కేవలం నాలుగు రోజుల్లోనే అయిదు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ ని ఊపేసిన జవాన్ హఠాత్తుగా సోమవారం నుంచి చాలా చోట్ల విపరీతంగా నెమ్మదించాడు. సాధారణంగా మండే డ్రాప్స్ అందరికీ ఉంటాయి కానీ దీనికొచ్చిన టాక్ కి ఇది మరీ తీవ్ర స్థాయిలో ఉండకూడదనేది బయ్యర్ల అభిప్రాయం. ఆదివారం ఒక్క రోజు 70 కోట్లకు పైగా రాబట్టిన షారుఖ్ ఖాన్ నిన్న అమాంతం 40 శాతానికి పైగా తగ్గుదలతో కేవలం 27 కోట్లు వసూలు చేయడం ఆందోళన రేపుతోంది. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ప్రభావం ఉందని అభిమానులు సమర్ధించుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా ఉందట.
మొదటి నాలుగు రోజుల్లోనే మెజారిటీ ఆడియన్స్ జవాన్ ని చూసేశారు. బాగా చల్లబడ్డాక, రద్దీ తగ్గాక థియేటర్లకు వెళదామని ఆగిన న్యూట్రల్ ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అయితే షారుఖ్ వన్ మ్యాన్ షో షో తప్ప కంటెంట్ పరంగా మరీ గొప్పగా ఏం లేదన్న టాక్ ఆలస్యంగా రావడంతో వాళ్ళ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. బాలీవుడ్ మీడియా ఏకంగా 4, 5 రేటింగ్స్ ఇచ్చి కొంచెం ఓవర్ చేసింది కానీ సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రం మహా అయితే మూడు మించి ఎవరూ సర్టిఫై చేయలేదు.
గతంలో బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లకు ఇలాంటి పరిస్థితి రాలేదు. సండే మండే తేడా లేకుండా కనీసం పది రోజుల నుంచి రెండు వారాల దాకా సాలిడ్ రన్ కొనసాగించాయి. కానీ జవాన్ అంత స్టేజిలో లేదు. పైగా లెక్కల విషయంలో రెడ్ చిల్లీస్ సంస్థ అదనంగా నెంబర్లు కలుపుతోందన్న వాదనలు ముంబై వర్గాల్లో వినిపిస్తున్నాయి. గదర్ 2, పఠాన్ కి సైతం ఇలాగే చేశారని, దక్షిణాదికి ధీటుగా మా సినిమాలు ఆడుతున్నాయని చెప్పుకోవడానికి ఇలా చేస్తున్నారనే కామెంట్స్ లో నిజానిజాలు పెరుమాళ్ళకే ఎరుక. ఇప్పుడు ఎంత స్లో అయినా ఇంకో వీకెండ్ మాత్రం జవాన్ కంట్రోల్ లోకి వచ్చేలా ఉంది.
This post was last modified on September 12, 2023 4:03 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…