తెలుగు ప్రేక్షకులకు వారానికి కనీసం రెండు మూడు కొత్త సినిమాలు లేకపోతే నడవదు. బాగుండటం లేకపోవడం తర్వాత సంగతి కనీసం ఏవో ఒకటి థియేటర్లకు వస్తే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటారు. అయితే సలార్ వాయిదా వల్ల తలెత్తిన అనూహ్య పరిణామాల వల్ల స్కంద, చంద్రముఖి 2లు తప్పుకుని విశాల్ మార్క్ ఆంటోనీ ఒకటే వినాయక చవితి బరిలో నిలబడింది. దీంతో వేరే ఆప్షన్ లేకుండా పోయింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలని మిస్ చేసుకున్నవాళ్ళు వాటికి ఓటేస్తారు కానీ కొత్త కంటెంట్ కోరుకునే వాళ్లకు మాత్రం విశాల్ ఒకడే కనిపిస్తున్నాడు.
ఈ గ్యాప్ ని వాడుకునేందుకు బిచ్చగాడు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 15న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించేశారు. నిజానికిది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం. ఎలాగూ పాత సినిమాలు డబ్బింగ్ అయినా సరే బాగుంటే ఎగబడి చూస్తున్నారని సూర్య సన్ అఫ్ కృష్ణన్, 3, రఘువరన్ బిటెక్ లాంటివి నిరూపించాయి. సో బిచ్చగాడుకి ఇదే రైట్ టైం అనుకుంటున్నారు. దీని బ్రాండ్ మార్కెట్ లో ఎంత బలంగా ఉందంటే విజయ్ ఆంటోనీ ఇమేజ్ దారుణంగా పడిపోయినా కేవలం ఈ బ్రాండ్ మీద సీక్వెల్ కి బిజినెస్ ప్లస్ లాభాలు వచ్చాయి.
సో బిచ్చగాడు ఆశపడటంలో తప్పు లేదు. కేవలం యాభై లక్షలకు హక్కులు కొంటే పాతిక కోట్లకు పైగా వసూళ్లు వర్షం కురిపించిన ఈ బ్లాక్ బస్టర్ కు ఇన్నేళ్లు గడిచినా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అయితే మాస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా థియేటర్స్ లో డాన్సులు చేయడానికి, విజిల్స్ కొట్టడానికి అవసరమైన స్టఫ్ ఉండదు. తల్లి సెంటిమెంట్ తో పాటు అడుక్కునేవాళ్ళ బ్యాక్ గ్రోప్ వైరెటీగా వర్కౌట్ అయ్యింది. అమ్మా అమ్మా పాటను ఎమోషనల్ గా అప్పట్లో ఫీలయ్యారు కానీ ఇప్పుడదే భావోద్వేగం మళ్ళీ పుట్టించడం కష్టమే. చూడాలి మరి క్లాసిక్ గా నిలబడిన బిచ్చగాడు రీ రిలీజ్ లో అద్భుతం చేస్తాడో చేయడో.
This post was last modified on September 9, 2023 7:27 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…