ఒక నటుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కేవలం తన టాలెంట్తో హీరోగా నిలదొక్కుకోవడం.. తనకంటూ ఒక ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇందుకోసం ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి ఉంటుంది. కానీ అలా కష్టపడి ఎదిగిన వాళ్ల మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక అభిమానం ఉంటుంది. నవీన్ పొలిశెట్టి ఈ కోవకు చెందిన నటుడే.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా మారడానికి ముందు నవీన్ సినీ పరిశ్రమలో డక్కా మొక్కీలు తిన్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’; ‘1 నేనొక్కడినే’ లాంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశాడు. ఇంకేవో చిన్న చిన్న పాత్రలు చేశాడు. వాటితో పాటే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేశాడు. అతను చేసిన హిందీ షార్ట్ ఫిలిమ్స్ ఉత్తరాదిన తనకు గుర్తింపు తెచ్చాయి. ఐతే తెలుగులో బ్రేక్ అందుకోవడానికి మాత్రం చాలా టైం పట్టింది.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో తన టాలెంట్ ఏంటో చూపించి హీరోగా తొలి సక్సెస్ అందుకున్న నవీన్కు ‘జాతిరత్నాలు’ ఇంకా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అతను లీడ్ రోల్ చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సైతం మంచి విజయాన్నందుకుంది. ఏ బ్యాగ్రౌండ్ లేని నటుడు.. హీరోగా ఇలా వరుసగా మూడు సక్సెస్లు అందుకోవడం అరుదైన విషయమే. ఐతే ఈ మూడు సినిమాలు చేయడానికి నవీన్కు ఆరేళ్లు పట్టేసింది. సినిమాకు సినిమాకు మధ్య రెండేళ్ల విరామం వచ్చింది.
కాస్త ఫేమ్ రాగానే ఎడా పెడా సినిమాలు ఒప్పేసుకుని పేరు చెడగొట్టుకోకుండా.. ఇలా ఆచితూచి అడుగులు వేయడం మంచిదే. కానీ కెరీర్లో నిలదొక్కుకోవడానికి చాలా ఏళ్లు పట్టిన నేపథ్యంలో నవీన్ ఇకపై స్పీడ్ పెంచాల్సిందే. తన కెరీర్లో పతాక స్థాయిని అందుకున్న అతను.. దాన్ని ఉపయోగించుకుని ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయాల్సిన అవసరముంది. నవీన్ కొత్త చిత్రంపై ఇంకా ప్రకటన అయితే రాలేదు. సాధ్యమైనంత త్వరగా దాన్ని ఓకే చేసి.. ఇక చకచకా సినిమాలు చేయాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on September 11, 2023 7:11 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…