ఏ ఇండస్ట్రీలో అయిన సక్సెస్ ఉంటేనే గుర్తింపు దక్కుతుంది. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోరు. తాజాగా టాలీవుడ్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఓ దర్శకుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. విషయంలోకి వెళితే.. అనుష్క , నవీన్ పొలిశెట్టి జంటగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ థియేటర్స్ లో మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. తొలి రోజు జవాన్ ఎఫెక్ట్ తో మంచి ఓపెనింగ్ మిస్ అయినా రెండో రోజు నుండి పుంజుకుంది. వీకెండ్ లో ఈ సినిమా మంచి వసూళ్లు సాదించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ దాటేసి 1 మిలియన్ డాలర్ వైపుగా వెళ్తుంది.
ఈ సినిమాకు దర్శకుడు మహేష్ బాబు. గతంలో ఈ దర్శకుడు సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ అనే సినిమా చేశాడు. దాని రిజల్ట్ తెలిసిందే. ఆ మూవీ తర్వాత కొన్నేళ్ళు కష్టపడి ఓ సెన్సిబుల్ కథ రెడీ చేసుకొని యూవీ క్రియేషన్స్ ను అప్రోచ్ అయ్యాడు. తర్వాత అనుష్క ,నవీన్ పోలిశెట్టి లను తన కథతో ఒప్పించాడు. వారిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కథకి బాగా కలిసొచ్చింది. వీర్య దానం కాన్సెప్ట్ ను క్లీన్ ఎంటర్టైనయింగ్ గా తెరకెక్కించి మహేష్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. రాజమౌళి వంటి దిగ్గజం కూడా మహేష్ వర్క్ ను సోషల్ మీడియా ద్వారా మెచ్చుకున్నాడు.
ఒక ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లో జెండా పాతేశాడు. తన సెన్సిబుల్ కామెడీ రైటింగ్ తో ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్విస్తూ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ నెక్స్ట్ సినిమా కూడా యూవీలోనే చేసే ఛాన్స్ ఉంది.
This post was last modified on September 10, 2023 12:20 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…