్తున్నారు. ఇలాంటి టైంలోనే యుఎస్ నుంచి తన అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా జరిగిన ఈ చిట్ చాట్లో కొత్త ప్రాజెక్టుల గురించి అడిగితే.. ‘ఖుషి’ తర్వాత ఇంకా ఏమీ ఒప్పుకోలేదని ఆమె చెప్పింది. ఐతే ఇకపై తాను రూటు మార్చి భిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
‘‘కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవు. ఇక నుంచి కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. నాకు సూటయ్యే కథలు, పాత్రలతోనే ప్రయాణం చేయాలనుకుంటున్నా. నా కంఫర్ట్ జోన్ను దాటి కథలు చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని సామ్ చెప్పింది. మీ చర్మం చాలా కాంతివంతంగా మారిందే అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. నిజానికి మయోసైటిస్ చికిత్స తర్వాత తన చర్మం పాడైనట్లు సామ్ తెలిపింది.
‘‘మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ ఇచ్చారు. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డా. విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చింది. చిన్మయి మళ్లీ నన్ను గ్లాసీగా మారుస్తానని చెప్పింది’’ అని సామ్ తెలిపింది. ‘సిటాడెల్’ సిరీస్లో తన పాత్ర హాట్గా, ఫన్నీగా ఉంటుందని.. ఆ పాత్ర తనకెంతో సవాలు విసిరిందని.. తన నుంచి ఆ సిరీస్లో బోలెడంత యాక్షన్ చూడొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా సామ్ చెప్పింది.
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…