రెడీ అయిన సినిమాలన్నీ ఓటిటి రిలీజ్ బాట పడుతోంటే… రామ్ పోతినేని ‘రెడ్’ మాత్రం థియేటర్లు తెరిచే వరకు వేచి చూడనుంది. సొంత నిర్మాణ సంస్థలో తీయడం వల్ల నిర్మాత వైపు నుంచి రామ్కి ఒత్తిడి లేదు. పైగా ఈ చిత్రం హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ భారీ రేట్కి అమ్మేసారు. దీంతో ఆర్థిక పరమైన ఒత్తిడి కూడా లేదు. నిర్మాత స్రవంతి రవికిషోర్కి పలు ఓటిటి సంస్థల నుంచి ఆకర్షణీయమయిన ఆఫర్లు రాగా, రామ్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట. రామ్ ఇలా పట్టు పట్టడానికి కూడా ఒక కారణముంది. అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఫాలోయింగ్ వచ్చింది. దానిని ‘రెడ్’ మరింత పటిష్టం చేస్తుందని అతని నమ్మకం. అదీ కాక నానికి ‘టక్ జగదీష్’ రెడీగా వున్నట్టు రామ్కి మరో సినిమా సిద్ధంగా లేదు.
అందుకే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసి, మరో సినిమా కోసం మరో ఏడాది వరకు వేచి చూడడం దేనికని రామ్ ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని తన పెదనాన్నకు ఖరాఖండీగా చెప్పేసాడట. ఈ చిత్రానికి రామ్కి ప్రత్యేకించి పారితోషికం లేదు. లాభాల్లో వాటాదారుడు కనుక అతను కాదంటే రెడ్ ఓటిటిలో వచ్చే ఛాన్సే లేదు. ఇదిలావుంటే ఇంకా పది, ఇరవై రోజుల షూటింగ్ బాకీ వున్న సినిమాల హక్కులను కూడా ఓటిటి సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. థియేటర్లు తెరిచినా కానీ ఓటిటి ద్వారా కొన్ని సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాయి.
This post was last modified on August 22, 2020 2:54 pm
విశాఖపట్నం ఐటీ మ్యాప్పై మరింత బలంగా నిలవడానికి మరో భారీ అడుగు పడింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి…
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…