మలయాళంలో రెండేళ్ల కిందట సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘నాయట్టు’. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వ్యక్తులు.. ఆ వ్యవస్థ చేతిలో ఎలా పావులుగా మారతారో.. బలిపశువులు అవుతారో చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్గానూ మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా రిలీజైన కొంత కాలానికే తెలుగు రీమేక్ తెరపైకి వచ్చింది.
గీతా ఆర్ట్స్ వాళ్లు హక్కులు కొని.. కరుణ్ కుమార్ దర్శకత్వంలో రీమేక్ను అనౌన్స్ చేశారు కూడా. రావు రమేష్, ప్రియదర్శి, అంజలిల కాంబినేషన్లో ఈ సినిమా తీయాలనుకున్నారు. షూటింగ్ షెడ్యూళ్లు కూడా వేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా ముందుకు కదల్లేదు. తర్వాత అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయారు. కట్ చేస్తే.. పూర్తిగా కొత్త టీంతో ఈ ఏడాది సినిమాను పట్టాలెక్కించారు. ‘కోటబొమ్మాళి పీఎస్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నారు. కానీ ముందు అనౌన్స్ చేసిన కాస్ట్తో పోలిస్తే ఇప్పుడు నటీనటులు అంత ఎగ్జైటింగ్గా అనిపించడం లేదు. మలయాళంలో జోజు జార్జ్ చేసిన పాత్రకు రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేనే బాగుండేది. ఆయన పెర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకు ఎసెట్ అయ్యేదేమో. కానీ ఆయన్ని కాదని శ్రీకాంత్ను పెట్టారు.
అతను మంచి నటుడే అయినా.. జోజు పాత్రకు ఏమాత్రం సూటవుతాడనే సందేహాలున్నాయి. పైగా శ్రీకాంత్ ఇప్పుడు ఫాంలో లేడు. రావు రమేష్ ఉంటే ఒక వైవిధ్యం కనిపించేది. అలాగే ప్రియదర్శి, అంజలి లాంటి పెర్ఫామర్లు చేస్తే ఆయా పాత్రలు బాగా ఎలివేట్ అయ్యేవి. ఇంకా నటులుగా నిలదొక్కుకోని రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఈ క్యారెక్టర్లను ఏమాత్రం నిలబెడతారన్నది సందేహం. కాకపోతే కథలో ఉన్న బలం.. యువ దర్శకుడు తేజ మర్ని పనితనం ఈ సినిమాను సక్సెస్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on September 9, 2023 2:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…