సరిగ్గా ఇంకో రెండే వారాల్లో స్కంద విడుదల. మూడు పాటలు, ట్రైలర్ రిలీజ్ తర్వాత యూనిట్ హఠాత్తుగా సైలెంటయిపోయింది. ముంబైలో రామ్ పూరి జగన్నాధ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొన్ని సంజయ్ దత్ కాంబినేషన్ సీన్లకు అక్కడ అనుకూల వాతావరణం ఉండటంతో ఆ ఎపిసోడ్లు చకచకా పూర్తవుతున్నాయి. అయితే స్కంద విషయంలో జరుగుతున్న అలసత్వం అతని దృష్టిలో వస్తున్నట్టు లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హీరో అందుబాటులో లేడు సరే దర్శకుడితో సహా టీమ్ మొత్తం దాదాపుగా హైదరాబాద్ లోనే ఉందిగా. ఎందుకు మౌనంగా ఉన్నట్టు.
ఎంత బోయపాటి రామ్ ల బ్రాండ్ ఉన్నా సరే స్కంద విషయంలో కాసింత నెగటివ్ వైబ్స్ బలంగా ఉన్నాయి. షూట్ జరిగినంత కాలం, ఫస్ట్ లుక్ వచ్చిన టైంలో ఏదైతే హైప్ ఉండేదో అది అమాంతం తగ్గిపోయింది. బోయపాటి శీను పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉన్నాడనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. కొత్తగా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. బాలకృష్ణ అతిథిగా ప్రీ రిలీజ్ జరిగిన విషయాన్ని జనం మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళది ఫ్రెష్ మెమరీ. మళ్ళీ స్కందని రిజిస్టర్ చేయాలి. ట్రైలర్ విషయంలో వచ్చిన కామెంట్లకు బదులు చెప్పాలి.
ఇంకా టైం ఉంది కదాని నిర్లిప్తంగా ఉంటే లాభం లేదు. రామ్ సెప్టెంబర్ 20లోపే వస్తాడు. అప్పటికప్పుడు హడావిడిగా మీడియా ఇంటర్వ్యూలు వగైరాలు ప్లాన్ చేయొచ్చు. అదొక్కటే సరిపోదుగా. కనీసం ట్విట్టర్ లోనో ఇన్స్ టాలోనో ఏదో ఒక సౌండ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చంద్రముఖి 2, పెదకాపు 1లు బడ్జెట్, రేంజ్ విషయంలో స్కందతో సమానం కాకపోవచ్చు. అలా అని మరీ తక్కువంచనా వేసినా ప్రమాదమే. అసలు మాస్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో స్కందను రామ్ వచ్చే దాకా కదలిక లేకుండా ఉంచడం సరికాదు.
This post was last modified on September 14, 2023 6:15 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…