కరోనా వైరస్ ధాటికి మూతపడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడం.. కనీసం ఆరు నెలల పాటు థియేట్రికల్ రిలీజ్లపై సినిమాలు ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని స్పష్టమవుతుండటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో నేరుగా రిలీజ్ చేసేసే ప్రతిపాదన గురించి ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది.
కాస్త పేరున్న సినిమాలేవీ ఇప్పుడిప్పుడే ఇలాంటి సాహసాలు చేయకపోవచ్చని టాలీవుడ్ పెద్దల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఐతే చిన్న సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ గురించి మరీ ఎక్కువ ఆలోచించకుండా ఓటీటీల వైపు వెళ్లిపోవడం ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమృతారామమ్ అనే ఓ చిన్న సినిమా ఈ దిశగానే అడుగులు వేసింది. ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.
ఈ నెల 29న జీ5లో అమృతారామమ్ను ప్రిమియర్గా వేయబోతున్నారు. సురేందర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా మామూలు పరిస్థితులుండుంటే ఈపాటికి థియేటర్లలో రిలీజయ్యేది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా తీసుకుంది. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో ఆ డీల్ రద్దయినట్లుంది.
మళ్లీ థియేటర్లు తెరుచుకునేదాకా ఎదురుచూడ్డం కంటే ఈ చిన్న సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఐతే అంతకంటే ముందు తమిళంలో ఒక స్థాయి ఉన్న సినిమానే నేరుగా అమేజాన్ ప్రైమ్లోకి వచ్చేస్తోంది.
ఈ సినిమా పేరు.. పొన్ మగళ్ వందాల్ (అమ్మాయి వచ్చింది). ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్, సూర్య సతీమణి జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. జేజే ఫ్రెడరిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరిందరు పేరున్న నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ చేసేస్తున్నారు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…