Movie News

డ్రగ్స్ కేసులో నవదీప్.. ఏం జరగనుంది?

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఓ నిరంతర చర్చలా కొనసాగుతున్న సంగతి తెలిసిందే, ఎక్కడో ఒకచోట దేశంలో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ పట్టుకోవడం, ఆ కేసులో విచారణ జరపడంతో టాలీవుడ్ లోని ఒకరో ఇద్దరికో ఆ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు రావడం జరుగుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ డ్రగ్స్ వాడాడంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు.

మాదాపూర్ లో రైడ్ సందర్భంగా రామ్ చంద్ అనే వ్యక్తి పట్టుబడ్డాడని, అతను ఇచ్చిన వాంగ్మూలంలో తనతో కలిసి నవదీప్ డ్రగ్స్ సేవించినట్టుగా వెల్లడించాలని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న నవదీప్ నివాసంలో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నవదీప్ ను నిందితుడిగా చేర్చిన అధికారులు తాజాగా ఈనెల 16న నవదీప్ ఇంట్లో సోదాలు జరిపారని తెలుస్తోంది.

మరోవైపు, తనను అరెస్ట్ చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో, సెప్టెంబర్ 19వ తేదీ వరకు నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టులో నవదీప్ కు సంబంధించిన కౌంటర్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు దాఖలు చేయబోతున్నారు. నవదీప్ ను విచారణ జరిపితే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో, హైకోర్టులో నవదీప్ కు సంబంధించి ఏ నిర్ణయం వెలువడబోతోంది అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

This post was last modified on September 19, 2023 1:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago