గత ఏడాది తెలుగులో వచ్చిన డీసెంట్ హిట్లలో ‘రాక్షసుడు’ ఒకటి. తమిళంలో రెండేళ్ల కిందట సెన్సేషనల్ హిట్టయిన ‘రాక్షసన్’ను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ రీమేక్ చేశాడు. ఒరిజినల్ను యాజిటీజ్గా దించేసినప్పటికీ.. కథలో ఉన్న బలం, కథనంలో ఉన్న ఉత్కంఠ వల్ల తెలుగులోనూ ఈ సినిమా బాగానే ఆడింది. ఈ మధ్యే ఈ చిత్ర వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా ‘రాక్షసుడు’కు తెలుగులో సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అదెంత వరకు నిజమో కానీ.. ఇప్పుడు మాత్రం ‘రాక్షసుడు’ రీమేక్ గురించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీలోకి తీసుకెళ్తున్నారు. తెలుగు వెర్షన్ను నిర్మించిన కోనేరు సత్యనారాయణనే హిందీ రీమేక్ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దర్శకుడు రమేష్ వర్మనే. రమేష్ పుట్టిన రోజును పురస్కరించుుకుని మీడియాకు ఈ అప్ డేట్ ఇచ్చారు.
‘రాక్షసుడు’ సక్సెస్ తర్వాత రమేష్కు రవితేజతో సినిమా చేసే అవకాశం దక్కింది. ఐతే ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. అది పూర్తి చేసిన తర్వాత రమేష్ హిందీ ‘రాక్షసుడు’ను డైరెక్ట్ చేస్తాడట. ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఇందులో లీడ్ రోల్ చేస్తాడట. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే రమేష్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు యాజిటీజ్ దించేశాడు. కాపీ-పేస్ట్ వ్యవహారంలా అనిపించిందది. కొన్ని సన్నివేశాలైతే ఒరిజినల్ నుంచి అలాగే తీసి పెట్టేశారు కూడా. ఇప్పుడు హిందీ వెర్షన్ తీయడంలోనూ రమేష్కు పెద్దగా శ్రమ లేకపోవచ్చు. ఏదైనా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని టేకప్ చేస్తే.. మార్పులు చేర్పులు, మేకింగ్లో వాళ్ల టచ్ ఇవ్వడానికి చూసేవాళ్లు. కానీ హిందీలో కూడా తెలుగు నిర్మాతే ప్రొడ్యూస్ చేయడంతో రమేష్ పని తేలికే కావచ్చు. కాకపోతే వీళ్లను నమ్మి హిందీలో ఈ సినిమా చేసే స్టార్ ఎవరన్నదే ప్రశ్న.
This post was last modified on August 22, 2020 4:09 am
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…