ఏదో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తోందని ఇష్టం వచ్చినట్టు పాత సినిమాలన్నీ రిలీజ్ చేసుకుంటూ పోతే దెబ్బ తినక తప్పదని పలుమార్లు ఋజువైనా సరే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ధోరణిలో మార్పు రావడం లేదు. లాటరీ తగలొచ్చనే రీతిలో సరైన ప్లానింగ్ లేకుండా డేట్ ఖాళీగా ఉందని హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుని జనం మీదకు వదిలేస్తున్నారు. నిన్న విజయ్ ఆంటోనీ బ్లాక్ బస్టర్ బిచ్చగాడుని తెలుగు రాష్ట్రాల్లో రీ పునః విడుదల చేశారు. చెప్పుకోదగ్గ స్క్రీన్ కౌంట్ తో సరిపడా షోలే వేశారు. ట్రాజెడీ ఏంటంటే ఎక్కడా బిచ్చగాడుకి కనీస స్థాయిలో స్పందన దక్కలేదు. ఆఖరికి స్పెషల్ షోలకు సైతం.
చాలా చోట్ల జనం లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి తలెత్తింది. బిచ్చగాడు బ్లాక్ బస్టరే. అందులో సందేహం లేదు. రిలీజైన టైంలో పాతిక కోట్లకు పైగా రాబట్టి వామ్మో అనిపించింది. కానీ ఇందులో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునే మెటీరియల్ ఉండదు. సూర్య సన్ అఫ్ కృష్ణన్, రఘువరన్ బిటెక్ లాగ ఈలలు, కేకలు వేసే పాటలు ఉండవు. ఎలివేషన్ సీన్లు, డైలాగులున్నాయి కానీ అవన్నీ తల్లి సెంటిమెంట్ కి సంబంధించినవే. అలాంటప్పుడు అదే పనిగా బిచ్చగాడు కోసం థియేటర్ రావడం జరగని పని. పైగా విజయ్ ఆంటోనీ మార్కెట్ బాగా తగ్గిపోయి సంవత్సరాలవుతోంది.
వచ్చే నెల విడుదల కాబోతున్న కొత్త సినిమా రత్తం మీద కనీస బజ్ లేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రీ రిలీజ్ విషయంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హీరోకి స్టార్ ఇమేజ్ లేదా కంటెంట్ కి కల్ట్ స్టేటస్ ఉంటే తప్ప ట్రై చేయకూడదు. యూట్యూబ్, శాటిలైట్, ఓటిటిలో ఫ్రీగా దొరికే వాటిని నూటా యాభై రూపాయలు పెట్టి మళ్ళీ టికెట్ కొనేలా చేయాలంటే అది గతంలో హిట్ అయితే సరిపోదు. చాలా విషయాలు చెక్ చేసుకోవాలి. 22 రాబోయే 7జి బృందావన్ కాలనీకి కుర్రాళ్ళు ఎగబడతారు. ఎందుకంటే యూత్ ఎలిమెంట్స్, పాటలు ఆ స్థాయిలో ఉంటాయి కాబట్టి. ఏదైతేనేం మొత్తానికి బిచ్చగాడు పరువు తీసేశారు.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…