నిన్న దుబాయ్ లో దక్షిణాది పరిశ్రమ నుంచి తరలి వచ్చిన తారా తోరణంతో సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ బాషల నుంచి వచ్చిన స్టార్లందరూ ఒకే చోట గుమికూడటంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికవుతారనే సస్పెన్స్ కు తెరదించుతూ జూనియర్ ఎన్టీఆర్ ని ప్రకటించడంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ విభాగంలో రామ్ చరణ్ తో పాటు ఇతరుల నుంచి పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ కొమరం భీంగా తారక్ చూపించిన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ అందరినీ డామినేట్ చేసిందన్న విషయం అర్థమైపోయింది.
ఈవెంట్ కి చరణ్ హాజరు కాలేదు. విదేశీ ట్రిప్ తో పాటు షూటింగ్ కారణంగా రాలేనని ముందే చెప్పాడట. ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే బెస్ట్ యాక్టర్ ని సమంగా ఇచ్చేవాళ్ళో లేక తారక్ కే కట్టుబడే వారోనని సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల అభిమానులు చర్చించుకుంటున్నారు. వీటి సంగతెలా ఉన్నా ఎలాంటి కమర్షియల్ అంశాలు లేని ఎమోషనల్ పాత్రను జూనియర్ రేంజ్ హీరో పోషించి మెప్పించడమంటే చిన్న విషయం కాదు. పలు ఇంటర్వ్యూలలో రాజమౌళి సమక్షంలోనే తామెంత కష్టపడిందో పంచుకున్న సంగతులు అంత సులభంగా మర్చిపోయేవి కాదు.
వేడుక లైవ్ లేకపోయినా ట్విట్టర్ వేదికగా నిర్వాహకులు ఫోటోలతో పాటు విజేతల వివరాలు ప్రకటించడంతో అప్డేట్ పరంగా లోటు రాలేదు. టాలీవుడ్ ప్రముఖులు చాలానే విచ్చేశారు. నిర్మాతలు, దర్శకులు ఆహ్వానితుల లిస్టు పెద్దదే ఉంది. అల్లు అరవింద్, అశ్వినిదత్, శ్రీలీల, బెల్లంకొండ గణేష్, సుధీర్ బాబు, సుశాంత్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, నిఖిల్, మంచు లక్ష్మి, చందూ మొండేటి, అనన్య నాగళ్ళ, ఛాయ్ బిస్కెట్ శరత్ – అనురాగ్, డివివి దానయ్య, చంద్రబోస్, రామ్ మిర్యాల తదితరులు ఉన్నారు. త్వరలోనే శాటిలైట్ టెలికాస్ట్ కూడా చేయబోతున్నారు.
This post was last modified on September 16, 2023 10:41 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…