Movie News

అప్పుడు ఫ్లాప్ ఇప్పుడు బ్లాక్ బస్టర్

ఏ ఇండస్ట్రీలో అయిన సక్సెస్ ఉంటేనే గుర్తింపు దక్కుతుంది. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోరు. తాజాగా టాలీవుడ్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఓ దర్శకుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. విషయంలోకి వెళితే.. అనుష్క , నవీన్ పొలిశెట్టి జంటగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ థియేటర్స్ లో మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. తొలి రోజు జవాన్ ఎఫెక్ట్ తో మంచి ఓపెనింగ్ మిస్ అయినా రెండో రోజు నుండి పుంజుకుంది. వీకెండ్ లో ఈ సినిమా మంచి వసూళ్లు సాదించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ దాటేసి 1 మిలియన్ డాలర్ వైపుగా వెళ్తుంది. 

ఈ సినిమాకు దర్శకుడు మహేష్ బాబు. గతంలో ఈ దర్శకుడు సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ అనే సినిమా చేశాడు. దాని రిజల్ట్ తెలిసిందే. ఆ మూవీ తర్వాత కొన్నేళ్ళు కష్టపడి ఓ సెన్సిబుల్ కథ రెడీ చేసుకొని యూవీ క్రియేషన్స్ ను అప్రోచ్ అయ్యాడు. తర్వాత అనుష్క ,నవీన్ పోలిశెట్టి లను తన కథతో ఒప్పించాడు. వారిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కథకి బాగా కలిసొచ్చింది. వీర్య దానం కాన్సెప్ట్ ను క్లీన్ ఎంటర్టైనయింగ్ గా తెరకెక్కించి మహేష్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. రాజమౌళి వంటి దిగ్గజం కూడా మహేష్ వర్క్ ను సోషల్ మీడియా ద్వారా మెచ్చుకున్నాడు.   

 ఒక ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు  బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లో జెండా పాతేశాడు. తన సెన్సిబుల్ కామెడీ రైటింగ్ తో ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్విస్తూ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ నెక్స్ట్ సినిమా కూడా యూవీలోనే  చేసే ఛాన్స్ ఉంది.

This post was last modified on September 10, 2023 12:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago