పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ తెలుగేతర మార్కెట్లను టార్గెట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాలుగు భాషలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ కూడా ప్లాన్ చేస్తున్నా కానీ ఇది ప్రధానంగా పాన్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనుంది. రష్మిక హీరోయిన్ అవడం వల్ల తమిళ, కన్నడ మార్కెట్లలో ఢోకా వుండదు. ఎలాగో మలయాళంలో అల్లు అర్జున్కి గ్యారెంటీ మార్కెట్ వుండనే వుంది.
కానీ కొరటాల శివతో చేసే చిత్రాన్ని మాత్రం పూర్తిస్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నాడు. ఇందుకోసం బాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోయిన్ని తీసుకురావాలని ఫిక్సయ్యారు. సాహోలో నటించిన శ్రద్ధ కపూర్ అయితే ఎలా వుంటుందనే చర్చ జరిగినట్టు సమాచారం. వీలుంటే ఇంకా పెద్ద రేంజ్ హీరోయిన్ని లేదా శ్రద్ధనే తీసుకుంటే ఈ చిత్రానికి బాలీవుడ్లో రీచ్ వుంటుందని భావిస్తున్నారు.
అలాగే సపోర్టింగ్ కాస్ట్ కూడా నార్త్ ఇండియాలో పాపులర్ అయిన వాళ్లయితే బెస్ట్ అనుకుంటున్నారు. కొరటాల శివ చెప్పిన కథ కూడా అన్ని భాషల వారికీ కనక్ట్ అయ్యే యూనివర్సల్ పాయింటే కావడంతో అల్లు అర్జున్ ఈ చిత్రం పట్ల చాలా ఎక్సయిటెడ్గా వున్నాడు.
This post was last modified on August 23, 2020 12:02 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…