Movie News

కళ్యాణ్ రామ్ ఎలా సైలెంట్‌గా ఉన్నాడు?

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘డెవిల్’ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్ననే ఈ సినిమా నుంచి రాబోతున్న కొత్త పాట గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా గురించి చర్చ జరగడానికి కారణం ఆ పాట కాదు. ఆ పాట గురించి వెల్లడిస్తూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్. ఆ పోస్టర్ మీద దర్శకుడిగా అభిషేక్ నామా పేరు ఉండటం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ సినిమా మొదలైనపుడేమో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది.

కానీ టీజర్ లాంచ్ అయినపుడు డైరెక్టెడ్ బై ‘అభిషేక్ నామా పిక్చర్స్ టీం’ అని వేశారు. కానీ ఇప్పుడేమో అభిషేక్ నామానే దర్శకుడైపోయాడు. ఇప్పటిదాాకా రైటింగ్, డైరెక్షన్‌లో ఎలాంటి అనుభవం లేని నిర్మాత.. ఉన్నట్లుండి ఎలా దర్శకుడు అయిపోయాడో జనాలకు అర్థం కావడం లేదు. దర్శకుడితో నిర్మాతకు విభేదాలు తలెత్తితే.. అతణ్ని తప్పించి మరొకరిని పెట్టిన ఉదంతాలు లేకపోలేదు. కానీ ఇలా నిర్మాతే దర్శకుడు అయిపోవడం అరుదైన విషయం.

ఐతే నవీన్‌తో అభిషేక్ వ్యవహరించిన తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేదో చిన్నా చితకా సినిమా అయితే ఓకే కానీ.. పెద్ద బడ్జెట్లో, కళ్యాణ్ రామ్ లాంటి పేరున్న హీరో చేసిన సినిమా కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. దర్శకుడికి, నిర్మాతకు మధ్య గొడవేంటో ఏమో కానీ.. తన సినిమా ఇలా నెగెటివ్ న్యూస్‌లతో వార్తల్లో నిలుస్తుంటే కళ్యాణ్ రామ్ ఏం చేస్తున్నాడన్నది ప్రశ్న. ‘డెవిల్’ సినిమాకు సంబంధించి నవీన్ కంట్రిబ్యూషన్ ఏంటో ఈ నందమూరి హీరోకు తెలిసే ఉంటుంది.

ఇలా దర్శకుడి పట్ల అవమానకరంగా వ్యవహరించి.. నిర్మాత దర్శకుడిగా తన పేరే వేసుకుంటుంటే కళ్యాణ్ రామ్ ఎలా అనుమతించాడన్న సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా అభిషేకే ఈ సినిమాకు కర్త, క్రియ అయితే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ వేరొకరి క్రెడిట్‌ను తాను తీసుకుంటుంటే మాత్రం కళ్యాణ్ రామ్ ప్రశ్నించాల్సిందే. ఈ విషయంలో వివాదానికి తెరదించడమే కాక.. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కళ్యాణ్ రామ్ మీద ఉందనడంలో సందేహం లేదు.

This post was last modified on September 15, 2023 12:08 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

58 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago