సరిగ్గా ఇంకో రెండే వారాల్లో స్కంద విడుదల. మూడు పాటలు, ట్రైలర్ రిలీజ్ తర్వాత యూనిట్ హఠాత్తుగా సైలెంటయిపోయింది. ముంబైలో రామ్ పూరి జగన్నాధ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొన్ని సంజయ్ దత్ కాంబినేషన్ సీన్లకు అక్కడ అనుకూల వాతావరణం ఉండటంతో ఆ ఎపిసోడ్లు చకచకా పూర్తవుతున్నాయి. అయితే స్కంద విషయంలో జరుగుతున్న అలసత్వం అతని దృష్టిలో వస్తున్నట్టు లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హీరో అందుబాటులో లేడు సరే దర్శకుడితో సహా టీమ్ మొత్తం దాదాపుగా హైదరాబాద్ లోనే ఉందిగా. ఎందుకు మౌనంగా ఉన్నట్టు.
ఎంత బోయపాటి రామ్ ల బ్రాండ్ ఉన్నా సరే స్కంద విషయంలో కాసింత నెగటివ్ వైబ్స్ బలంగా ఉన్నాయి. షూట్ జరిగినంత కాలం, ఫస్ట్ లుక్ వచ్చిన టైంలో ఏదైతే హైప్ ఉండేదో అది అమాంతం తగ్గిపోయింది. బోయపాటి శీను పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉన్నాడనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. కొత్తగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. బాలకృష్ణ అతిథిగా ప్రీ రిలీజ్ జరిగిన విషయాన్ని జనం మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళది ఫ్రెష్ మెమరీ. మళ్ళీ స్కందని రిజిస్టర్ చేయాలి. ట్రైలర్ విషయంలో వచ్చిన కామెంట్లకు బదులు చెప్పాలి.
ఇంకా టైం ఉంది కదాని నిర్లిప్తంగా ఉంటే లాభం లేదు. రామ్ సెప్టెంబర్ 20లోపే వస్తాడు. అప్పటికప్పుడు హడావిడిగా మీడియా ఇంటర్వ్యూలు వగైరాలు ప్లాన్ చేయొచ్చు. అదొక్కటే సరిపోదుగా. కనీసం ట్విట్టర్ లోనో ఇన్స్ టాలోనో ఏదో ఒక సౌండ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చంద్రముఖి 2, పెదకాపు 1లు బడ్జెట్, రేంజ్ విషయంలో స్కందతో సమానం కాకపోవచ్చు. అలా అని మరీ తక్కువంచనా వేసినా ప్రమాదమే. అసలు మాస్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో స్కందను రామ్ వచ్చే దాకా కదలిక లేకుండా ఉంచడం సరికాదు.
This post was last modified on September 14, 2023 6:15 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…