Movie News

ఓటీటీల తీరుపై భరణి ఆవేదన

ఓటీటీలు వచ్చాక నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశాలు పెరిగాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన వాళ్లకు కూడా ఓటీటీలు ప్రత్యామ్నాయ వేదికలుగా మారి చేతి నిండా పని దొరుకుతోంది. వీటి వల్ల సినీ పరిశ్రమలో ఉపాధి పెరిగిందన్నది వాస్తవం. కానీ తన లాంటి వాళ్లకు మాత్రం ఓటీటీలు తలుపులు మూసేశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి.

ఓటీటీల రాకతో బోల్డ్ కంటెంట్ పెరిగిపోయిందని.. దీంతో ఆర్ట్ సినిమాలను పట్టించుకునేవారే కరవయ్యారని.. దీంతో తనలోని రచయిత, దర్శకుడు మౌనం వహించాల్సి వస్తోందని ఆయన అన్నారు. తాను కీలక పాత్ర పోషించిన ‘పెదకాపు’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మీడియాను కలిసిన భరణి.. ఓటీటీల తీరు పట్ల ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘దర్శకుడిగా నేను ‘మిథునం’ తీసి పదేళ్లు దాటింది. తర్వాత ఇంకో సినిమా చేయలేదు. నా తరహా కళాత్మక చిత్రాలు తీసే నిర్మాతలే కనిపించడం లేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నాలాంటి వాళ్లకు తలుపులు మూసేశాయి. ఆర్ట్‌లో కూడా హింస, అసభ్యత కనిపించాల్సిందే అంటున్నారు. వాళ్లకు కావాల్సిన కంటెంటే ఇవ్వాలంటున్నారు. నేనేమో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా రాయకుండా తప్పించుకుని వచ్చిన వాడిని.

ఆర్ట్ సినిమాలు తీసే పరిస్థితులు ఇంక ఎప్పటికీ రావా అనే ప్రశ్న వస్తుందేమో. ప్రస్తుతం అలాగే ఉంది పరిస్థితి. కానీ ఎప్పటికీ ఇలాగే ఉండదు. కొరివి కారం, పచ్చళ్లు అన్నీ తిన్నాక అనారోగ్యానికి గురై డాక్టర్ దగ్గరికి వెళ్తే బీరకాయ, పాలు అంటూ పత్యం చెబుతాడు. అలా పత్యం సినిమాలు కూడా వస్తాయి. రేపన్న రోజు ఒక సాత్వికమైన సినిమా అద్భుతంగా ఆడితే.. అందరూ అలాంటి సినిమాలపై దృష్టిపెడతారు. అలాంటి సినిమాల కోసం ఎదురు చూడాలి అంతే’’ అని భరణి అన్నారు.

This post was last modified on September 17, 2023 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

40 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago