వెరైటీ సినిమాలు చూడాలనుకునేవారికి ఉపేంద్ర పేరెత్తితే గూస్ బంప్స్ వస్తాయి. 90వ దశకంలో ఓం, ఉపేంద్ర, ఎ, రా లాంటి చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. నటుడిగానే కాక దర్శకుడిగానూ అతను వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా అంటే కథాకథనాలు.. టేకింగ్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందని విధంగా ఉంటుంది.
‘ఉపేంద్ర’తో తెలుగులోనూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అతను.. గత 20 దశాబ్దాల్లో డైరెక్ట్ చేసిన సినిమాలు రెండు మాత్రమే. సూపర్, ఉపేంద్ర-2 తప్ప వేరే సినిమాలు చేయలేదు ఉపేంద్ర. చాలా గ్యాప్ తర్వాత అతను ‘యుఐ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే ఒక వెరైటీ వీడియోతో ఈ సినిమా టీజర్ గురించి హింట్ ఇచ్చారు. వినాయక చవితికి సందర్భంగా సోమవారం ‘యుఐ’ టీజర్ కూడా లాంచ్ అయింది.
ఈ టీజర్లో ఏముందా అని ఓపెన్ చేసి.. రెండు నిమిషాల నిడివి మొత్తం చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయింది. అందులో వాయిస్లు తప్ప.. విజువల్స్ లేవు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంతో విజువల్ కనిపించడం లేదేమో అని మళ్లీ మళ్లీ ప్లే చేసి చూసినా ఫలితం లేకపోయింది. అసలు విషయం ఏంటంటే.. విజువల్స్ ఏమీ లేకుండా వాయిస్లతోనే ఈ టీజర్ రిలీజ్ చేసి షాకిచ్చాడు ఉపేంద్ర.
కేవలం వాయిస్లు మాత్రమే విని.. దృశ్యాలు ప్రేక్షకులే ఊహించుకోవాలని.. ఇది ప్రేక్షకుల ఊహా శక్తికి పరీక్ష పెట్టే ఉద్దేశంతో టీజర్ అని ఉపేంద్ర తర్వాత వెల్లడించాడు. ఇప్పుడు ఒక్కో ప్రేక్షకుడు ఒక్కోలా టీజర్ను ఊహించుకుని ఉంటాడని.. తర్వాత అసలు విజువల్స్ చూపిస్తానని అతనన్నాడు. ఉపేంద్ర రూటే వేరని.. ఇలాంటి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలు అతడికి మాత్రమే వస్తాయని అభిమానుల ఉప్పిని కొనియాడుతున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on September 18, 2023 9:36 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…