Movie News

అప్పుడు పవన్.. ఇప్పుడు చిరు.. భలే కలిసొచ్చిందే

ఆగస్టు, సెప్టెంబరు నెలలు మెగా అభిమానులకు చాలా ప్రత్యేకం. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల పుట్టిన రోజులు ఈ నెలల్లోనే వస్తాయి. అది కూడా పది రోజుల వ్యవధిలోనే కావడం విశేషం. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు కాగా.. సెప్టెంబరు 2న పవన్ బర్త్ డే. ఈ రెండు రోజుల్లో మెగా అభిమానుల సందడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మామూలుగానే ఇవి పండుగ రోజులు అంటే.. వీటికి మరో పెద్ద పండుగ తోడైతే ఎలా ఉంటుంది? శనివారం చిరు పుట్టిన రోజు నాడే.. తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగల్లో ఒకటైన వినాయక చవితి వచ్చింది.

కరోనా వల్ల బయట సంబరాలు మరీ ఘనంగా ఏమీ లేవు కానీ.. ఎవరి ఇళ్లల్లో వాళ్లు వేడుకలు ఘనంగానే చేసుకుంటున్నారు. సోషల్ మీడియా సందడి గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఓవైపు వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. మరోవైపు చిరుకు విషెస్ అందిస్తున్నారు.

ఇక వినాయక చవితి రోజు చిరు చాలా ఏళ్లుగా పాట ఒకటి ప్లే కాకుండా ఎప్పుడూ గడవదు. ‘జై చిరంజీవ’లోని జై జై గణేషా పాట ఎక్కడ చూసినా మార్మోగిపోతుంటుంది. ఈ రోజు చిరు పుట్టిన రోజు, వినాయక చవితి కలిసి రావడంతో సోషల్ మీడియాలో ఈ పాట హోరెత్తిపోతోంది. ఇంకో విశేషం ఏంటంటే.. గత ఏడాది వినాయక చవితి సెప్టెంబరు 2న వచ్చింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఇలా యాదృచ్ఛికంగా వరుగా రెండేళ్లు మెగా బ్రదర్స్ పుట్టిన రోజు నాడే వినాయక చవితి రావడం విశేషమే.

ఈ సంగతి తెలిసి మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ముచ్చటించుకుంటున్నారు. ఇక చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలతో పాటు వినాయక చవితి సంబరాలు ఘనంగానే చేసుకున్నారు. ఆయన తనయుడు రామ్ చరణ్ తల్లిదండ్రులతో కలిసి దేవుడిని ప్రార్థిస్తున్న ఫొటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేశాడు.

This post was last modified on August 22, 2020 8:53 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

53 minutes ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

1 hour ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

1 hour ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

4 hours ago