వెరైటీ సినిమాలు చూడాలనుకునేవారికి ఉపేంద్ర పేరెత్తితే గూస్ బంప్స్ వస్తాయి. 90వ దశకంలో ఓం, ఉపేంద్ర, ఎ, రా లాంటి చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. నటుడిగానే కాక దర్శకుడిగానూ అతను వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా అంటే కథాకథనాలు.. టేకింగ్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందని విధంగా ఉంటుంది.
‘ఉపేంద్ర’తో తెలుగులోనూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న అతను.. గత 20 దశాబ్దాల్లో డైరెక్ట్ చేసిన సినిమాలు రెండు మాత్రమే. సూపర్, ఉపేంద్ర-2 తప్ప వేరే సినిమాలు చేయలేదు ఉపేంద్ర. చాలా గ్యాప్ తర్వాత అతను ‘యుఐ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే ఒక వెరైటీ వీడియోతో ఈ సినిమా టీజర్ గురించి హింట్ ఇచ్చారు. వినాయక చవితికి సందర్భంగా సోమవారం ‘యుఐ’ టీజర్ కూడా లాంచ్ అయింది.
ఈ టీజర్లో ఏముందా అని ఓపెన్ చేసి.. రెండు నిమిషాల నిడివి మొత్తం చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయింది. అందులో వాయిస్లు తప్ప.. విజువల్స్ లేవు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంతో విజువల్ కనిపించడం లేదేమో అని మళ్లీ మళ్లీ ప్లే చేసి చూసినా ఫలితం లేకపోయింది. అసలు విషయం ఏంటంటే.. విజువల్స్ ఏమీ లేకుండా వాయిస్లతోనే ఈ టీజర్ రిలీజ్ చేసి షాకిచ్చాడు ఉపేంద్ర.
కేవలం వాయిస్లు మాత్రమే విని.. దృశ్యాలు ప్రేక్షకులే ఊహించుకోవాలని.. ఇది ప్రేక్షకుల ఊహా శక్తికి పరీక్ష పెట్టే ఉద్దేశంతో టీజర్ అని ఉపేంద్ర తర్వాత వెల్లడించాడు. ఇప్పుడు ఒక్కో ప్రేక్షకుడు ఒక్కోలా టీజర్ను ఊహించుకుని ఉంటాడని.. తర్వాత అసలు విజువల్స్ చూపిస్తానని అతనన్నాడు. ఉపేంద్ర రూటే వేరని.. ఇలాంటి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలు అతడికి మాత్రమే వస్తాయని అభిమానుల ఉప్పిని కొనియాడుతున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on September 18, 2023 9:36 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…