కరోనా వైరస్ ధాటికి మూతపడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడం.. కనీసం ఆరు నెలల పాటు థియేట్రికల్ రిలీజ్లపై సినిమాలు ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని స్పష్టమవుతుండటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ చేసేసే ప్రతిపాదన గురించి ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది.
కాస్త పేరున్న సినిమాలేవీ ఇప్పుడిప్పుడే ఇలాంటి సాహసాలు చేయకపోవచ్చని టాలీవుడ్ పెద్దల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఐతే చిన్న సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ గురించి మరీ ఎక్కువ ఆలోచించకుండా ఓటీటీల వైపు వెళ్లిపోవడం ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమృతారామమ్ అనే ఓ చిన్న సినిమా ఈ దిశగానే అడుగులు వేసింది. ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.
ఈ నెల 29న జీ5లో అమృతారామమ్ను ప్రిమియర్గా వేయబోతున్నారు. సురేందర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా మామూలు పరిస్థితులుండుంటే ఈపాటికి థియేటర్లలో రిలీజయ్యేది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా తీసుకుంది. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో ఆ డీల్ రద్దయినట్లుంది.
మళ్లీ థియేటర్లు తెరుచుకునేదాకా ఎదురుచూడ్డం కంటే ఈ చిన్న సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఐతే అంతకంటే ముందు తమిళంలో ఒక స్థాయి ఉన్న సినిమానే నేరుగా అమేజాన్ ప్రైమ్లోకి వచ్చేస్తోంది.
ఈ సినిమా పేరు.. పొన్ మగళ్ వందాల్ (అమ్మాయి వచ్చింది). ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్, సూర్య సతీమణి జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. జేజే ఫ్రెడరిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరిందరు పేరున్న నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ చేసేస్తున్నారు.
This post was last modified on April 25, 2020 12:19 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…