Movie News

రూపాయి తీసుకోకుండా నటించిన దీపికా

పది రోజులు దాటాక ముందే ఏడు వందల కోట్లకు దగ్గరగా వెళ్తున్న షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఇప్పుడు కాస్త నెమ్మదించినా మళ్ళీ ఈ వీకెండ్ సత్తా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో దీపికా పదుకునే ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఎమోషన్ టచ్ ఎక్కువగా ఉండే ఆ క్యారెక్టర్ కి దర్శకుడు అట్లీ ఇచ్చిన ఫినిషింగ్ చాలా టచింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను దీపికా పదుకునేకు రెగ్యులర్ ఇచ్చే భారీ పారితోషికమే ముట్టజెప్పారనే వార్త ముంబై మీడియా వర్గాల్లో గట్టిగా తిరిగింది.

అయితే అవన్నీ నిరాధారమంటూ దీపికా కొట్టిపారేసింది. జవాన్ కోసం తాను ఒక్క రూపాయి తీసుకోకుండా చేశానని, ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటం వల్ల ఇంకేమి ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. తీసింది షారుఖ్ ఖాన్ స్వంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్. కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చిన ఓం శాంతి ఓం నుంచి దీపికాతో షారుఖ్ కి మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఆ కారణంగానే ఫ్రీగా చేసి ఉండొచ్చు. డబ్బు రూపంలో తీసుకోకపోయినా ఏదో ఒక రూపేణా కింగ్ ఖాన్ ఇవ్వకుండా అయితే ఉండడు. అందులోనూ ఇంత భారీ బ్లాక్ల్ బస్టర్ అయ్యాక పోనిలే అని వదిలే సమస్యే లేదు.

ఇది దీపికా పదుకునే ఔదార్యమంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దీని సంగతి సరేకాని ప్రభాస్ తో చేస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్  కె గురించి అడిగితే మాత్రం అమ్మడు మౌనాన్ని ఆశ్రయిస్తోంది. సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతానని, ఇప్పుడు ఏవేవో చెప్పేసి అభిమానుల్లో ఉన్న ఎగ్జైట్ మెంట్ తగ్గించలేనని కుండ బద్దలు కొట్టింది. టాలీవుడ్ ఎంట్రీ పట్ల మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. జవాన్ లాగే గతంలో 83, సర్కస్ లో ఇష్టపడి నటించిన దీపికా వాటికీ డబ్బులు తీసుకోలేదు. అవి భర్త రణ్వీర్ సింగ్ నటించినవి. కానీ షారుఖ్ కోసం చేయడమంటే విశేషమేగా.

This post was last modified on September 15, 2023 5:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్టీఆర్ నీల్ మూవీకి ‘దేవ’ పెన్ను బలం?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…

1 hour ago

మూర్తిగారు చెప్పినవి అక్షరాలా నిజాలు

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…

3 hours ago

ఆ ఇద్దరు సీఎంలకు మరో ఛాన్స్ ఉన్నట్టే!

దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…

3 hours ago

విజయ్ మాత్రమే కాదు.. డ్రైవర్ కొడుకు కూడా

నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…

3 hours ago

విజ‌య్‌కు క‌లిసి వ‌చ్చిందేంటి?

త‌మిళ‌నాట ఎవ‌రి అంచ‌నాకు అంద‌ని విదంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న అధికారంలోకి…

4 hours ago

ఎన్టీఆర్, ఎంజీఆర్.. మధ్యలో విజయ్

దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ముందుంటాయి.…

6 hours ago