Movie News

ప్రాజెక్ట్ K సీరియస్ అవ్వడం అవసరమే

ఒక ప్యాన్ ఇండియా సినిమా మీద వందల కోట్ల పెట్టుబడి పెట్టి వేలాది మంది పని చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి లీకైనా సరే ఏదో పోనీలెమ్మని వదిలేస్తే భవిష్యత్తులో మళ్ళీ రిపీటవుతూనే ఉంటాయి. ప్రాజెక్ట్ కె నిర్మాతలు అశ్వినిదత్ & కో లీకైన ఫోటో గురించి లీగల్ కేసుని ఫైల్ చేయడమే కాక దీనికి బాధ్యత వహించాల్సిన విఎఫ్ఎక్స్ కంపనీ నుంచి భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా డిమాండ్ చేయాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఫోటోకే ఇంత తీవ్రంగా స్పందించాలా అంటే ఖచ్చితంగా ఔననే చెప్పాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఇలా జరగడం కొత్త కాదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో ఉన్నప్పుడు రాజమౌళి ఎంత కఠినంగా ఉన్నా కూడా లీకులు బయటికొచ్చాయి. గేమ్ చేంజర్ పాట రాద్ధాంతం చూస్తూనే ఉన్నాం. గతంలో అత్తారింటికి దారేది రిలీజ్ కు ముందే హెచ్డి ప్రింట్ రావడం తీవ్ర కలకలం రేపింది. బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి సరిపోయింది లేకపోతే నిర్మాత పరిస్థితి ఏమయ్యేది. గుంటూరు కారం సైతం ఈ లీక్ వీడియోల బారిన పడుతోంది. కాబట్టి వేరొకరు భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉండాలంటే ప్రాజెక్ట్ కె తరహాలో గుండెపోటు వచ్చే రేంజ్ లో డ్యామేజ్ సూట్ వేసి సొమ్ములు వసూలు చేయాలి.

అలా అయితేనే సినిమాకు పని చేస్తున్న బయటి సంస్థలు, లోపలివాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ లీకుల తలనెప్పి పెరుగుతోంది. కంటెంట్ ఏదైనా క్షణాల్లో పంపుకునే వెసులుబాటు రావడంతో వీటిని కట్టడి చేసే మార్గాలు క్లిష్టమవుతున్నాయి. ఎక్కడో ఒక చోట అయితే అడ్డుకోవచ్చు. సోషల్ మీడియాతో మొదలుపెట్టి వెబ్ సైట్స్ దాకా వందలాది ఆప్షన్లున్నాయి. వీటిని కనీసం కొంతవరకు నిలవరించాలంటే సీరియస్ యాక్షన్లు అవసరమే. మోతాదు పెద్దగా ఉంటేనే ఫలితం గట్టిగా వస్తుంది. చట్టపరమైన చర్యకు ఉపక్రమించారు కాబట్టి తీర్పు కూడా అనుకూలంగా వస్తే లీకర్స్ కి గుణపాఠంలా ఉంటుంది. 

This post was last modified on September 17, 2023 9:56 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

23 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago