ఈపాటికి ‘సలార్’ హైప్తో ఊగిపోతుండాలి ప్రభాస్ అభిమానులు. ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. కానీ సెప్టెంబరు 28న రిలీజ్ అంటూ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించింది చిత్ర బృందం. రిలీజ్ మంత్లోకి అడుగు పెట్టామని అభిమానులు సంబరాలకు సిద్ధమైన స్థితిలో ఈ సినిమా వాయిదా వార్తలు వారికి పెద్ద షాకే ఇచ్చాయి. ముందు ఇది రూమర్ అనుకున్నారు కానీ.. ఒక్క రోజు వ్యవధిలో జరిగిన పరిణామాలతో వాయిదా అనివార్యం అని అర్థమైపోయింది.
ఐతే యుఎస్లో ప్రిమియర్స్ బుకింగ్స్ ఆపేయడం.. సెప్టెంబరు 28కి వేరే సినిమాలు షెడ్యూల్ కావడం.. ఇలా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ‘సలార్’ టీం నుంచి మాత్రం సౌండ్ లేదు. కనీసం వాయిదా గురించి వెంటనే అధికారిక ప్రకటన చేసి, వాయిదాకు కారణాలు చెప్పి అభిమానులను శాంతపరిచే ప్రయత్నం కూడా చేయలేదు చిత్ర బృందం.
వాయిదా విషయం ఎప్పుడో తేలిపోయాక ఇప్పుడొచ్చి సెప్టెంబరు 28ను తమ చిత్రం రాలేదని అనౌన్స్మెంట్ ఇవ్వడం పుండు మీద కారం చల్లినట్లే అనిపిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్కు. వాయిదా గురించి అధికారిక ప్రకటన చేయలేదు అంటే.. కొత్త రిలీజ్ డేట్ మీద కసరత్తు చేస్తున్నారని, ఒకేసారి ఆ ప్రకటనతో తమకు ఉపశమనాన్ని ఇస్తారని ప్రభాస్ అభిమానులు అంచనా వేశారు. కానీ రిలీజ్ కబురే చెప్పకుండా వాయిదా గురించి మొక్కుబడి ప్రకటన చేయడం అవసరమా అంటూ మండిపోతున్నారు.
ఇప్పటికే ఉన్న ఫ్రస్టేషన్ చాలదని.. ఈ ప్రకటనతో అది డబుల్ అవుతోంది. వాయిదా వార్తలు వచ్చినపుడు ప్రశాంత్ నీల్ అండ్ కో మీద కొంతమేరే కోపం చూపించారు. కానీ ఇప్పుడు వారి ఆక్రోశం మరింతగా కనిపిస్తోంది. ప్రశాంత్ను, హోంబలె ఫిలిమ్స్ అధినేతలను ప్రభాస్ అభిమానులే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ మొక్కుబడి ప్రకటన చేయడం కంటే ‘సలార్’ టైం సైలెంట్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 13, 2023 4:19 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…