ఈపాటికి ‘సలార్’ హైప్తో ఊగిపోతుండాలి ప్రభాస్ అభిమానులు. ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. కానీ సెప్టెంబరు 28న రిలీజ్ అంటూ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించింది చిత్ర బృందం. రిలీజ్ మంత్లోకి అడుగు పెట్టామని అభిమానులు సంబరాలకు సిద్ధమైన స్థితిలో ఈ సినిమా వాయిదా వార్తలు వారికి పెద్ద షాకే ఇచ్చాయి. ముందు ఇది రూమర్ అనుకున్నారు కానీ.. ఒక్క రోజు వ్యవధిలో జరిగిన పరిణామాలతో వాయిదా అనివార్యం అని అర్థమైపోయింది.
ఐతే యుఎస్లో ప్రిమియర్స్ బుకింగ్స్ ఆపేయడం.. సెప్టెంబరు 28కి వేరే సినిమాలు షెడ్యూల్ కావడం.. ఇలా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ‘సలార్’ టీం నుంచి మాత్రం సౌండ్ లేదు. కనీసం వాయిదా గురించి వెంటనే అధికారిక ప్రకటన చేసి, వాయిదాకు కారణాలు చెప్పి అభిమానులను శాంతపరిచే ప్రయత్నం కూడా చేయలేదు చిత్ర బృందం.
వాయిదా విషయం ఎప్పుడో తేలిపోయాక ఇప్పుడొచ్చి సెప్టెంబరు 28ను తమ చిత్రం రాలేదని అనౌన్స్మెంట్ ఇవ్వడం పుండు మీద కారం చల్లినట్లే అనిపిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్కు. వాయిదా గురించి అధికారిక ప్రకటన చేయలేదు అంటే.. కొత్త రిలీజ్ డేట్ మీద కసరత్తు చేస్తున్నారని, ఒకేసారి ఆ ప్రకటనతో తమకు ఉపశమనాన్ని ఇస్తారని ప్రభాస్ అభిమానులు అంచనా వేశారు. కానీ రిలీజ్ కబురే చెప్పకుండా వాయిదా గురించి మొక్కుబడి ప్రకటన చేయడం అవసరమా అంటూ మండిపోతున్నారు.
ఇప్పటికే ఉన్న ఫ్రస్టేషన్ చాలదని.. ఈ ప్రకటనతో అది డబుల్ అవుతోంది. వాయిదా వార్తలు వచ్చినపుడు ప్రశాంత్ నీల్ అండ్ కో మీద కొంతమేరే కోపం చూపించారు. కానీ ఇప్పుడు వారి ఆక్రోశం మరింతగా కనిపిస్తోంది. ప్రశాంత్ను, హోంబలె ఫిలిమ్స్ అధినేతలను ప్రభాస్ అభిమానులే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ మొక్కుబడి ప్రకటన చేయడం కంటే ‘సలార్’ టైం సైలెంట్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 13, 2023 4:19 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…