సరిగ్గా ఇంకో రెండే వారాల్లో స్కంద విడుదల. మూడు పాటలు, ట్రైలర్ రిలీజ్ తర్వాత యూనిట్ హఠాత్తుగా సైలెంటయిపోయింది. ముంబైలో రామ్ పూరి జగన్నాధ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొన్ని సంజయ్ దత్ కాంబినేషన్ సీన్లకు అక్కడ అనుకూల వాతావరణం ఉండటంతో ఆ ఎపిసోడ్లు చకచకా పూర్తవుతున్నాయి. అయితే స్కంద విషయంలో జరుగుతున్న అలసత్వం అతని దృష్టిలో వస్తున్నట్టు లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హీరో అందుబాటులో లేడు సరే దర్శకుడితో సహా టీమ్ మొత్తం దాదాపుగా హైదరాబాద్ లోనే ఉందిగా. ఎందుకు మౌనంగా ఉన్నట్టు.
ఎంత బోయపాటి రామ్ ల బ్రాండ్ ఉన్నా సరే స్కంద విషయంలో కాసింత నెగటివ్ వైబ్స్ బలంగా ఉన్నాయి. షూట్ జరిగినంత కాలం, ఫస్ట్ లుక్ వచ్చిన టైంలో ఏదైతే హైప్ ఉండేదో అది అమాంతం తగ్గిపోయింది. బోయపాటి శీను పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉన్నాడనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. కొత్తగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. బాలకృష్ణ అతిథిగా ప్రీ రిలీజ్ జరిగిన విషయాన్ని జనం మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళది ఫ్రెష్ మెమరీ. మళ్ళీ స్కందని రిజిస్టర్ చేయాలి. ట్రైలర్ విషయంలో వచ్చిన కామెంట్లకు బదులు చెప్పాలి.
ఇంకా టైం ఉంది కదాని నిర్లిప్తంగా ఉంటే లాభం లేదు. రామ్ సెప్టెంబర్ 20లోపే వస్తాడు. అప్పటికప్పుడు హడావిడిగా మీడియా ఇంటర్వ్యూలు వగైరాలు ప్లాన్ చేయొచ్చు. అదొక్కటే సరిపోదుగా. కనీసం ట్విట్టర్ లోనో ఇన్స్ టాలోనో ఏదో ఒక సౌండ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చంద్రముఖి 2, పెదకాపు 1లు బడ్జెట్, రేంజ్ విషయంలో స్కందతో సమానం కాకపోవచ్చు. అలా అని మరీ తక్కువంచనా వేసినా ప్రమాదమే. అసలు మాస్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో స్కందను రామ్ వచ్చే దాకా కదలిక లేకుండా ఉంచడం సరికాదు.
This post was last modified on September 14, 2023 6:15 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…