మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో రూపొందబోయే మెగా 157కి సంబంధించిన హీరోయిన్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టు గట్టిగానే వినిపిస్తోంది. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈ ఫాంటసీ డ్రామా స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని ఇన్ సైడ్ టాక్. దీని కన్నా ముందు ప్లాన్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టి మళ్ళీ రీ వర్క్ చేయించే పనిలో ఉన్నారట. సీనియర్ హీరోలకు జోడీని సెట్ చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న టైంలో చిరుకీ అదే సమస్య వస్తోంది. ఇప్పుడైతే అనుష్క వైపే మొగ్గు చూపుతున్నట్టు టాక్.
జంటగా చిరు అనుష్కలు సెట్ అవుతారానే డౌట్ కొందరు అభిమానుల్లో వస్తున్నా నిజానికది అవసరం లేదు. ఎందుకంటే ఫుల్ లెన్త్ చేయకపోయినా స్టాలిన్ లో ఈ ఇద్దరే ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆడిపాడారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి ఉండకపోతే ఈ కాంబో అప్పుడే వర్కౌట్ అయ్యేది కానీ గ్యాప్ వచ్చేసరికి ఫ్యాన్స్ కోరిక నెరవేరలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఘనవిజయం సాధించినా సినిమాలు చేసే విషయంలో అనుష్క తొందరపడటం లేదు. ఒకప్పటిలా దూకుడు చూపించే పరిస్థితి లేదు కాబట్టి కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మెగా 157 పాత్ర రెగ్యులర్ గా ఉండదట.
ఆ కారణంగానే సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. పైగా యువి బ్యానర్ కాబట్టి తన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రెగ్యులర్ గా గంతులేసే కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా చాల హుందాగా ఉండే దేవకన్య క్యారెక్టర్ నే వశిష్ట డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరిలో శ్రీదేవి స్ఫూర్తితోనే ఇది రాసుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. అయితే ఖచ్చితంగా అనుష్కకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇది అఫీషియల్ న్యూస్ కాదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ ఒకవేళ వాస్తవమైతే మాత్రం అరుంధతి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇందులో చూడొచ్చు.
This post was last modified on September 17, 2023 8:42 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…