కోలీవుడ్లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ తనయురాలు మీరా ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచి వేసింది. 14వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల మీరా డిప్రెషన్ కారణంగా తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. ఇంతకుమించి వివరాలేమీ బయటికి రాలేదు. మీరా మృతితో కోలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నడూ ఏ వివాదంలో చిక్కుకోని.. ఎప్పుడూ ఎంతో అణకువతో కనిపించే విజయ్ ఆంటోనీ ఇలాంటి విషాదం చూడాల్సి రావడం అందరినీ వేదనకు గురి చేస్తోంది. మీడియాతో కూడా చాలా తక్కువ మాట్లాడే విజయ్ ఆంటోనీ.. ఆత్మహత్యకు వ్యతిరేకంగా జరిగిన అవగాహన కార్యక్రమాల్లో ప్రచారకర్తగా పాల్గొనడం గమనార్హం. ఒకప్పుడు అతను ఆ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పని.. జీవితంలో ఎంత కష్టం వచ్చినా నిలబడి ఎదుర్కోవాలే తప్ప.. మన ప్రాణాలను మనం తీసుకుని కుటుంబ సభ్యులకు శోకం మిగల్చడం పాపమని విజయ్ ఓ కార్యక్రమంలో చెప్పాడు. అంతే కాక తమ కుటుంబం ఆత్మహత్య బాధితులమే అంటూ తనకు ఏడేళ్ల వయసు ఉండగా తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయాన్ని అతను ఆవేదనా భరితంగా చెప్పుకున్నాడు.
ఆ సమయంలో తన తల్లి తనతో పాటు చెల్లెలి బాధ్యత తీసుకుని కుటుంబాన్ని కష్టపడి పోషించిందని చెప్పాడు. కుటుంబంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని.. తాను ఎంతో బాధ అనుభవించి, కష్టాలు పడ్డానని.. తాను అన్నీ చూశానని.. అందుకే తాను ఎక్కువగా మాట్లాడనని ఆ ప్రసంగంలో విజయ్ పేర్కొన్నాడు. అప్పుడు తండ్రిని కోల్పోయి కష్టపడ్డ విజయ్.. ఇప్పుడు కూతురిని పోగొట్టుకుని ఎంత బాధ పడుతుంటాడో అని అందరూ తనపై సానుభూతి చూపిస్తున్నారు.
This post was last modified on September 20, 2023 10:24 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…