అశోక్ సెల్వన్.. తమిళంలో మంచి పేరు సంపాదించిన యంగ్ హీరో. అతను అందగాడే కాదు.. మంచి నటుడు కూడా. మరక్కార్, పొన్నియన్ సెల్వన్, నిన్నిలా నిన్నిలా లాంటి అనువాద చిత్రాలతో అతను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. విశ్వక్సేన్ సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో అతను క్యామియో రోల్ కూడా చేశాడు. ఇక తమిళంలో అయితే ‘ఓ మై కడవులే’, ‘పోర్ తొలిల్’ లాంటి మంచి మంచి హిట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ యంగ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు.
అతను ఒక సినిమా అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన పేరు.. కీర్తి పాండ్యన్. 90వ దశకంలో తమిళ అనువాద చిత్రాలతో పరిచయం ఉన్న వాళ్లకు ఈ పేరు బాగానే తెలిసి ఉంటుంది. కీర్తి.. సీనియర్ నటుడు అరుణ్ పాండ్యన్ తనయురాలు కావడం విశేషం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కీర్తి పాండ్యన్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. కథానాయికగా కొన్ని సినిమాలు చేసింది. మలయాళ హిట్ ‘హెలెన్’ రీమేక్లో లీడ్ రోల్ చేసి మెప్పించింది. అశోక్, కీర్తి కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి ‘బ్లూ స్టార్’ అనే సినిమాలో నటించారు. అప్పుడు మొదలైన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది.
కొన్ని నెలల ముందే అశోక్, కీర్తిల పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. ఆ వార్తల్నే నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సినిమా వాళ్ల పెళ్లి అంటే బాగా హడావుడి ఉంటుంది కానీ.. వీళ్లిద్దరూ మాత్రం ఒక గుడిలో సింపుల్గా పెళ్ల చేసేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు కొందరు బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. మీడియాకు కూడా వీరి వివాహం గురించి ముందు సమాచారం లేదు. సైలెంట్గా పెళ్లాడేసి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చారు అశోక్, కీర్తి. అశోక్ ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నాడు.
This post was last modified on September 13, 2023 4:21 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…