కేవలం నాలుగు రోజుల్లోనే అయిదు వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ ని ఊపేసిన జవాన్ హఠాత్తుగా సోమవారం నుంచి చాలా చోట్ల విపరీతంగా నెమ్మదించాడు. సాధారణంగా మండే డ్రాప్స్ అందరికీ ఉంటాయి కానీ దీనికొచ్చిన టాక్ కి ఇది మరీ తీవ్ర స్థాయిలో ఉండకూడదనేది బయ్యర్ల అభిప్రాయం. ఆదివారం ఒక్క రోజు 70 కోట్లకు పైగా రాబట్టిన షారుఖ్ ఖాన్ నిన్న అమాంతం 40 శాతానికి పైగా తగ్గుదలతో కేవలం 27 కోట్లు వసూలు చేయడం ఆందోళన రేపుతోంది. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ప్రభావం ఉందని అభిమానులు సమర్ధించుకుంటున్నా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా ఉందట.
మొదటి నాలుగు రోజుల్లోనే మెజారిటీ ఆడియన్స్ జవాన్ ని చూసేశారు. బాగా చల్లబడ్డాక, రద్దీ తగ్గాక థియేటర్లకు వెళదామని ఆగిన న్యూట్రల్ ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అయితే షారుఖ్ వన్ మ్యాన్ షో షో తప్ప కంటెంట్ పరంగా మరీ గొప్పగా ఏం లేదన్న టాక్ ఆలస్యంగా రావడంతో వాళ్ళ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపిస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. బాలీవుడ్ మీడియా ఏకంగా 4, 5 రేటింగ్స్ ఇచ్చి కొంచెం ఓవర్ చేసింది కానీ సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రం మహా అయితే మూడు మించి ఎవరూ సర్టిఫై చేయలేదు.
గతంలో బాహుబలి, కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లకు ఇలాంటి పరిస్థితి రాలేదు. సండే మండే తేడా లేకుండా కనీసం పది రోజుల నుంచి రెండు వారాల దాకా సాలిడ్ రన్ కొనసాగించాయి. కానీ జవాన్ అంత స్టేజిలో లేదు. పైగా లెక్కల విషయంలో రెడ్ చిల్లీస్ సంస్థ అదనంగా నెంబర్లు కలుపుతోందన్న వాదనలు ముంబై వర్గాల్లో వినిపిస్తున్నాయి. గదర్ 2, పఠాన్ కి సైతం ఇలాగే చేశారని, దక్షిణాదికి ధీటుగా మా సినిమాలు ఆడుతున్నాయని చెప్పుకోవడానికి ఇలా చేస్తున్నారనే కామెంట్స్ లో నిజానిజాలు పెరుమాళ్ళకే ఎరుక. ఇప్పుడు ఎంత స్లో అయినా ఇంకో వీకెండ్ మాత్రం జవాన్ కంట్రోల్ లోకి వచ్చేలా ఉంది.
This post was last modified on September 12, 2023 4:03 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…