మోస్ట్ వాంటెడ్ సంగీత దర్శకుడిగా కెరీర్ పీక్స్ ని ఎంజాయ్ చేస్తున్న అనిరుద్ రవిచందర్ ఇటీవలే జైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కావాలయ్యా పాట ఏ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్టయ్యాయో చూస్తాం. బిజిఎం ఏ మాత్రం బాలన్స్ తప్పినా తెరమీద నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్ నీరసంగా కనిపించేది. బక్కోడని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే అనిరుద్ కరెక్ట్ గా డ్యూటీ చేస్తే అవుట్ ఫుట్ ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే జవాన్ ఎంత ఇండస్ట్రీ హిట్ దిశగా పరుగులు పెడుతున్నా మ్యూజిక్ విషయంలో మాత్రం యునానిమస్ గా బెస్ట్ అనే రిపోర్ట్స్ రాని మాట వాస్తవం. గొప్పగా అనిపించే క్యాచీ ట్యూన్లు పడలేదు.
ఇతర బాష కాబట్టి అలా అయ్యుండొచ్చనే కామెంట్ నిజం కాదు. ఎందుకంటే పని చేయించుకుంది తమిళ దర్శకుడే. పైగా వీళ్ళ కలయిక మొదటిసారి కాదు. అలాంటప్పుడు తేడా ఎక్కడ కొట్టింది. జిందా బందా తెరమీద గొప్పగా వచ్చింది కానీ దాంతో సహా మిగిలినవన్నీ ఆడియో పరంగా రిపీట్ వేల్యూ ఉన్నవి కాదు. ఇప్పుడీ టాపిక్ ఎందుకంటారా. జూనియర్ ఎన్టీఆర్ దేవరకు ఇంకా ట్యూన్స్ ఫైనల్ కాలేదు. మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న కొరటాల శివ అనిరుద్ నుంచి బెస్ట్ రాబట్టుకోవడం పెద్ద సవాలే. తెలుగులో అజ్ఞాతవాసి, జెర్సిలాంటి స్ట్రెయిట్ ఆల్బమ్స్ చేసినా అవి ఎవర్ గ్రీనని చెప్పుకునే స్థాయిలో రాలేదు.
విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరికి పని చేస్తోంది కూడా అనిరుదే. ప్రస్తుతానికి రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదు కానీ ముందైతే సిట్టింగ్స్ పూర్తి చేసుకుని పాటలు సిద్ధంగా పెట్టుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. కానీ అనిరుద్ అంత సులభంగా దొరకడం లేదు. ఒకరకంగా శివ, గౌతమ్ లకు అవుట్ ఫుట్ రాబట్టుకోవడం అంత సులభం కాదు. పైగా చెన్నైలో ఉండే అతగాడిని మాటికి హైదరాబాద్ తీసుకురాలేరు. వచ్చినప్పుడే పిండేసుకోవాలి. చేతి నిండా సినిమాలతో తెగ బిజీగా ఉన్న కుర్ర సంచలనంతో కనక కోరుకున్న ఫలితం రాబట్టుకుంటే మాత్రం భారీగా ముట్టజెప్పిన పారితోషికానికి న్యాయం జరుగుతుంది.
This post was last modified on September 10, 2023 4:27 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…