మలయాళంలో రెండేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘నాయట్టు’. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వ్యక్తులు.. ఆ వ్యవస్థ చేతిలో ఎలా పావులుగా మారతారో.. బలిపశువులు అవుతారో చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్గానూ మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా రిలీజైన కొంత కాలానికే తెలుగు రీమేక్ తెరపైకి వచ్చింది.
గీతా ఆర్ట్స్ వాళ్లు హక్కులు కొని.. కరుణ్ కుమార్ దర్శకత్వంలో రీమేక్ను అనౌన్స్ చేశారు కూడా. రావు రమేష్, ప్రియదర్శి, అంజలిల కాంబినేషన్లో ఈ సినిమా తీయాలనుకున్నారు. షూటింగ్ షెడ్యూళ్లు కూడా వేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా ముందుకు కదల్లేదు. తర్వాత అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయారు. కట్ చేస్తే.. పూర్తిగా కొత్త టీంతో ఈ ఏడాది సినిమాను పట్టాలెక్కించారు. ‘కోటబొమ్మాళి పీఎస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. కానీ ముందు అనౌన్స్ చేసిన కాస్ట్తో పోలిస్తే ఇప్పుడు నటీనటులు అంత ఎగ్జైటింగ్గా అనిపించడం లేదు. మలయాళంలో జోజు జార్జ్ చేసిన పాత్రకు రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేనే బాగుండేది. ఆయన పెర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకు ఎసెట్ అయ్యేదేమో. కానీ ఆయన్ని కాదని శ్రీకాంత్ను పెట్టారు.
అతను మంచి నటుడే అయినా.. జోజు పాత్రకు ఏమాత్రం సూటవుతాడనే సందేహాలున్నాయి. పైగా శ్రీకాంత్ ఇప్పుడు ఫాంలో లేడు. రావు రమేష్ ఉంటే ఒక వైవిధ్యం కనిపించేది. అలాగే ప్రియదర్శి, అంజలి లాంటి పెర్ఫామర్లు చేస్తే ఆయా పాత్రలు బాగా ఎలివేట్ అయ్యేవి. ఇంకా నటులుగా నిలదొక్కుకోని రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఈ క్యారెక్టర్లను ఏమాత్రం నిలబెడతారన్నది సందేహం. కాకపోతే కథలో ఉన్న బలం.. యువ దర్శకుడు తేజ మర్ని పనితనం ఈ సినిమాను సక్సెస్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on September 9, 2023 2:25 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…