రెండు దశాబ్దాలకు పైగా నిర్మాణంలో ఉంటూ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు దిల్ రాజు. ఆయన సినిమాల రేంజ్, సక్సెస్ రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాతగా గొప్ప ట్రాక్ రికార్డున్న రాజు.. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఏ హీరోతో, దర్శకుడితో సినిమా తీసినా మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది. అంతా ఆయన ప్లాన్ ప్రకారం నడుస్తుంది.
కానీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాజు మొదలుపెట్టిన గేమ్ చేంజర్ మూవీ విషయంలో మాత్రం అలా జరగట్లేదు. మధ్యలో శంకర్ ఇండియన్-2ను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి రావడంతో గేమ్ చేంజర్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. షెడ్యూళ్లు అనుకున్నట్లు జరగలేదు. సినిమా ఎంతకీ పూర్తి కావడం లేదు. అసలు రిలీజ్ ఎప్పుడుంటుందో ఎవరికీ క్లారిటీ లేదు.
వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తూ ఇంత ఆలస్యం అయితే నిర్మాత పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. ఆర్థికంగా చాలా నష్టపోతూ.. మరోవైపు సినిమా రిలీజ్ ఎప్పుడు, అప్డేట్స్ ఎక్కడ అంటూ అభిమానుల నుంచి ప్రశ్నలు, విమర్శలు ఎదుర్కొంటూ రాజు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. అది చాలదని గేమ్ చేంజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి నెగెటివ్ విషయాలతో వార్తల్లో నిలుస్తోంది.
ఈ సినిమా నుంచి పాట లీక్ కావడం చర్చనీయాంశమైంది. ఆ పాట మీద విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో గేమ్ చేంజర్ టీం పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఇప్పటికే ఉన్న నెగెటివిటీ చాలదని.. కొత్తగా ఈ లీక్డ్ సాంగ్ మీద ట్రోలింగ్ నడుస్తుండటంతో దిల్ రాజుకు ఒళ్లు మండినట్లుంది. అందుకే లీక్ వీరులపై కేసు పెట్టే వరకు వెళ్లారు. మొత్తంగా క్రేజీ కాంబినేషన్లో మొదలైన సినిమాతో రాజు ఇంత ఇబ్బంది పడతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…