రెడీ అయిన సినిమాలన్నీ ఓటిటి రిలీజ్ బాట పడుతోంటే… రామ్ పోతినేని ‘రెడ్’ మాత్రం థియేటర్లు తెరిచే వరకు వేచి చూడనుంది. సొంత నిర్మాణ సంస్థలో తీయడం వల్ల నిర్మాత వైపు నుంచి రామ్కి ఒత్తిడి లేదు. పైగా ఈ చిత్రం హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ భారీ రేట్కి అమ్మేసారు. దీంతో ఆర్థిక పరమైన ఒత్తిడి కూడా లేదు. నిర్మాత స్రవంతి రవికిషోర్కి పలు ఓటిటి సంస్థల నుంచి ఆకర్షణీయమయిన ఆఫర్లు రాగా, రామ్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట. రామ్ ఇలా పట్టు పట్టడానికి కూడా ఒక కారణముంది. అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఫాలోయింగ్ వచ్చింది. దానిని ‘రెడ్’ మరింత పటిష్టం చేస్తుందని అతని నమ్మకం. అదీ కాక నానికి ‘టక్ జగదీష్’ రెడీగా వున్నట్టు రామ్కి మరో సినిమా సిద్ధంగా లేదు.
అందుకే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసి, మరో సినిమా కోసం మరో ఏడాది వరకు వేచి చూడడం దేనికని రామ్ ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని తన పెదనాన్నకు ఖరాఖండీగా చెప్పేసాడట. ఈ చిత్రానికి రామ్కి ప్రత్యేకించి పారితోషికం లేదు. లాభాల్లో వాటాదారుడు కనుక అతను కాదంటే రెడ్ ఓటిటిలో వచ్చే ఛాన్సే లేదు. ఇదిలావుంటే ఇంకా పది, ఇరవై రోజుల షూటింగ్ బాకీ వున్న సినిమాల హక్కులను కూడా ఓటిటి సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. థియేటర్లు తెరిచినా కానీ ఓటిటి ద్వారా కొన్ని సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాయి.
This post was last modified on August 22, 2020 2:54 pm
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను తాజా పరిచే కార్యక్రమానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…