రెడీ అయిన సినిమాలన్నీ ఓటిటి రిలీజ్ బాట పడుతోంటే… రామ్ పోతినేని ‘రెడ్’ మాత్రం థియేటర్లు తెరిచే వరకు వేచి చూడనుంది. సొంత నిర్మాణ సంస్థలో తీయడం వల్ల నిర్మాత వైపు నుంచి రామ్కి ఒత్తిడి లేదు. పైగా ఈ చిత్రం హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ భారీ రేట్కి అమ్మేసారు. దీంతో ఆర్థిక పరమైన ఒత్తిడి కూడా లేదు. నిర్మాత స్రవంతి రవికిషోర్కి పలు ఓటిటి సంస్థల నుంచి ఆకర్షణీయమయిన ఆఫర్లు రాగా, రామ్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట. రామ్ ఇలా పట్టు పట్టడానికి కూడా ఒక కారణముంది. అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఫాలోయింగ్ వచ్చింది. దానిని ‘రెడ్’ మరింత పటిష్టం చేస్తుందని అతని నమ్మకం. అదీ కాక నానికి ‘టక్ జగదీష్’ రెడీగా వున్నట్టు రామ్కి మరో సినిమా సిద్ధంగా లేదు.
అందుకే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసి, మరో సినిమా కోసం మరో ఏడాది వరకు వేచి చూడడం దేనికని రామ్ ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని తన పెదనాన్నకు ఖరాఖండీగా చెప్పేసాడట. ఈ చిత్రానికి రామ్కి ప్రత్యేకించి పారితోషికం లేదు. లాభాల్లో వాటాదారుడు కనుక అతను కాదంటే రెడ్ ఓటిటిలో వచ్చే ఛాన్సే లేదు. ఇదిలావుంటే ఇంకా పది, ఇరవై రోజుల షూటింగ్ బాకీ వున్న సినిమాల హక్కులను కూడా ఓటిటి సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. థియేటర్లు తెరిచినా కానీ ఓటిటి ద్వారా కొన్ని సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాయి.
This post was last modified on August 22, 2020 2:54 pm
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…