రెడీ అయిన సినిమాలన్నీ ఓటిటి రిలీజ్ బాట పడుతోంటే… రామ్ పోతినేని ‘రెడ్’ మాత్రం థియేటర్లు తెరిచే వరకు వేచి చూడనుంది. సొంత నిర్మాణ సంస్థలో తీయడం వల్ల నిర్మాత వైపు నుంచి రామ్కి ఒత్తిడి లేదు. పైగా ఈ చిత్రం హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ భారీ రేట్కి అమ్మేసారు. దీంతో ఆర్థిక పరమైన ఒత్తిడి కూడా లేదు. నిర్మాత స్రవంతి రవికిషోర్కి పలు ఓటిటి సంస్థల నుంచి ఆకర్షణీయమయిన ఆఫర్లు రాగా, రామ్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ చేయాల్సిందేనని పట్టుబట్టాడట. రామ్ ఇలా పట్టు పట్టడానికి కూడా ఒక కారణముంది. అతనికి ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఫాలోయింగ్ వచ్చింది. దానిని ‘రెడ్’ మరింత పటిష్టం చేస్తుందని అతని నమ్మకం. అదీ కాక నానికి ‘టక్ జగదీష్’ రెడీగా వున్నట్టు రామ్కి మరో సినిమా సిద్ధంగా లేదు.
అందుకే ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసి, మరో సినిమా కోసం మరో ఏడాది వరకు వేచి చూడడం దేనికని రామ్ ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని తన పెదనాన్నకు ఖరాఖండీగా చెప్పేసాడట. ఈ చిత్రానికి రామ్కి ప్రత్యేకించి పారితోషికం లేదు. లాభాల్లో వాటాదారుడు కనుక అతను కాదంటే రెడ్ ఓటిటిలో వచ్చే ఛాన్సే లేదు. ఇదిలావుంటే ఇంకా పది, ఇరవై రోజుల షూటింగ్ బాకీ వున్న సినిమాల హక్కులను కూడా ఓటిటి సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. థియేటర్లు తెరిచినా కానీ ఓటిటి ద్వారా కొన్ని సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నాయి.
This post was last modified on August 22, 2020 2:54 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…