మంచి విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా భక్త కన్నప్పను ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు రెండు వందల కోట్లతో తీస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అసలు స్వీట్ అండ్ షాక్ న్యూస్ మరొకటి వచ్చింది. ప్రభాస్ ని ఒక ప్రత్యేకమైన క్యామియో కోసం అడిగితే తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అది మహాశివుడి క్యారెక్టరేనని విశ్వసనీయ సమాచారం. సోషల్ మీడియాలో పలువురు ట్వీట్లు పెడితే వాటిలో ఒకదానికి విష్ణు స్పందిస్తూ హరహరమహాదేవ్ అంటూ రీ కోట్ చేయడంతో న్యూస్ నిర్ధారణ అయినట్టేనని చెప్పాలి.
ఎంత సేపు ఉంటాడు, విష్ణు ప్రభాస్ కలయికలో ఎలాంటి సన్నివేశాలు వస్తాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. డార్లింగ్ దీని మీద ఆసక్తి చూపించడానికి రెండు ప్రత్యేక కారణాలున్నాయి. పెదనాన్న కలల ప్రాజెక్ట్ భక్త కన్నప్ప. తనతోనే తీయాలని చాలా బలంగా కోరుకున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు విష్ణుతో అది సాధ్యమవుతోంది కాబట్టి కనీసం అందులో పాత్ర చేయడం ద్వారా అయినా కృష్ణంరాజు గారి కోరికని ఈ రకంగా నెరవేర్చిన సంతృప్తి మిగులుతుంది. పైగా మోహన్ బాబు కుటుంబంతో ప్రభాస్ ఫ్యామిలీకు ఎంతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
ఒక్కసారిగా కన్నప్ప నేషనల్ వైడ్ టాక్ అయిపోయింది. ప్రభాస్ వచ్చేశాడు కాబట్టి స్కేల్ పెరుగుతుంది. రెండు వందలు కాదు ఇంకో వంద కోట్లు ఎక్స్ ట్రా పెట్టినా సరే ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. కాకపోతే డార్లింగ్ నిడివి ఎంత ఉంటుందనేది కీలకంగా మారనుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ డ్రామాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది విడుదల ప్లాన్ చేసుకుంటున్న కన్నప్పకి ఒక కీలక షెడ్యూల్ విదేశాల్లో చేయబోతున్నారు. సెట్ వర్క్ తో పాటు విఎఫెక్స్ భారీగా ఉండబోతున్న ఈ గ్రాండియర్ లో మిగిలిన క్యాస్టింగ్ ని ప్రకటించాల్సి ఉంది
This post was last modified on September 10, 2023 12:52 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…