సాధారణంగా కమర్షియల్ హీరోలు ప్రయోగాలు చేయడం అరుదు. కమల్ హాసన్ ఒక్కరే దానికి మినహాయింపు. అయితే ఇప్పటి ప్రేక్షకుల బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన గొప్ప క్లాసిక్స్ ని థియేటర్ లో చూసే అదృష్టం దక్కకపోవడం. అందుకే ఆ అనుభూతిని తిరిగి అందివ్వాలనే ఉద్దేశంతో పుష్పక విమానంని మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూకీ సినిమలో డైలాగ్స్ ఉండవు. కేవలం సైగల ద్వారా పాత్రలు మాట్లాడుకుంటూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా కథ అర్థమయ్యేలా గొప్పగా తీర్చిదిద్దారు.
యూట్యూబ్ లో ఉండగా ఇది టికెట్ కొని చూడాలానే ప్రశ్నకు సమాధానం ఉంది. ఈ మూవీ 1987లో కన్నడలో రూపొందింది. అక్కడ డబ్బింగ్ నిషేధం కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఆ భాషలో తీసి తమిళంలో పేసుం పదం, తెలుగులో పుష్పక విమానం, హిందీలో పుష్పక్ పేరుతో రిలీజ్ చేశారు. కమల్ హాసన్, అమల, టిను ఆనంద్, ప్రతాప్ పోతన్, పీఎల్ నారాయణ, శామీర్ కక్కర్ తదితరుల అద్భుత నటన కట్టిపడేసేలా ఉంటుంది. సౌండ్ కీలక పాత్ర పోషించే ఇలాంటి సైలెంట్ డ్రామాకు సంగీత దర్శకుడు ఎల్ వైద్యనాథన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు.
ఒక నిరుద్యోగి జీవితంలో జరిగే చిన్న సంఘటన చుట్టూ బ్లాక్ కామెడీని అల్లి రాసుకున్న స్క్రీన్ ప్లే కట్టిపడేసేలా ఉంటుంది. దీన్ని ఆస్వాదించాలంటే బిగ్ స్క్రీన్ అయితేనే కరెక్ట్. కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ మాసాలాలు లేకుండా ఒక క్లీన్ ఎంటర్ టైనర్ గా పుష్పక విమానంది చాలా ప్రత్యేక స్థానం. తర్వాత ఒకరిద్దరు ఇలాంటి సైలెంట్ ఎక్స్ పరిమెంట్లు చేశారు కానీ కనీసం పుష్పక విమానం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. కేవలం 35 లక్షల్లో తీస్తే కోటి రూపాయలు పైగా వసూలు చేయడం అప్పట్లో రికార్డు. దీని తర్వాత ఎవర్ గ్రీన్ క్లాసిక్ నాయకుడుని రీ రిలీజ్ చేయాలని అభిమానుల డిమాండ్.
This post was last modified on September 17, 2023 11:37 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…