మలయాళంలో రెండేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘నాయట్టు’. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వ్యక్తులు.. ఆ వ్యవస్థ చేతిలో ఎలా పావులుగా మారతారో.. బలిపశువులు అవుతారో చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్గానూ మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా రిలీజైన కొంత కాలానికే తెలుగు రీమేక్ తెరపైకి వచ్చింది.
గీతా ఆర్ట్స్ వాళ్లు హక్కులు కొని.. కరుణ్ కుమార్ దర్శకత్వంలో రీమేక్ను అనౌన్స్ చేశారు కూడా. రావు రమేష్, ప్రియదర్శి, అంజలిల కాంబినేషన్లో ఈ సినిమా తీయాలనుకున్నారు. షూటింగ్ షెడ్యూళ్లు కూడా వేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా ముందుకు కదల్లేదు. తర్వాత అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయారు. కట్ చేస్తే.. పూర్తిగా కొత్త టీంతో ఈ ఏడాది సినిమాను పట్టాలెక్కించారు. ‘కోటబొమ్మాళి పీఎస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. కానీ ముందు అనౌన్స్ చేసిన కాస్ట్తో పోలిస్తే ఇప్పుడు నటీనటులు అంత ఎగ్జైటింగ్గా అనిపించడం లేదు. మలయాళంలో జోజు జార్జ్ చేసిన పాత్రకు రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేనే బాగుండేది. ఆయన పెర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకు ఎసెట్ అయ్యేదేమో. కానీ ఆయన్ని కాదని శ్రీకాంత్ను పెట్టారు.
అతను మంచి నటుడే అయినా.. జోజు పాత్రకు ఏమాత్రం సూటవుతాడనే సందేహాలున్నాయి. పైగా శ్రీకాంత్ ఇప్పుడు ఫాంలో లేడు. రావు రమేష్ ఉంటే ఒక వైవిధ్యం కనిపించేది. అలాగే ప్రియదర్శి, అంజలి లాంటి పెర్ఫామర్లు చేస్తే ఆయా పాత్రలు బాగా ఎలివేట్ అయ్యేవి. ఇంకా నటులుగా నిలదొక్కుకోని రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఈ క్యారెక్టర్లను ఏమాత్రం నిలబెడతారన్నది సందేహం. కాకపోతే కథలో ఉన్న బలం.. యువ దర్శకుడు తేజ మర్ని పనితనం ఈ సినిమాను సక్సెస్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on September 9, 2023 2:25 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…