ఈపాటికి ‘సలార్’ హైప్తో ఊగిపోతుండాలి ప్రభాస్ అభిమానులు. ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. కానీ సెప్టెంబరు 28న రిలీజ్ అంటూ ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించింది చిత్ర బృందం. రిలీజ్ మంత్లోకి అడుగు పెట్టామని అభిమానులు సంబరాలకు సిద్ధమైన స్థితిలో ఈ సినిమా వాయిదా వార్తలు వారికి పెద్ద షాకే ఇచ్చాయి. ముందు ఇది రూమర్ అనుకున్నారు కానీ.. ఒక్క రోజు వ్యవధిలో జరిగిన పరిణామాలతో వాయిదా అనివార్యం అని అర్థమైపోయింది.
ఐతే యుఎస్లో ప్రిమియర్స్ బుకింగ్స్ ఆపేయడం.. సెప్టెంబరు 28కి వేరే సినిమాలు షెడ్యూల్ కావడం.. ఇలా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ‘సలార్’ టీం నుంచి మాత్రం సౌండ్ లేదు. కనీసం వాయిదా గురించి వెంటనే అధికారిక ప్రకటన చేసి, వాయిదాకు కారణాలు చెప్పి అభిమానులను శాంతపరిచే ప్రయత్నం కూడా చేయలేదు చిత్ర బృందం.
వాయిదా విషయం ఎప్పుడో తేలిపోయాక ఇప్పుడొచ్చి సెప్టెంబరు 28ను తమ చిత్రం రాలేదని అనౌన్స్మెంట్ ఇవ్వడం పుండు మీద కారం చల్లినట్లే అనిపిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్కు. వాయిదా గురించి అధికారిక ప్రకటన చేయలేదు అంటే.. కొత్త రిలీజ్ డేట్ మీద కసరత్తు చేస్తున్నారని, ఒకేసారి ఆ ప్రకటనతో తమకు ఉపశమనాన్ని ఇస్తారని ప్రభాస్ అభిమానులు అంచనా వేశారు. కానీ రిలీజ్ కబురే చెప్పకుండా వాయిదా గురించి మొక్కుబడి ప్రకటన చేయడం అవసరమా అంటూ మండిపోతున్నారు.
ఇప్పటికే ఉన్న ఫ్రస్టేషన్ చాలదని.. ఈ ప్రకటనతో అది డబుల్ అవుతోంది. వాయిదా వార్తలు వచ్చినపుడు ప్రశాంత్ నీల్ అండ్ కో మీద కొంతమేరే కోపం చూపించారు. కానీ ఇప్పుడు వారి ఆక్రోశం మరింతగా కనిపిస్తోంది. ప్రశాంత్ను, హోంబలె ఫిలిమ్స్ అధినేతలను ప్రభాస్ అభిమానులే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ మొక్కుబడి ప్రకటన చేయడం కంటే ‘సలార్’ టైం సైలెంట్గా ఉండాల్సిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 13, 2023 4:19 pm
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…