మొన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ పాట లీక్ ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో చూశాం. నిర్మాత దిల్ రాజు ఏకంగా క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీస్ డిపార్ట్ మెంట్ కి విన్నవించారు. తమన్ సైతం ఈ వ్యవహారం పట్ల చాలా బాధ పడినట్టుగా వ్యక్తపరిచిన ఒక ఆడియో వైరలవుతోంది. నమ్మిన వాళ్లే మోసం చేశారన్నట్టుగా అందులో ఉంది. అయితే నిజంగా తన గొంతేనా కాదానేది పక్కనపెడితే ఒక గ్రాండ్ స్కేల్ లో రిలీజ్ కావాల్సిన ఇలాంటి సాంగ్ ఇంత అన్యాయంగా బయటికి రావడం అభిమానులను కలవరపరిచింది.
సరే జరిగిందేదో జరిగిపోయింది దాన్నెలాగూ మార్చలేం కాని ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక లీకైన జరగండి జరగండి పాట లిరిక్స్ కి సంబంధించి ఆన్ లైన్ లో పెద్ద చర్చే జరుగుతోంది. రెండో లైన్ లో జాబిలమ్మా జాకెటేసుకుని వచ్చెనండీ పదాలు మరీ కామెడీగా ఉన్నాయని, అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందని కొందరు ఏకంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. రచయిత ఎవరనేది తెలియలేదు కానీ నిజానికక్కడ తప్పు బట్టడానికి ఏం లేదు. ఎందుకంటే జాబిలికి దుస్తులుంటాయని ఎక్కడా ఏ పుస్తకాల్లోనూ నిర్వచించలేదు.
అప్పుడెప్పుడో 1995 ఘరానా బుల్లోడులో చుక్కల్లో తళుకులా పాటలో జాకెట్లో జాబిల్లి అంటూ వేటూరి గారు రాయడం పట్ల ఇలాగే డిస్కషన్లు జరిగాయి. దానికాయన బదులిస్తూ ట్యూన్ కోసం అలా రాశానని, మాములుగా అయితే జాకెట్లో రెండు జాబిలులని రాసేవాడినని తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడదే తరహాలో జాబిలీ జాకెట్ వేసుకుని వచ్చెనండీ అంటూ పెట్టడం మళ్ళీ అదే తరహా హాట్ టాపిక్ కు దారి తీసింది. ఒరిజినల్ అఫీషియల్ సాంగ్ వచ్చాక దీని గురించి మరింత క్లారిటీ వస్తుంది కానీ ముందీ పని చేసిన దొంగెవరో వీలైనంత త్వరగా పట్టుకోవడం చాలా అవసరం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…