తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా ఎంత దుమారం రేపిందో తెలిసిందే. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అనేకమంది జాతీయ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. ఐతే సినీ పరిశ్రమ నుంచి బాబు అరెస్ట్ మీద సరైన స్పందన లేదనే చర్చ నడుస్తోంది.
సినీ పరిశ్రమకు చంద్రబాబు చేసినంత మేలు ఇంకెవరూ చేయలేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఆయన అరెస్ట్ మీద అశ్వినీదత్, కేఎస్ రామారావు లాంటి కొద్ది మంది మాత్రమే స్పందించారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న, ఆయన వల్ల మేళ్లు పొందిన చాలామంది సైలెంట్గా ఉండటం మీద టీడీపీ వాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత సురేష్ బాబుకు ‘సప్తసాగరాలు దాటి’ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి.
చంద్రబాబు అరెస్ట్పై ఇండస్ట్రీ నుంచి చాలామంది ఎందుకు స్పందించట్లేదని అడిగితే సురేష్ బాబు ఆసక్తికర రీతిలో స్పందించారు. ‘‘సినీ పరిశ్రమ రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు. అసలు మేమెందుకు స్టేట్మెంట్స్ ఇవ్వాలి? మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేం రాజకీయ నాయకులం కాదు. సామాన్య ప్రజలమూ కాదు. మేం సినిమా వాళ్లం. మేం వచ్చింది సినిమాకు సంబంధించిన ఈవెంట్కు. ఇక్కడ రాజకీయాల ప్రస్తావన ఎందుకు? అసలు మనకెందుకు రాజకీయాలు? మా నాన్న తెలుగుదేశం ఎంపీగా పని చేశారు.
నేను కూడా టీడీపీ కోసం పని చేశాను. కానీ అది మా వ్యక్తిగతం. సురేష్ బాబుగా నేను ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. దేన్నయినా ఖండించవచ్చు. కానీ పరిశ్రమ ప్రతినిధిగా మాత్రం రాజకీయాలపై మాట్లాడను. నేనే కాదు ఇంకెవరూ కూడా పరిశ్రమ తరఫు నుంచి రాజకీయాలపై స్టేట్మెంట్స్ ఇవ్వం. వ్యక్తిగతంగా ఎవరికి ఏ అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పరిశ్రమ వేరు. సినీ పరిశ్రమకు చంద్రబాబు గారు మంచి చేశారు. ఆయనే కాదు.. ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు.. ఇలా చాలామంది మంచి చేశారు” అని సురేష్ బాబు అన్నారు.
This post was last modified on September 19, 2023 2:02 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…