కేవలం నాలుగు రోజుల్లోనే అయిదు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ ని ఊపేసిన జవాన్ హఠాత్తుగా సోమవారం నుంచి చాలా చోట్ల విపరీతంగా నెమ్మదించాడు. సాధారణంగా మండే డ్రాప్స్ అందరికీ ఉంటాయి కానీ దీనికొచ్చిన టాక్ కి ఇది మరీ తీవ్ర స్థాయిలో ఉండకూడదనేది బయ్యర్ల అభిప్రాయం. ఆదివారం ఒక్క రోజు 70 కోట్లకు పైగా రాబట్టిన షారుఖ్ ఖాన్ నిన్న అమాంతం 40 శాతానికి పైగా తగ్గుదలతో కేవలం 27 కోట్లు వసూలు చేయడం ఆందోళన రేపుతోంది. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ప్రభావం ఉందని అభిమానులు సమర్ధించుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా ఉందట.
మొదటి నాలుగు రోజుల్లోనే మెజారిటీ ఆడియన్స్ జవాన్ ని చూసేశారు. బాగా చల్లబడ్డాక, రద్దీ తగ్గాక థియేటర్లకు వెళదామని ఆగిన న్యూట్రల్ ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అయితే షారుఖ్ వన్ మ్యాన్ షో షో తప్ప కంటెంట్ పరంగా మరీ గొప్పగా ఏం లేదన్న టాక్ ఆలస్యంగా రావడంతో వాళ్ళ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. బాలీవుడ్ మీడియా ఏకంగా 4, 5 రేటింగ్స్ ఇచ్చి కొంచెం ఓవర్ చేసింది కానీ సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రం మహా అయితే మూడు మించి ఎవరూ సర్టిఫై చేయలేదు.
గతంలో బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లకు ఇలాంటి పరిస్థితి రాలేదు. సండే మండే తేడా లేకుండా కనీసం పది రోజుల నుంచి రెండు వారాల దాకా సాలిడ్ రన్ కొనసాగించాయి. కానీ జవాన్ అంత స్టేజిలో లేదు. పైగా లెక్కల విషయంలో రెడ్ చిల్లీస్ సంస్థ అదనంగా నెంబర్లు కలుపుతోందన్న వాదనలు ముంబై వర్గాల్లో వినిపిస్తున్నాయి. గదర్ 2, పఠాన్ కి సైతం ఇలాగే చేశారని, దక్షిణాదికి ధీటుగా మా సినిమాలు ఆడుతున్నాయని చెప్పుకోవడానికి ఇలా చేస్తున్నారనే కామెంట్స్ లో నిజానిజాలు పెరుమాళ్ళకే ఎరుక. ఇప్పుడు ఎంత స్లో అయినా ఇంకో వీకెండ్ మాత్రం జవాన్ కంట్రోల్ లోకి వచ్చేలా ఉంది.
This post was last modified on September 12, 2023 4:03 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…