చేసింది అతి కొద్ది సినిమాలే అయినా 7జి బృందావన్ కాలనీ హీరోగా రవికృష్ణ అప్పటి యూత్ కి బాగా గుర్తుండిపోయాడు. ఆ తర్వాత నటించినవేవి ఆడకపోవడంతో చాలా త్వరగా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అసలు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత దూరంగా చెన్నైలో ఉండిపోయాడు. తండ్రి నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు తీస్తున్నా సరే కనీసం దాని సెట్లలో కూడా కనిపించేవాడు కాదు. కట్ చేస్తే తనకు పేరు తెచ్చిన డెబ్యూ మూవీ కోసమే మళ్ళీ 19 ఏళ్ళ తర్వాత మీడియా ముందుకు వచ్చాడు రవికృష్ణ.
వచ్చే 22న రీ రిలీజ్ కాబోతున్న 7జి బృందావన్ కాలనీ కోసం టీమ్ ఏదో కొత్త విడుదల రేంజ్ లో ప్రమోషన్లు చేస్తోంది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో సహా టీమ్ ని పోగేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తోంది. శుక్రవారం అందరూ కలిసి సుదర్శన్ థియేటర్ లో షో కూడా చూడబోతున్నారు. విచిత్రమేంటంటే ఈ రవికృష్ణ ఇప్పటిదాకా ఈ సినిమా పూర్తిగా చూడలేదట. కేవలం కామెడీ సన్నివేశాలు, సునీల్ శెట్టితో ఉన్న ఎపిసోడ్లు, పాటలు తప్ప మళ్ళీ వీక్షించలేదట. ఎందుకయ్యా అంటే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ తనను బాగా కలవరపరుస్తుందని, అందుకే అంత ధైర్యం చేయలేకపోయానని చెప్పాడు.
షూట్ చేస్తున్న టైంలోనూ అనిత చనిపోయాక వచ్చే సన్నివేశాలు చేసి ఇంటికొచ్చాక గోడవైపు గంటల తరబడి చూస్తూ ఉండిపోవడం గమనించి అమ్మ భయపడిందని అందుకే దీనికి దూరంగా ఉన్నానని చెప్పాడు. ఫైనల్ గా ఇప్పుడు ప్రేక్షకుల మధ్య కూర్చుని పూర్తిగా చూస్తానని చెప్పాడు. అయినా ఒక హీరో తాను నటించిన బ్లాక్ బస్టర్ రెండు దశాబ్దాల పాటు చూడకపోవడం విచిత్రమే. అది కూడా కల్ట్ క్లాసిక్ లాంటి మూవీని. 7జి బృందావన్ కాలనీ 2ని వచ్చే నెల సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే మొదలుపెట్టబోతున్నారు. రవికృష్ణనే హీరోగా నటించబోతున్నట్టు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…