మొన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ పాట లీక్ ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో చూశాం. నిర్మాత దిల్ రాజు ఏకంగా క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీస్ డిపార్ట్ మెంట్ కి విన్నవించారు. తమన్ సైతం ఈ వ్యవహారం పట్ల చాలా బాధ పడినట్టుగా వ్యక్తపరిచిన ఒక ఆడియో వైరలవుతోంది. నమ్మిన వాళ్లే మోసం చేశారన్నట్టుగా అందులో ఉంది. అయితే నిజంగా తన గొంతేనా కాదానేది పక్కనపెడితే ఒక గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ కావాల్సిన ఇలాంటి సాంగ్ ఇంత అన్యాయంగా బయటికి రావడం అభిమానులను కలవరపరిచింది.
సరే జరిగిందేదో జరిగిపోయింది దాన్నెలాగూ మార్చలేం కాని ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక లీకైన జరగండి జరగండి పాట లిరిక్స్ కి సంబంధించి ఆన్ లైన్ లో పెద్ద చర్చే జరుగుతోంది. రెండో లైన్ లో జాబిలమ్మా జాకెటేసుకుని వచ్చెనండీ పదాలు మరీ కామెడీగా ఉన్నాయని, అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని కొందరు ఏకంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. రచయిత ఎవరనేది తెలియలేదు కానీ నిజానికక్కడ తప్పు బట్టడానికి ఏం లేదు. ఎందుకంటే జాబిలికి దుస్తులుంటాయని ఎక్కడా ఏ పుస్తకాల్లోనూ నిర్వచించలేదు.
అప్పుడెప్పుడో 1995 ఘరానా బుల్లోడులో చుక్కల్లో తళుకులా పాటలో జాకెట్లో జాబిల్లి అంటూ వేటూరి గారు రాయడం పట్ల ఇలాగే డిస్కషన్లు జరిగాయి. దానికాయన బదులిస్తూ ట్యూన్ కోసం అలా రాశానని, మాములుగా అయితే జాకెట్లో రెండు జాబిలులని రాసేవాడినని తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడదే తరహాలో జాబిలీ జాకెట్ వేసుకుని వచ్చెనండీ అంటూ పెట్టడం మళ్ళీ అదే తరహా హాట్ టాపిక్ కు దారి తీసింది. ఒరిజినల్ అఫీషియల్ సాంగ్ వచ్చాక దీని గురించి మరింత క్లారిటీ వస్తుంది కానీ ముందీ పని చేసిన దొంగెవరో వీలైనంత త్వరగా పట్టుకోవడం చాలా అవసరం.
This post was last modified on September 17, 2023 11:27 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…