కోలీవుడ్లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ తనయురాలు మీరా ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ కలచి వేసింది. 14వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల మీరా డిప్రెషన్ కారణంగా తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. ఇంతకుమించి వివరాలేమీ బయటికి రాలేదు. మీరా మృతితో కోలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నడూ ఏ వివాదంలో చిక్కుకోని.. ఎప్పుడూ ఎంతో అణకువతో కనిపించే విజయ్ ఆంటోనీ ఇలాంటి విషాదం చూడాల్సి రావడం అందరినీ వేదనకు గురి చేస్తోంది. మీడియాతో కూడా చాలా తక్కువ మాట్లాడే విజయ్ ఆంటోనీ.. ఆత్మహత్యకు వ్యతిరేకంగా జరిగిన అవగాహన కార్యక్రమాల్లో ప్రచారకర్తగా పాల్గొనడం గమనార్హం. ఒకప్పుడు అతను ఆ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పని.. జీవితంలో ఎంత కష్టం వచ్చినా నిలబడి ఎదుర్కోవాలే తప్ప.. మన ప్రాణాలను మనం తీసుకుని కుటుంబ సభ్యులకు శోకం మిగల్చడం పాపమని విజయ్ ఓ కార్యక్రమంలో చెప్పాడు. అంతే కాక తమ కుటుంబం ఆత్మహత్య బాధితులమే అంటూ తనకు ఏడేళ్ల వయసు ఉండగా తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయాన్ని అతను ఆవేదనా భరితంగా చెప్పుకున్నాడు.
ఆ సమయంలో తన తల్లి తనతో పాటు చెల్లెలి బాధ్యత తీసుకుని కుటుంబాన్ని కష్టపడి పోషించిందని చెప్పాడు. కుటుంబంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని.. తాను ఎంతో బాధ అనుభవించి, కష్టాలు పడ్డానని.. తాను అన్నీ చూశానని.. అందుకే తాను ఎక్కువగా మాట్లాడనని ఆ ప్రసంగంలో విజయ్ పేర్కొన్నాడు. అప్పుడు తండ్రిని కోల్పోయి కష్టపడ్డ విజయ్.. ఇప్పుడు కూతురిని పోగొట్టుకుని ఎంత బాధ పడుతుంటాడో అని అందరూ తనపై సానుభూతి చూపిస్తున్నారు.
This post was last modified on September 20, 2023 10:24 am
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…