Movie News

19 ఏళ్ళ తర్వాత సినిమా చూస్తున్న హీరో

చేసింది అతి కొద్ది సినిమాలే అయినా 7జి బృందావన్ కాలనీ హీరోగా రవికృష్ణ అప్పటి యూత్ కి బాగా గుర్తుండిపోయాడు. ఆ తర్వాత నటించినవేవి ఆడకపోవడంతో చాలా త్వరగా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అసలు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత దూరంగా చెన్నైలో ఉండిపోయాడు. తండ్రి నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు తీస్తున్నా సరే కనీసం దాని సెట్లలో కూడా కనిపించేవాడు కాదు. కట్ చేస్తే తనకు పేరు తెచ్చిన డెబ్యూ మూవీ కోసమే మళ్ళీ 19 ఏళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చాడు రవికృష్ణ.

వచ్చే 22న రీ రిలీజ్ కాబోతున్న 7జి బృందావన్ కాలనీ కోసం టీమ్ ఏదో కొత్త విడుదల రేంజ్ లో ప్రమోషన్లు చేస్తోంది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో సహా టీమ్ ని పోగేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తోంది. శుక్రవారం అందరూ కలిసి సుదర్శన్ థియేటర్ లో షో కూడా చూడబోతున్నారు. విచిత్రమేంటంటే ఈ రవికృష్ణ ఇప్పటిదాకా ఈ సినిమా పూర్తిగా చూడలేదట. కేవలం కామెడీ సన్నివేశాలు, సునీల్ శెట్టితో ఉన్న ఎపిసోడ్లు, పాటలు తప్ప మళ్ళీ వీక్షించలేదట. ఎందుకయ్యా అంటే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ తనను బాగా కలవరపరుస్తుందని, అందుకే అంత ధైర్యం చేయలేకపోయానని చెప్పాడు.

షూట్ చేస్తున్న టైంలోనూ అనిత చనిపోయాక వచ్చే సన్నివేశాలు చేసి ఇంటికొచ్చాక గోడవైపు గంటల తరబడి చూస్తూ ఉండిపోవడం గమనించి అమ్మ భయపడిందని అందుకే దీనికి దూరంగా ఉన్నానని చెప్పాడు. ఫైనల్ గా ఇప్పుడు ప్రేక్షకుల మధ్య కూర్చుని పూర్తిగా చూస్తానని చెప్పాడు. అయినా ఒక హీరో తాను నటించిన బ్లాక్ బస్టర్ రెండు దశాబ్దాల పాటు చూడకపోవడం విచిత్రమే. అది కూడా కల్ట్ క్లాసిక్ లాంటి మూవీని. 7జి బృందావన్ కాలనీ 2ని వచ్చే నెల సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే మొదలుపెట్టబోతున్నారు. రవికృష్ణనే హీరోగా నటించబోతున్నట్టు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. 

This post was last modified on September 17, 2023 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

2 hours ago

ఓజి… వరప్రసాద్… పెద్ది?

మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…

2 hours ago

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం…

3 hours ago

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

4 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

5 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

6 hours ago