తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అనేకమంది జాతీయ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. ఐతే సినీ పరిశ్రమ నుంచి బాబు అరెస్ట్ మీద సరైన స్పందన లేదనే చర్చ నడుస్తోంది.
సినీ పరిశ్రమకు చంద్రబాబు చేసినంత మేలు ఇంకెవరూ చేయలేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఆయన అరెస్ట్ మీద అశ్వినీదత్, కేఎస్ రామారావు లాంటి కొద్ది మంది మాత్రమే స్పందించారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న, ఆయన వల్ల మేళ్లు పొందిన చాలామంది సైలెంట్గా ఉండటం మీద టీడీపీ వాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత సురేష్ బాబుకు ‘సప్తసాగరాలు దాటి’ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
చంద్రబాబు అరెస్ట్పై ఇండస్ట్రీ నుంచి చాలామంది ఎందుకు స్పందించట్లేదని అడిగితే సురేష్ బాబు ఆసక్తికర రీతిలో స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు. అసలు మేమెందుకు స్టేట్మెంట్స్ ఇవ్వాలి? మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు. సామాన్య ప్రజలమూ కాదు. మేం సినిమా వాళ్లం. మేం వచ్చింది సినిమాకు సంబంధించిన ఈవెంట్కు. ఇక్కడ రాజకీయాల ప్రస్తావన ఎందుకు? అసలు మనకెందుకు రాజకీయాలు? మా నాన్న తెలుగుదేశం ఎంపీగా పని చేశారు.
నేను కూడా టీడీపీ కోసం పని చేశాను. కానీ అది మా వ్యక్తిగతం. సురేష్ బాబుగా నేను ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. దేన్నయినా ఖండించవచ్చు. కానీ పరిశ్రమ ప్రతినిధిగా మాత్రం రాజకీయాలపై మాట్లాడను. నేనే కాదు ఇంకెవరూ కూడా పరిశ్రమ తరఫు నుంచి రాజకీయాలపై స్టేట్మెంట్స్ ఇవ్వం. వ్యక్తిగతంగా ఎవరికి ఏ అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పరిశ్రమ వేరు. సినీ పరిశ్రమకు చంద్రబాబు గారు మంచి చేశారు. ఆయనే కాదు.. ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు.. ఇలా చాలామంది మంచి చేశారు” అని సురేష్ బాబు అన్నారు.
This post was last modified on September 19, 2023 2:02 pm
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…