తెలుగు ప్రేక్షకులకు వారానికి కనీసం రెండు మూడు కొత్త సినిమాలు లేకపోతే నడవదు. బాగుండటం లేకపోవడం తర్వాత సంగతి కనీసం ఏవో ఒకటి థియేటర్లకు వస్తే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటారు. అయితే సలార్ వాయిదా వల్ల తలెత్తిన అనూహ్య పరిణామాల వల్ల స్కంద, చంద్రముఖి 2లు తప్పుకుని విశాల్ మార్క్ ఆంటోనీ ఒకటే వినాయక చవితి బరిలో నిలబడింది. దీంతో వేరే ఆప్షన్ లేకుండా పోయింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలని మిస్ చేసుకున్నవాళ్ళు వాటికి ఓటేస్తారు కానీ కొత్త కంటెంట్ కోరుకునే వాళ్లకు మాత్రం విశాల్ ఒకడే కనిపిస్తున్నాడు.
ఈ గ్యాప్ ని వాడుకునేందుకు బిచ్చగాడు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 15న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించేశారు. నిజానికిది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం. ఎలాగూ పాత సినిమాలు డబ్బింగ్ అయినా సరే బాగుంటే ఎగబడి చూస్తున్నారని సూర్య సన్ అఫ్ కృష్ణన్, 3, రఘువరన్ బిటెక్ లాంటివి నిరూపించాయి. సో బిచ్చగాడుకి ఇదే రైట్ టైం అనుకుంటున్నారు. దీని బ్రాండ్ మార్కెట్ లో ఎంత బలంగా ఉందంటే విజయ్ ఆంటోనీ ఇమేజ్ దారుణంగా పడిపోయినా కేవలం ఈ బ్రాండ్ మీద సీక్వెల్ కి బిజినెస్ ప్లస్ లాభాలు వచ్చాయి.
సో బిచ్చగాడు ఆశపడటంలో తప్పు లేదు. కేవలం యాభై లక్షలకు హక్కులు కొంటే పాతిక కోట్లకు పైగా వసూళ్లు వర్షం కురిపించిన ఈ బ్లాక్ బస్టర్ కు ఇన్నేళ్లు గడిచినా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అయితే మాస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా థియేటర్స్ లో డాన్సులు చేయడానికి, విజిల్స్ కొట్టడానికి అవసరమైన స్టఫ్ ఉండదు. తల్లి సెంటిమెంట్ తో పాటు అడుక్కునేవాళ్ళ బ్యాక్ గ్రోప్ వైరెటీగా వర్కౌట్ అయ్యింది. అమ్మా అమ్మా పాటను ఎమోషనల్ గా అప్పట్లో ఫీలయ్యారు కానీ ఇప్పుడదే భావోద్వేగం మళ్ళీ పుట్టించడం కష్టమే. చూడాలి మరి క్లాసిక్ గా నిలబడిన బిచ్చగాడు రీ రిలీజ్ లో అద్భుతం చేస్తాడో చేయడో.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…