Movie News

దర్శకుడి మీద కోపం తగ్గలేదన్న విశాల్

హీరో దర్శకుల మధ్య విభేదాలు రావడం సహజమే కానీ అవి మరీ మితిమీరిపోయి మీడియాకు ఎక్కేంత స్థాయిలో ఉండవు. అనవసరంగా పేరు పోతుందని ఎవరికి వారు గుంభనంగా ఉంటారు. కానీ విశాల్ కు మాత్రం అలా సాధ్యపడలేదు. తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) దర్శకుడు మిస్కిన్ తో తనకు తీవ్ర అభిప్రాయ బేధాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ సందర్భంగా విశాల్ మీద మిస్కిన్  తీవ్రంగా నోరు పారేసుకోవడంతో వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఏకంగా ఆ ప్రాజెక్ట్ రెండేళ్లు పెండింగ్ లో పెట్టేసి కొంత భాగం షూట్ అయ్యాక ఆపేశారు.

మార్క్ ఆంటోనీ ప్రమోషన్లలో భాగంగా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు విశాల్ మరింత క్లారిటీ ఇచ్చాడు. మిస్కిన్ వల్ల లండన్ ప్లాట్ ఫార్మ్ మీద ఒక్కడినే నరకం చూడాల్సి వచ్చిందని, అలాంటి వ్యక్తితో మళ్ళీ పని చేసే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పాడు. డిటెక్టివ్ 2 ఎంత ఆలస్యమైనా తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తాను తప్పించి ఇంకెవరికీ అప్పగించే ప్రసక్తే లేదని ఘాటుగా బదులిచ్చాడు. 2017లో వచ్చిన ఆ క్రైమ్ థ్రిల్లర్ తమిళ తెలుగులో మంచి విజయం సాధించింది. అప్పటినుంచే దానికి కొనసాగింపు ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమయింది కానీ బాగా లేట్ చేశారు.

ఇంటెన్స్ టేకింగ్ తో క్రైమ్ ని బాగా చూపిస్తాడని పేరున్న మిస్కిన్ ఈ మధ్య నటుడిగానే బిజీ అవుతున్నారు. శివ కార్తికేయన్ మహావీరుడులో మెయిన్ విలన్ గా నటించింది ఈయనే. విశాల్ తో తనకు అపార్థాలు వచ్చాయని, అవి త్వరలో సమిసిపోయి మంచి స్నేహితులు అవుతామని ఆగస్ట్ నెలలో ఇంకో సినిమా ఫంక్షన్లో చెప్పిన మిస్కిన్ మాటలకు భిన్నంగా విశాల్ ఇంకా జరిగింది మర్చిపోలేదని చెప్పడం గమనార్హం. ఈ వారం 15 విడుదల కాబోతున్న మార్క్ ఆంటోనీ మీద విశాల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టి తీశారు. స్కంద, చంద్రముఖి 2 తప్పుకోవడం పెద్ద ప్లస్ కానుంది.

This post was last modified on September 13, 2023 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

12 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago