జవాన్ రూపంలో షారుఖ్ ఖాన్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అట్లీ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఒక సౌత్ డైరెక్టర్ వచ్చి తమ రికార్డులను పాతరేయడం పట్ల అక్కడి మేకర్స్ లోలోపల రగిలిపోతున్నా తీసింది తమవాడితోనే కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మసాలా క్రియేటర్ తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే గుట్టు మాత్రం విప్పడం లేదు. పలు హిందీ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశాడు అట్లీ. ఒకరకంగా చెప్పాలంటే అయోమయం సృష్టించాడు.
అట్లీ వెర్షన్ ప్రకారం తను అల్లు అర్జున్ తో టచ్ లో ఉన్న సంగతి వాస్తవమే. తరచుగా కలుసుకుంటూనే ఉన్నామని, దేవుడి దీవనెలు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుందని నర్మగర్భంగా అన్నాడు. ఇంకోవైపు జవాన్ 2 సీక్వెల్ తీస్తానని, షారుఖ్ ఖాన్ సైతం పూర్తి సంసిద్ధత వ్యక్తం చేశానని చెప్పాడు. అంతే కాదు తమిళ స్టార్ విజయ్ షారుఖ్ లను కలిపి ఒక సినిమా తీస్తే ఈజీగా పదిహేను వందల కోట్లు వసూలవుతాయని జోస్యం చెప్పాడు. అందుకే జవాన్ లో విజయ్ క్యామియో చేయించే ఆలోచన డ్రాప్ అయినట్టుగా అసలు విషయం చెప్పకుండా పైపై పూతలతో మమ అనిపించేశాడు.
ఇంతే కాదు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లకు లైన్లు వినిపించాడట. ఇన్నేసి ఆప్షన్లు ఉన్నా అట్లీ ఫైనల్ గా ఎవరితో లాక్ చేసుకుంటాడో తెలియాలంటే ఇంకో నాలుగు నెలలకు వరకు ఆగాల్సిందే. తమ తొలి సంతానం కోసం నాలుగు నెలల పాటు ఇంటి పట్టునే ఉండబోతున్నానని, ఆ తర్వాత బయటికి వచ్చి ఎవరితో చేయబోయేది వెల్లడిస్తానని చెప్పాడు. ఈ లెక్కన వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలోనే అట్లీ చేయబోయే హీరో తాలూకు క్లారిటీ వస్తుంది. పుష్ప తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో చేతులు కలిపిన బన్నీ ఒకవేళ అట్లీని కూడా లాక్ చేసుకుంటే అభిమానులకు అంతకన్నా పండగేముంది.
This post was last modified on September 17, 2023 1:31 pm
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…