బాలీవుడ్ మాస్ కి నిజమైన నిర్వచనం ఇస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఒకే ఏడాదిలో రెండు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించడమే కాక నాలుగు రోజులు వరసగా రోజుకో వంద కోట్లకు పైగా సాధించిన ఏకైక హీరోగా కొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్, పలుచోట్ల వర్షాలతో కూడిన ముసురు వాతావరణం, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ఇవేవి బాద్షా ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. దాదాపుగా నిన్న షోలన్నీ హౌస్ ఫుల్ కావడమే కాక చాలా చోట్ల బీసీ సెంటర్లలో టికెట్లు దొరక్క వెనక్కు తిరిగిన ప్రేక్షకులు లక్షల్లో ఉంటారని ప్రత్యక్షంగా చూసిన బయ్యర్లు చెబుతున్నారు.
ట్రేడ్ నుంచి అందిన ప్రాధమిక సమాచారం మేరకు జవాన్ ఇప్పటిదాకా 531 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇంత వేగంగా అర సహస్రం దాటిన మూవీగా మరో మైలురాయి అందుకుంది. వరసగా నాలుగు రోజులు 125, 109, 140, 156 కోట్లను కొల్లగొడుతూ పోయిన షారుఖ్ ఈ నెంబర్లను బట్టే ఎంత అరాచకం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. లెక్కల్లో కొన్ని స్వల్ప మార్పులు ఉండొచ్చేమో కానీ ఈ పరిణామాలు నార్త్ ట్రేడ్ లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. గత నెల గదర్ 2 బాక్సాఫీస్ ని కళకళలాడించగా ఇప్పుడు జవాన్ అంతకు మించి అనేలా దాన్ని ఒక్క వీకెండ్ లోనే దాటేసింది.
జవాన్ సెట్ చేసిన రికార్డులు చూసి మతులు పోతున్నాయి. ఏదో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ అయితే ఏదో అనుకోవచ్చు. ఎన్నో పాత కథలను తీసుకుని కిచిడి చేసి దర్శకుడు అట్లీ ఊర మాస్ గా ప్రెజెంట్ చేసిన ఒక కమర్షియల్ సినిమా ఇన్ని అద్భుతాలు చేయడం గొప్ప విషయం. చాలా ఏళ్లుగా ,మరుగునపడిన షారుఖ్ అసలు స్టామినాని బయటికి తీయడంతో ప్రేక్షకులు వెర్రెక్కిపోతున్నారు. ఈ దూకుడు ఇంకో రెండు వారాలు ఈజీగా కొనసాగుతుందని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. వెయ్యి కోట్లు కన్ఫర్మ్ కానీ అది ఎప్పటి లోపే, ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందనేది ఊహకందని విషయం.
This post was last modified on September 11, 2023 12:16 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…