Movie News

ఓటీటీల తీరుపై భరణి ఆవేదన

ఓటీటీలు వచ్చాక నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశాలు పెరిగాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన వాళ్లకు కూడా ఓటీటీలు ప్రత్యామ్నాయ వేదికలుగా మారి చేతి నిండా పని దొరుకుతోంది. వీటి వల్ల సినీ పరిశ్రమలో ఉపాధి పెరిగిందన్నది వాస్తవం. కానీ తన లాంటి వాళ్లకు మాత్రం ఓటీటీలు తలుపులు మూసేశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి.

ఓటీటీల రాకతో బోల్డ్ కంటెంట్ పెరిగిపోయిందని.. దీంతో ఆర్ట్ సినిమాలను పట్టించుకునేవారే కరవయ్యారని.. దీంతో తనలోని రచయిత, దర్శకుడు మౌనం వహించాల్సి వస్తోందని ఆయన అన్నారు. తాను కీలక పాత్ర పోషించిన ‘పెదకాపు’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మీడియాను కలిసిన భరణి.. ఓటీటీల తీరు పట్ల ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘దర్శకుడిగా నేను ‘మిథునం’ తీసి పదేళ్లు దాటింది. తర్వాత ఇంకో సినిమా చేయలేదు. నా తరహా కళాత్మక చిత్రాలు తీసే నిర్మాతలే కనిపించడం లేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నాలాంటి వాళ్లకు తలుపులు మూసేశాయి. ఆర్ట్‌లో కూడా హింస, అసభ్యత కనిపించాల్సిందే అంటున్నారు. వాళ్లకు కావాల్సిన కంటెంటే ఇవ్వాలంటున్నారు. నేనేమో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా రాయకుండా తప్పించుకుని వచ్చిన వాడిని.

ఆర్ట్ సినిమాలు తీసే పరిస్థితులు ఇంక ఎప్పటికీ రావా అనే ప్రశ్న వస్తుందేమో. ప్రస్తుతం అలాగే ఉంది పరిస్థితి. కానీ ఎప్పటికీ ఇలాగే ఉండదు. కొరివి కారం, పచ్చళ్లు అన్నీ తిన్నాక అనారోగ్యానికి గురై డాక్టర్ దగ్గరికి వెళ్తే బీరకాయ, పాలు అంటూ పత్యం చెబుతాడు. అలా పత్యం సినిమాలు కూడా వస్తాయి. రేపన్న రోజు ఒక సాత్వికమైన సినిమా అద్భుతంగా ఆడితే.. అందరూ అలాంటి సినిమాలపై దృష్టిపెడతారు. అలాంటి సినిమాల కోసం ఎదురు చూడాలి అంతే’’ అని భరణి అన్నారు.

This post was last modified on September 17, 2023 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆర్టీసీ స‌మ్మె… అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. త‌ద్వారా ఉద్యోగాల‌కు పొంచి…

11 minutes ago

నాయకుడు బయటికి వచ్చేది ఎప్పుడు

తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…

1 hour ago

ఆర్టీసీ డ్రైవర్ బలిదానం.. సీఎంకు పెద్ద పరీక్ష

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…

1 hour ago

అనంతపురం హనీట్రాప్ గుట్టు వీడింది

సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…

4 hours ago

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

5 hours ago

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

7 hours ago