నిన్న దుబాయ్ లో దక్షిణాది పరిశ్రమ నుంచి తరలి వచ్చిన తారా తోరణంతో సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ బాషల నుంచి వచ్చిన స్టార్లందరూ ఒకే చోట గుమికూడటంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికవుతారనే సస్పెన్స్ కు తెరదించుతూ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రకటించడంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ విభాగంలో రామ్ చరణ్ తో పాటు ఇతరుల నుంచి పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ కొమరం భీంగా తారక్ చూపించిన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ అందరినీ డామినేట్ చేసిందన్న విషయం అర్థమైపోయింది.
ఈవెంట్ కి చరణ్ హాజరు కాలేదు. విదేశీ ట్రిప్ తో పాటు షూటింగ్ కారణంగా రాలేనని ముందే చెప్పాడట. ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే బెస్ట్ యాక్టర్ ని సమంగా ఇచ్చేవాళ్ళో లేక తారక్ కే కట్టుబడే వారోనని సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల అభిమానులు చర్చించుకుంటున్నారు. వీటి సంగతెలా ఉన్నా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేని ఎమోషనల్ పాత్రను జూనియర్ రేంజ్ హీరో పోషించి మెప్పించడమంటే చిన్న విషయం కాదు. పలు ఇంటర్వ్యూలలో రాజమౌళి సమక్షంలోనే తామెంత కష్టపడిందో పంచుకున్న సంగతులు అంత సులభంగా మర్చిపోయేవి కాదు.
వేడుక లైవ్ లేకపోయినా ట్విట్టర్ వేదికగా నిర్వాహకులు ఫోటోలతో పాటు విజేతల వివరాలు ప్రకటించడంతో అప్డేట్ పరంగా లోటు రాలేదు. టాలీవుడ్ ప్రముఖులు చాలానే విచ్చేశారు. నిర్మాతలు, దర్శకులు ఆహ్వానితుల లిస్టు పెద్దదే ఉంది. అల్లు అరవింద్, అశ్వినిదత్, శ్రీలీల, బెల్లంకొండ గణేష్, సుధీర్ బాబు, సుశాంత్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, నిఖిల్, మంచు లక్ష్మి, చందూ మొండేటి, అనన్య నాగళ్ళ, ఛాయ్ బిస్కెట్ శరత్ – అనురాగ్, డివివి దానయ్య, చంద్రబోస్, రామ్ మిర్యాల తదితరులు ఉన్నారు. త్వరలోనే శాటిలైట్ టెలికాస్ట్ కూడా చేయబోతున్నారు.
This post was last modified on September 16, 2023 10:41 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…